Ts News: అటవీ సిబ్బంది దాడి చేశారని ఆదివాసీ మహిళల ఆందోళన
భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అటవీ సిబ్బంది దాడి చేశారని ఆదివాసీ మహిళలు ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. కట్టెల కోసం అడవిలోకి వెళ్తే దాడి చేశారని నలుగురు మహిళలు
భద్రాద్రి: భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అటవీ సిబ్బంది దాడి చేశారని ఆదివాసీ మహిళలు ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. కట్టెల కోసం అడవిలోకి వెళ్తే దాడి చేశారని నలుగురు మహిళలు ఆరోపిస్తున్నారు. ముల్కలపల్లి మండలం సాకివాగు గుత్తికోయ గ్రామంలో నిన్న మధ్యాహ్నం చోటుచేసుకున్నట్లు భావిస్తున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ‘‘నిన్న మధ్యాహ్నం గుత్తికోయ గ్రామానికి చెందిన నలుగురు మహిళలు కట్టెల కోసం అడవిలోకి వెళ్లారు. ఆ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మహేశ్.. అడవిలోకి ఎందుకు వచ్చారంటూ వారిని అక్కడనుంచి తరిమేశారు. వారిలో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. దుర్భాషలాడారు. మహిళలు పారిపోయే క్రమంలో నలుగురు మహిళల్లో ఒకరు అక్కడే ఉన్న గోతిలో పడిపోవడంతో ఆమె వస్త్రాలను కూడా లాగాడంటూ’’ మహిళలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై మహిళలు ఎవరికీ చెప్పుకోలేదు. శుక్రవారం గ్రామానికి వెళ్లిన ముల్కలపల్లి మండలానికి చెందిన నాయకులతో మహిళలు చెప్పడంతో జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అటవీ అధికారి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
ఆదివాసీ మహిళలపై జరిగిన దాడిని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు ఖండించారు.ఆదివాసీ మహిళలపై అమానుషంగా ప్రవర్తించడం దారుణమన్నారు. ఆదివాసీ, గిరిజనులపై అటవీ అధికారుల దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయని మండిపడ్డారు. ఆదివాసీ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే ఘటనపై ముల్కలపల్లి అటవీశాఖ అధికారి రవికిరణ్ను సంప్రదించగా.. సాకివాగు అటవీ ప్రాంతంలో ఎటువంటి సంఘటన జరగలేదన్నారు. బుధవారం అటవీ ప్రాంతానికి వచ్చిన కొంతమందిని కట్టెలు కొట్టవద్దని మహేశ్ హెచ్చరించిన మాట వాస్తవమేనన్నారు. మహిళలపై ఎలాంటి దాడికి పాల్పడలేదని.. వారి ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే. -
బాలింత మృతి..
[ 26-04-2024]
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. -
‘ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్దే గెలుపు’
[ 26-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
[ 26-04-2024]
పెద్దమ్మతల్లికి గురువారం 108 రకాల పుష్పాలతో అర్చకులు వైభవంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు జరిపించారు. -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
[ 26-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్.బి.నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. -
పంచాయతీ కార్యాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను గురువారం ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా