logo

పనిచేసే వారికే ఇక్కడ స్థానం

తాలూకా అధికారులు నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని, స్పందించని అధికారుల అవసరం తనకు లేదని ఎమ్మెల్యే హంపయ్యనాయక్‌ హెచ్చరించారు.

Updated : 01 Jun 2023 04:40 IST

అధికారుల సమావేశంలో సూచనలు చేస్తున్న ఎమ్మెల్యే హంపయ్య నాయక్‌

మాన్వి, న్యూస్‌టుడే: తాలూకా అధికారులు నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని, స్పందించని అధికారుల అవసరం తనకు లేదని ఎమ్మెల్యే హంపయ్యనాయక్‌ హెచ్చరించారు. తనకు సమాచారం లేకుండా కార్యక్రమాలు నిర్వహించటానికి వీలులేదని స్పష్టం చేశారు. శాఖలకు నిర్దేశించిన ప్రగతి సాధించాల్సిందేనని ఆదేశించారు. ప్రభుత్వ సభలు, సమావేశాలకు అధికారులు తప్పకుండా హాజరు కావాలన్నారు. మాజీ ఎమ్మెల్యే హయాంలో జరిగిన పనులకు సంబంధించిన పూర్తి వివరాలతో తదుపరి సమావేశానికి రావాలన్నారు. పెండింగ్‌ పనులు, ప్రారంభించాల్సిన పనులకు సంబంధించిన వివరాలను తనకు తెలపాలన్నారు. పనులు, పైరవీల కోసం తన పేరు చెప్పుకొని ఎవరొచ్చినా అధికారులు పట్టించుకోరాదన్నారు. ఎవరైనా పైరవీలకు పాల్పడుతుంటే తన దృష్టికి తేవాలన్నారు.  గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా కృషి చేయాలన్నారు. తాలూకా పంచాయతీ కార్యనిర్వహణాధికారి మహ్మద్‌ సయ్యద్‌ పటేల్‌, సిరివార టీపీఈఓ మహేశ్‌, పురపాలక సంఘం ముఖ్యాధికారి వెంకçస్వామి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు