logo

నైపుణ్యంతోనే భవితకు పునాది

విద్యార్థులలోని నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహిస్తే వారు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు సుధామూర్తి పేర్కొన్నారు.

Published : 03 Jun 2023 01:06 IST

కార్యక్రమ ప్రారంభ జ్యోతి వెలిగిస్తున్న సుధామూర్తి

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : విద్యార్థులలోని నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహిస్తే వారు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ అధ్యక్షురాలు సుధామూర్తి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరిలో వారి అభిరుచికి అనుగుణమైన రంగంలో కౌశల్యాలను ఒంటబట్టించుకుంటే, చక్కగా రాణించవచ్చని చెప్పారు. జేపీనగరలోని ఆర్‌వీ పీయూ కళాశాలలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు, బంగారు పతకాలను వితరణ చేసి మాట్లాడారు. ఒత్తిడితో కాకుండా, విద్యార్థులకు ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకునేందుకు ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు ఆమె పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని