ఆటకెళ్లి.. అనంతలోకాలకు..
అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు.. స్నేహితులతో ఆడుకుంటామని చెప్పి వెళ్లారు. ఇళ్లకు వస్తారనుకుంటే తిరిగిరాని లోకాలకు వెళ్లారని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. నగరంలోని బ్రాహ్మణ బజారులో మంగళవారం సాయంత్రం చెట్టు కూలిపడటంతో
చిన్నారుల మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు
ఆయుష్ మృతదేహం వద్ద రోదిస్తున్న తండ్రి ప్రకాశ్
ఖమ్మం నేరవిభాగం, న్యూస్టుడే: అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలు.. స్నేహితులతో ఆడుకుంటామని చెప్పి వెళ్లారు. ఇళ్లకు వస్తారనుకుంటే తిరిగిరాని లోకాలకు వెళ్లారని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. నగరంలోని బ్రాహ్మణ బజారులో మంగళవారం సాయంత్రం చెట్టు కూలిపడటంతో ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడగా నలుగురు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
మరో మూడు రోజుల్లో పుట్టినరోజు
మరో మూడురోజుల్లో(ఈనెల 22న) మల్వాడి దిగాంత్శెట్టి(11) పుట్టినరోజు వేడుకలను జరిపేందుకు రెండు రోజుల నుంచి తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా షాపింగ్ చేస్తున్నారు. దిగాంత్కు ఇష్టమైన వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తున్నారు. పెళ్లైన ఐదేళ్లకు పుట్టిన ఏకైక సంతానం కావడంతో కుమారుడంటే ఎనలేని ప్రేమ. దీంతో వారు జన్మదిన వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించాలని సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇంతలోనే తన కొడుకు దూరమయ్యాడని తెలిసి వారు బోరున విలపించారు. కర్నాటక రాష్ట్రానికి చెందిన మల్వాడి దినకర్శెట్టి, షీల దంపతులు పదిహేనేళ్ల క్రితం ఖమ్మం వచ్చి స్థిరపడ్డారు. దినకర్శెట్టి ఖమ్మంలోని ఓ ఉడిపి హోటల్లో క్యాషియర్గా పనిచేస్తున్నాడు.
సెలవుల్లో ఇంటి వద్దే ఉంటూ..
పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో పిల్లలంతా ఇళ్ల వద్దే ఉంటున్నారు. వారంతా బ్రాహ్మణబజారుకు చెందిన 12ఏళ్లలోపు చిన్నారులు. రోజులాగే ఆడుకోవడానికి బయటకు వెళ్లారు. ఒకటి, ఆరో తరగతులు చదువుతున్న రాజ్పుత్ ఆయుష్, మల్వాడి దిగాంత్, కంచర్ల సాయిఆర్యన్(4వ), కొల్లపల్లి సాకేత్(7వ), రాజ్పుత్ అనుమోలు(3వ), చరణ్సాయి(7వ) సాయంత్రం ఆ ప్రాంతంలో ఒక వస్త్రదుకాణానికి సంబంధించిన ఖాళీ స్థలంలో క్రికెట్ ఆడుకుంటున్నారు. ఈ స్థలం 20 రోజుల క్రితం వరకు మూసి ఉండగా, ఇటీవలే వాహనాల పార్కింగ్ కోసం తెరిచారు.
కూలిన చెట్టును తొలగిస్తున్న అగ్నిమాపక, నగరపాలక సిబ్బంది
గోడ నాని కూలిన చెట్టు
శిథిల గోడపై రావి చెట్టు పెరిగి పెద్దదైంది. పక్కనే మరో చిన్న చెట్టుంది. ఇటీవల వర్షాలకు గోడ నానింది. అటువైపు వెళ్లిన బంతిని వెదుతుకుతున్న సమయంలోనే వేళ్లతో సహా చెట్టుకూలి కొమ్మలు, గోడ మీదపడటంతో దిగాంత్శెట్టి, ఆయుష్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆయుష్పై చెట్టు కాండం పడటంతో తల మట్టిలో కూరుకపోయింది. దాన్ని తొలగించడం ఆలస్యం కావడంతో ఊపిరాడక అక్కడిక్కడే మృతిచెందాడని స్థానికులు చెబుతున్నారు. మిగిలిన వారిపై గోడ పెచ్చులు, చెట్టుకొమ్మలు పడటంతో గాయాలయ్యాయి. వారిలో అనుమోలు తలకు, చరణ్సాయికి కాలుకి తీవ్రగాయాలు కాగా సాయిఆర్యన్, కొల్లపల్లి సాకేత్కు గాయాలయ్యాయి. సాకేత్ పరిస్థితి విషమించడంతో రాత్రి హైదరాబాద్ తరలించినట్లు సమాచారం. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సంఘటనా స్థలానికి అరగంట ఆలస్యంగా రావడంతో అప్పటికే స్థానికులు శిథిలాలను పక్కకు జరిపి క్షతగాత్రులను రక్షించారు. పోలీసులు అక్కడకు చేరుకున్న తర్వాత మృతదేహాలను తీశారు. గాయపడిన పిల్లలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* సంఘటనా స్థలాన్ని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, అడిషనల్ డీసీపీ గౌస్ఆలం, శిక్షణ కలెక్టర్ రాహుల్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి జయప్రకాశ్ పరిశీలించారు.
మా తమ్ముడు కొమ్మల కిందే ఉన్నాడు..
మా తమ్ముడు కొమ్మల కిందే ఉన్నాడు. బయటకు తీయండి అంటూ ఆయుష్ అన్న అనుమోల్ ఆక్రందించాడు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రకాశ్ పురోహిత్, కళావతి దంపతుల కుమారులు ఆయుష్, అనుమోల్. ఖమ్మం రైల్వే స్టేషన్రోడ్డులో ప్రకాశ్ కళ్లజోళ్ల దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే
[ 29-03-2024]
ఖమ్మం జిల్లా ఏన్కూర్లో గుడ్ ఫ్రైడేను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఏన్కూర్లో ఆర్సీఎం చర్చి నుంచి ప్రార్థనలు చేస్తూ సిలువ మార్గంగా టీఎల్ పేట చర్చి వరకు చేరుకున్నారు. -
సార్వత్రిక సమరం.. సిబ్బంది సిద్ధం..!
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై ఈసీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఓటరు నమోదు నుంచి అభ్యర్థుల నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ వరకు ప్రతి ఘట్టంలో అధికారులు, ఎన్నికల సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తారు. -
దండుకున్నారు.. తిప్పించుకుంటున్నారు..!
[ 29-03-2024]
కొత్తగూడెం నియోజకవర్గంలో ‘దళితబంధు’ పేరిట భారీగా వసూళ్ల పర్వం సాగింది. ఒక్కొక్కరి నుంచి ఏకంగా రూ.3 లక్షలు దండుకున్నారు. ఈవ్యవహారంలో అప్పటి ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు, పురపాలికలోని కొంతమంది ప్రజాప్రతినిధులు కీలకంగా వ్యవహరించారు. -
అసైన్డ్ భూముల్లో కట్టడాల కూల్చివేత
[ 29-03-2024]
ఖమ్మం నగరంలోని 8వ డివిజన్ వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలో అసైన్డ్ భూముల్లో అసలు యజమానులు కాకుండా కొనుగోలు చేసినవారు చేపట్టిన నిర్మాణాలను రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు గురువారం కూల్చివేశారు. -
పిండం దశలోనే పిసికేస్తున్నారు!
[ 29-03-2024]
ఆరోగ్య సమస్యలకు చికిత్స అందిస్తామని అనుమతులు తీసుకున్న ఆస్పత్రిలో గర్భవిచ్ఛిత్తికి పాల్పడుతున్నారు. ధనార్జన కోసం అనైతిక వైద్యం చేస్తూ పిండ దశలోనే ప్రాణాలు తీసేస్తున్నారు. -
అటు సాధన.. ఇటు శోధన
[ 29-03-2024]
రూ.15వేల రుణం కోసం ఆశపడిన ఐదుగురు మహిళలు, తెలియకుండానే తమ ఖాతాల ద్వారా రూ.కోట్ల లావాదేవీలు నడిపారు. నమ్మించిన యువకుడు ఒక బ్యాంకు ఖాతా పేరు చెప్పి, మరో బ్యాంకు ఖాతా తెరచి మోసగించాడని ఆలస్యంగా గ్రహించారు. -
‘సైబర్’ దోపిడీ సొమ్ము.. అమాయకుల ఖాతాలకు!
[ 29-03-2024]
సైబర్ నేరస్థులు అమాయకుల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారని, వాటి సాయంతో లూటీ సొమ్మును వాడుకుంటున్నారని ఎస్పీ బి.రోహిత్రాజు గురువారం తెలిపారు. -
ఎండల గండాలకు జాగ్రత్తలే గొడుగు
[ 29-03-2024]
మార్చి నెలలోనే ఎండలు ముదిరాయి. వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని సింగరేణి, పలు పరిశ్రమల ప్రభావిత ప్రాంతాల్లో వేడి ఇంకొంచెం ఎక్కువగా ఉంటోంది. -
అప్పుల బాధతో యువరైతు బలవన్మరణం
[ 29-03-2024]
పంటల దిగుబడి సరిగా రాలేదన్న మనస్తాపంతో ఓ యువరైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకుపాల్పడ్డాడు. పాల్వంచ గ్రామీణ ఎస్సై బి.శ్రీనివాస్ కథనం ప్రకారం.. మండలంలోని యానంబైలు గ్రామానికి చెందిన మంత్రి శశికుమార్ (26) నాలుగెకరాల్లో పత్తి, అయిదు ఎకరాల్లో వరి సాగు చేశాడు. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగుపయనమయ్యారు. -
మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, కొరియర్ అరెస్టు
[ 29-03-2024]
నిషేధిత సీపీఐ మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ బి.రోహిత్రాజు తెలిపారు. గురువారం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. -
9 నుంచి శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు
[ 29-03-2024]
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 9 నుంచి 23 వరకు జరిగే శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేపట్టాలని ఆర్డీఓ దామోదర్రావు ఆదేశించారు. రామాలయం ఈఓ రమాదేవితో కలిసి తన కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు