Aadhar: పేరు మార్చుకొని.. రెండోసారి ఆధార్కు దరఖాస్తు!
రెండేళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయి నగరానికి వలస వచ్చాడు నవీన్(19).. ఆధార్కార్డు కోసం వేరే పేరుతో దరఖాస్తు చేసుకున్నాడు. కానీ, ఐరిష్ ఆధారంగా అతనికి 2011లోనే ఆధార్ ఉందని అధికారులు గుర్తించారు. దానికి ఆయన పొంతనలేని సమాధానాలు ...
రెండేళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయిన యువకుడు
అధికారుల సమాచారంతో తల్లిదండ్రుల ఆనందం
మాదాపూర్, న్యూస్టుడే : రెండేళ్ల క్రితం ఇంటి నుంచి పారిపోయి నగరానికి వలస వచ్చాడు నవీన్(19).. ఆధార్కార్డు కోసం వేరే పేరుతో దరఖాస్తు చేసుకున్నాడు. కానీ, ఐరిష్ ఆధారంగా అతనికి 2011లోనే ఆధార్ ఉందని అధికారులు గుర్తించారు. దానికి ఆయన పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో వారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. వారు రెండేళ్ల క్రితం అదృశ్యమైన తమ కుమారుడ్ని గుర్తించి ఆనందంతో నగరానికి బయల్దేరారు. మాదాపూర్ ఆధార్ కేంద్రం మేనేజర్ భవాని ప్రసాద్ కథనం.. ఖమ్మం జిల్లా టేకులపల్లి గ్రామానికి చెందిన కరుణాకర్, ఆదిలక్ష్మి దంపతుల పెద్దకుమారుడు కుంపటి సందీప్. 2019లో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి పారిపోయాడు. తల్లిదండ్రులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే ఇంటి నుంచి పారిపోయిన సందీప్ నగరానికి వచ్చాడు. రాయదుర్గంలోని తన అక్క మంజుల ఇంట్లో ఉంటున్నట్లుగా చెప్పాడు. మార్చిలో మాదాపూర్లోని ఆధార్సేవా కేంద్రానికి వచ్చిన సందీప్ తన పేరు సూర్య, తండ్రి పేరు చంద్రయ్య పేరిట వివరాలు సమర్పించి ఆధార్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. నాలుగు నెలలు కావస్తున్నా.. ఆధార్కార్డు జారీ కాకపోవడంతో గురువారం మళ్లీ ఆధార్కేంద్రానికి వచ్చి తన కార్డు రాలేదంటూ ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై సిబ్బంది ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా 2011లోనే సదరు వ్యక్తికి ఆధార్కార్డు ఉందని తేలింది. అతన్ని విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో అధికారులు 2011లో జారీ అయిన ఆధార్కార్డు ఆధారంగా అతని తల్లిదండ్రుల వివరాలు సేకరించి వారికి వీడియో కాల్ చేసిన సందీప్తో మాట్లాడించారు. కరుణాకర్ తన కుమారుడిని గుర్తుపట్టాడు. రెండేళ్ల క్రితం అదృశ్యమైన తన కుమారుడి ఆచూకీ లభించడంతో అతని ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. కుమారుడిని తీసుకెళ్లేందుకు నగరానికి బయలుదేరారు. ఈ మేరకు ఆధార్ కేంద్రం అధికారులు మాదాపూర్ పోలీసులకు సమాచారం అందించి సందీప్ను అప్పగించారు. తల్లిదండ్రులు వచ్చేంత వరకు పోలీస్ సంరక్షణలో ఉంచాలని కోరారు. ఇదిలా ఉంటే తన పేరు సూర్య, తన తల్లిదండ్రులు చనిపోయారని సందీప్ చెబుతుండడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బదిలీ పొందిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలి
[ 19-04-2024]
గత విద్యా సంవత్సరంలో బదిలీ పొంది రిలీవర్ లేనందున రిలీవ్ చేయని ఉపాధ్యాయులను వెంటనే వారు బదిలీ పొందిన స్థానంలో నియమించాలని తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భానోత్ వీరు నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. -
విజేతలకు బహుమతులు అందజేత
[ 19-04-2024]
పొన్నేల్లో బోడేపూడి ట్రస్ట్ ద్వారా మండల స్థాయి క్రికెట్ పోటీలు అంబేద్కర్ యువ మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. -
తాటి చెట్టు పైనుంచి పడి కల్లుగీత కార్మికుడి మృతి
[ 19-04-2024]
ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
జగాలను ఏలిన రామయ్యకు పట్టాభిషేకం
[ 19-04-2024]
ధర్మమే ఆకారం దాల్చిన రామావతారుడు భద్రగిరిలో కొలువై ఉండగా తక్కువేమి మనకు అంటూ కోలాటాలు ఆడారు. -
తొలిరోజు ఖమ్మంలో ఒకటే నామినేషన్
[ 19-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో తొలిరోజు గురువారం ఒక నామపత్రం దాఖలైంది. అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఆదార్) పార్టీ తరఫున ముదిగొండ మండలం గంధసిరికి చెందిన కుక్కల నాగయ్య ఒక సెట్ నామపత్రాలను ఆర్ఓ గౌతమ్కు అందజేశారు -
ఏ పత్రం.. ఏం చెబుతుందంటే..?
[ 19-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రకటన గురువారం వెలువడింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫాం-1 ద్వారా ఆయా స్థానాల్లో నోటీసు జారీ చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లను గురువారం నుంచే స్వీకరిస్తున్నారు. -
అడుగంటిన జలం.. అపర భగీరథ ప్రయత్నం
[ 19-04-2024]
అడుగంటిన భూగర్భజలాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో కొందరు రైతులు పామాయిల్ సాగు చేశారు. -
18లో మేలుకొలుపు ప్రజాస్వామ్య గెలుపు
[ 19-04-2024]
ప్రజాస్వామ్య ఎన్నికల్లో యువ ఓటర్ల చైతన్యమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం వినూత్న ప్రయోగాలు చేస్తోంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కొత్తగా చేపట్టే కార్యక్రమం.. ‘టర్నింగ్-18’. అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నిక ప్రక్రియలో ఏ ఒక్కఓటరూ వెనకబడకుండా చూడటమే అంతిమ లక్ష్యం. -
బేతుపల్లి అంకమ్మతల్లి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి
[ 19-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బేతుపల్లి అంకమ్మ తల్లి తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మవారిని ఊరేగించే రథాలను సిద్ధం చేశారు. -
ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
[ 19-04-2024]
జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో క్రోధి నామ సంవత్సర వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. స్వామి వారికి ప్రాతఃకాల అర్చనల అనంతరం యజ్ఞశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు -
సోనియా రుణం తీర్చుకోవాలి: మంత్రి తుమ్మల
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ అగ్రనేత సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు -
గుళికల మందు మింగి బలవన్మరణం
[ 19-04-2024]
గుళికల మందు మింగి ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ నాగేశ్వరరావు కథనం ప్రకారం.. అశ్వారావవుపేట కోతమిషన్ బజారులో కూలీ పనులు చేస్తూ జీవించే బమ్మిడి సాంబయ్య(62)కు పదిహేనేళ్ల కిందట కడుపు పైభాగంలో కణితి ఏర్పడింది -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
[ 19-04-2024]
రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన జూలూరుపాడు మండలం సాయిరాంతండా వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది
తాజా వార్తలు (Latest News)
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె