logo

ఆ బంధమే మృత్యు పాశం..!

వరుసకు అన్నాచెల్లెల బంధం.. వావీవరుస మరిచారు.. ఏళ్లుగా సన్నిహితంగా మెలిగారు. చివరికి ఆ బంధమే ఆమె పాలిట మృత్యుపాశమైంది. టేకులపల్లి మండలం తావుర్యాతండాలో మంగళవారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. టేకులపల్లి సీఐ బానోత్‌ రాజు కథనం ప్రకారం..

Published : 19 Jan 2022 05:37 IST

టేకులపల్లి, న్యూస్‌టుడే: వరుసకు అన్నాచెల్లెల బంధం.. వావీవరుస మరిచారు.. ఏళ్లుగా సన్నిహితంగా మెలిగారు. చివరికి ఆ బంధమే ఆమె పాలిట మృత్యుపాశమైంది. టేకులపల్లి మండలం తావుర్యాతండాలో మంగళవారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. టేకులపల్లి సీఐ బానోత్‌ రాజు కథనం ప్రకారం.. తావుర్యాతండాకు చెందిన భూక్య కృష్ణ, పద్మ(37)కు ఇరవై ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ప్రస్తుతం ఇంటర్‌ పూర్తి చేసిన కుమార్తె, ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న కుమారుడున్నారు. ఏడేళ్ల క్రితం కృష్ణ మృతి చెందాడు. ఈ క్రమంలోనే అతని అక్క భర్త గుగులోత్‌ వెంకన్నతో పద్మ సన్నిహితంగా ఉంటోంది. వెంకన్న తన భార్యతో గొడవ పెట్టుకుని వచ్చి పద్మ, వారి పిల్లలతో కలిసి వారింట్లోనే ఏడేళ్లుగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో పదిహేను రోజులుగా వెంకన్నతో సంబంధం వద్దంటూ పద్మను పిల్లలు వారిస్తున్నారు. ఇంకోపక్క వెంకన్న తన కుమారుడికి పద్మ కూతురునిచ్చి పెళ్లి చేయాలని ఒత్తిడి తెస్తున్నాడు. తన కూతురుని ఇచ్చి వివాహం చేసేదిలేదని, వేరుగా ఉందామని వెంకన్నకు దీంతో పద్మ తేల్చి చెప్పింది. ఈక్రమంలోనే మంగళవారం ఉదయం తండా సమీపంలోని మిరప తోటకు వెళ్లిన ఆమెను కత్తితో మెడ వెనుక భాగంలో కోసి హత్య చేశాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు. టేకులపల్లి సీఐ రాజు పంచనామా నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని