‘మేం పిరికివాళ్లం కాదు’
మేం పిరికివాళ్లం కాదు..మమ్మల్ని ఉపయోగించుకున్న గాలి జనార్దన్రెడ్డి నిజమైన పిరికివాడు అని మాజీ శాసనసభ్యుడు గాలి సోమశేఖర్రెడ్డి మండిపడ్డారు.
విలేకరుల మాట్లాడుతున్న మాజీ శాసనసభ్యుడు గాలి సోమశేఖర్రెడ్డి
బళ్లారి, న్యూస్టుడే: మేం పిరికివాళ్లం కాదు..మమ్మల్ని ఉపయోగించుకున్న గాలి జనార్దన్రెడ్డి నిజమైన పిరికివాడు అని మాజీ శాసనసభ్యుడు గాలి సోమశేఖర్రెడ్డి మండిపడ్డారు. గురువారం స్థానిక సంగనకల్లు రహదారిలోని వాజ్పేయీ లే అవుట్లోని భాజపా కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గాలి సోమశేఖర్రెడ్డి మాట్లాడారు. నేను పెంచిన పిరికివాళ్లు ఇంట్లో ఉన్నారు.. తాను సభకు వచ్చానని గాలి జనార్దన్రెడ్డి, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడిన దృశ్యాలు ఓ టీవీలో చూశాను. మాజీ మంత్రి బి.శ్రీరాములు, మాజీ శాసనసభ్యులు టి.హెచ్.సురేష్బాబు, సోమలింగప్ప పిరికివాళ్లా అని ప్రశ్నించారు. మమ్మల్ని అడ్డం పెట్టుకుని ఎన్ని అక్రమాలకు పాల్పడి అక్రమాస్తులు సంపాదించారో ప్రపంచమంతటికీ తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాలి జనార్దన్రెడ్డికి చిన్నప్పటి నుంచి ఓ గుణం ఉంది...ఎవరైనా తన కిందే ఉండాలని భావిస్తారు. ఆయన చెప్పేది అందరూ వినాలి. వినకుంటే అణగదొక్కడం తెలుసు..అందర్నీ తొక్కితొక్కి ఈ స్థాయికి చేరుకున్నారు. గతంలో జనార్దన్రెడ్డి కాంగ్రెస్ పార్టీ సభ్యులను కొనుగోలు చేసి గాలి కరుణాకర్రెడ్డిని గెలిపించుకున్నారు. ఈ విధానసభ ఎన్నికల్లోనూ భాజపా, కాంగ్రెస్ పార్టీలోని కొంత మందిని కొనుగోలు చేసి కె.ఆర్.పి.పి.పరంగా పనిచేయించుకున్నారని తెలిపారు. నాకు, కె.ఆర్.పి.పి. అభ్యర్థికి వచ్చిన ఓట్లు కలిపితే కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇక్కడ కె.ఆర్.పి.పి. అభ్యర్థి లేకుంటే నేను 7వేల ఓట్లు ఆధిక్యతతో గెలుపొందేవాడినని తెలిపారు. తమ ఇంటి వారే ఓడించారని విచారం వ్యక్తం చేశారు. పార్టీ వీడే ఆలోచన ఉందా? అని విలేకరులు ప్రశ్నించగా, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు భాజపాలో ఉంటాను. నేను మృతిచెందిన తర్వాత కూడా నాపై భాజపా జెండా వేసి అంత్యక్రియలు నిర్వహించాలని కోరినట్లు స్పష్టం చేశారు. విధానసభ ఎన్నికల్లో భాజపాకు వ్యతిరేకంగా పనిచేసిన కార్పొరేటర్లు కోనంకి తిలక్కుమార్, కె.ఎస్.అశోక్కుమార్, కల్పనకు పార్టీ తాఖీదులు జారీ చేసిందని, వారిపై పార్టీ సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ రంగులరాట్నం
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్కు కన్నడనాడు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు ప్రధాన పార్టీల మధ్య ప్రచారం ఓ ఎత్తయితే నాలుగు రోజులుగా ప్రచారాస్త్రాలు కొత్త రంగు అద్దుకుంటున్నాయి. -
ఉపాధ్యాయిని అపహరణ
[ 24-04-2024]
హుబ్బళ్లిలోని ఒక పాఠశాలలో ఒప్పంద పద్ధతిలో ఉపాధ్యాయినిగా సేవలందిస్తున్న అక్షత (24) అపహరణకు గురైంది. అఖండేశ్వర జాతరకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి బయటకు వచ్చిన ఆమె మళ్లీ వెనక్కు రాలేదు. -
బడుగుల బతుకు ధరాభారం
[ 24-04-2024]
దేశంలో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సామాన్య కుటుంబాలు నలిగి పోతున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. -
కోలారు.. కోటి ఆశల తేరు!
[ 24-04-2024]
కోలారు (ఎస్సీ) లోక్సభ నియోజకవర్గాన్ని మరోసారి కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలు మునిగాళ్లపై నిలిచారు. నిన్నమొన్నటి అభిప్రాయభేదాలను పక్కనబెట్టి సీనియర్లు- జూనియర్లు ఒక్కటయ్యారు. -
ప్రజల ఆకాంక్షలకే పెద్దపీట
[ 24-04-2024]
రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారంలో కీలక నేతల సందడి కొనసాగుతోంది. భాజపా తరఫున ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రముఖులు అమిత్ షా, జేపీ నడ్డా రాకతో అభ్యర్థులు చివరి దశ ప్రచారాన్ని విజయవంతంగా ముగించే ప్రయత్నం చేస్తున్నారు. -
రాష్ట్రంలో అధికార దుర్వినియోగం: అశోక్
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని దురుపయోగపరుస్తోందని విపక్ష నేత ఆర్.అశోక్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ అనుసరించవలసిన నిబంధనలను ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించిందని గుర్తు చేశారు. -
నేటితో ప్రచారం.. పరిసమాప్తం
[ 24-04-2024]
రాష్ట్రంలో తొలివిడత ఎన్నికల కోసం జాతీయ నేతల ప్రచారం జోరందుకుంది. బుధవారంతో బహిరంగ ప్రచారానికి తెరపడనుండగా చివరి ప్రయత్నంగా జాతీయ పార్టీల నేతలు ప్రచార వేదికలపై ప్రసంగాలతో హోరెత్తించారు.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ