logo

బీఏ కన్నడలో బంగారు పతకం పొందిన విద్యార్థిని పద్మ

సింధనూరు ప్రభుత్వ ఫస్ట్‌గ్రేడ్‌ డిగ్రీ కళాశాలలో బీఏ చదివిన విద్యార్థిని పద్మా యమునప్ప కన్నడ (ఆప్షనల్‌)లో బంగారు పతకం పొందింది.

Published : 02 Jun 2023 02:36 IST

సింధనూరు, న్యూస్‌టుడే: సింధనూరు ప్రభుత్వ ఫస్ట్‌గ్రేడ్‌ డిగ్రీ కళాశాలలో బీఏ చదివిన విద్యార్థిని పద్మా యమునప్ప కన్నడ (ఆప్షనల్‌)లో బంగారు పతకం పొందింది. ఈ విషయాన్ని కళాశాల ప్రాచార్యులు చిలకరాగి గురువారం వెల్లడించారు. త్వరలో జరగనున్న కలబురగిలోని గుల్బర్గా విశ్వవిద్యాలయం 41వ స్నాతకోత్సవంలో విద్యార్థిని పద్మకు బంగారు పతకం అందించనున్నట్లు విశ్వవిద్యాలయం పరీక్షా విభాగం నుంచి అందిన లేఖను చూపారు. మాతృభాషలో బంగారు పతకం సాధించిన విద్యార్థిని పద్మ తమ కళాశాలకు కీర్తి తెచ్చిపెట్టిందని అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని