పిడుగులు పడి అపార నష్టం
కంప్లి తాలూకా ఎమ్మిగనూరు గ్రామ పంచాయతీ పరిధి తిమ్మనకెరె క్యాంపులో రైతు గాదిరాజు రామకృష్ణరాజు ఇంటి ఆవరణలో బుధవారం రాత్రి రెండు పిడుగులు పడ్డాయి.
పిడుగుపాటుకు బూడిదైన వరి గడ్డి
తిమ్మనకెరె క్యాంపు (కంప్లి), న్యూస్టుడే: కంప్లి తాలూకా ఎమ్మిగనూరు గ్రామ పంచాయతీ పరిధి తిమ్మనకెరె క్యాంపులో రైతు గాదిరాజు రామకృష్ణరాజు ఇంటి ఆవరణలో బుధవారం రాత్రి రెండు పిడుగులు పడ్డాయి. 8 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో వర్షం ప్రారంభమైంది. కొద్దిసేపటికే ఇంటికి 40 అడుగుల దూరంలో ఓ పిడుగు పడి 20 ఎకరాల వరిగడ్డి దగ్ధమవుతుండగా వెంటనే మరో పిడుగు 30 అడుగుల దూరంలో పడి కొబ్బరి చెట్టు దగ్ధమైంది. ఆ సమయంలో ఇంటి బయట అరుగు మీద కూర్చున్న తనకు సైతం కొంత షాక్ తగిలిందని రామకృష్ణ రాజు తెలిపారు. మెరుపులు, పిడుగుల శబ్దానికి ఇంట్లోని టీవీ, ఫ్రిజ్, ఇన్వర్టర్, తదితర వస్తువులు కాలిపోగా కిటికీల అద్దాలు పగిలిపోయాయి. 8 రోజుల కిందట ఆయన భార్య వెంకటసుబ్బలక్ష్మి మృతి చెందారు. మరో మూడు రోజుల్లో పెద్ద కర్మ ఉంది. ఈ కార్యానికి కుటుంబ సభ్యులు, బంధువులు ఇంటికి వచ్చారు. పక్కనే పడిన పిడుగుల శబ్దానికి మహిళలు, పిల్లలు భయకంపితులయ్యారు. దాదాపు రూ.3 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని రామకృష్ణ రాజు తెలిపారు. విషయం తెలిసి గ్రామ లెక్కాధికారి వచ్చి నష్టం వివరాలు సేకరించారు.
దగ్ధమైన కొబ్బరిచెట్టు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హత్యకు.. కొడుకే కిరాయి ఇచ్చాడట
[ 23-04-2024]
జిల్లా కేంద్రం గదగ దాసరవీధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి హత్య కేసును గదగ పోలీసులు ఛేదించారు. -
రైతన్నకు కరవు సాయం
[ 23-04-2024]
తీవ్ర కరవు బారినపడిన తమ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం వివక్షతో నిధుల విడుదలను జాప్యం చేస్తోందంటూ సుప్రీంకోర్టులో కర్ణాటక దాఖలు చేసిన పిటిషన్ సోమవారం కీలక మలుపు తిరిగింది. -
హామీలు విస్మరించిన భాజపా
[ 23-04-2024]
పేదలు, మధ్యతరగతి కుటుంబాల భవిష్యత్తుకు ఈ లోక్సభ ఎన్నికలు నిర్ణయాత్మకమైనవని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. -
హత్యోన్మాదంపై నిరసన వెల్లువ
[ 23-04-2024]
హుబ్బళ్లి- ధార్వాడ విద్యార్థిని నేహా హీరేమఠ్ హత్యను ఖండిస్తూ వివిధ సంఘాలు ఇచ్చిన పిలుపునకు ధార్వాడలోని వర్తక, వాణిజ్య సంస్థల ప్రతినిధులు స్పందించారు -
బడుగుల ఓట్లే నిర్ణయాత్మకం
[ 23-04-2024]
ప్రముఖ హృద్రోగ చికిత్స నిపుణుడు డాక్టర్ సీఎన్ మంజునాథ్ రాజకీయ అరంగేట్రం.. ఆయనకు పెను సవాళ్లను విసురుతోంది. -
ఆకట్టుకునేలా అవగాహన
[ 23-04-2024]
ఎన్నికల్లో యువత తప్పనిసరిగా ఓటింగ్లో పాల్గొనాలంటూ అధికారులు అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నారు -
అభ్యర్థికి కాదు.. అమాత్యులకే అగ్నిపరీక్ష
[ 23-04-2024]
బళ్లారి లోక్సభ బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఇ.తుకారాంను గెలిపించుకునే బాధ్యత బళ్లారి, విజయనగర జిల్లాల బాధ్య మంత్రులు బి.నాగేంద్ర, బి.జడ్.జమీర్ అహ్మద్ ఖాన్ భుజస్కందాలపై ఉండటంతో ఈ ఎన్నికలు అభ్యర్థికన్నా అమాత్యులకే అగ్నిపరీక్షగా మారాయి -
గ్యారంటీలతో ప్రజలకు ఊతం
[ 23-04-2024]
బెంగళూరు ఉత్తర లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి ఆచార్య రాజీవ్గౌడకు మద్దతుగా ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోమవారం దాసరహళ్లిలో రోడ్షో నిర్వహించి, ఓట్లు అభ్యర్థించారు. -
‘ఉచిత’ హారం..అపూర్వ సత్కారం
[ 23-04-2024]
ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఒక విద్యార్థిని సోమవారం రాత్రి ప్రత్యేకంగా సత్కరించింది. అరసికెరెలో మొదటి ఏడాది న్యాయశాస్త్రాన్ని చదువుతున్న జయశ్రీ ‘ఉచిత బస్సు టికెట్ల’తో చేసిన హారంతో ఆయనను సన్మానించింది.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM