గమ్యం అంచున ఆగిన పయనం
వైరా మండలంలోని స్నానాలలక్ష్మీపురంలో తన బంధువుల ఇంట జరిగే దశదిన కార్యక్రమానికి చింతకాని మండలం పందిళ్లపల్లికి చెందిన ఏసు దుర్గ(45) తన మరిది ప్రసాద్ బండిపై సోమవారం బయల్దేరింది. కొణిజర్ల మండలం పల్లిపాడు దాటగానే
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
వైరా, కొణిజర్ల, న్యూస్టుడే: తాము ఒకటి తలిస్తే విధి ఇంకోటి తలచింది. గమ్యానికి కొద్ది దూరంలో ఉండగా చోటుచేసుకున్న వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు అసువులు బాశారు. పది కిలోమీటర్ల దూరంలోపే ఈ ఘటనలు చోటుచేసుకోవటం గమనార్హం. మృతుల్లో ఇద్దరు మహిళలు. సమీప బంధువుల దశదిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఒకరు, కుమార్తెను తీసుకుని ఇల్లు చేరే సమయంలో ఇంకొకరు ప్రమాదంలో బలయ్యారు. విధి నిర్వహణకు వెళ్తూ రాత్రివేళ గుర్తుతెలియని వాహనం ఢీకొని మరో వ్యక్తి మృతి చెందాడు.
కర్మకు వెళ్తుండగా..
ఏసు దుర్గ(పాతచిత్రం)
వైరా మండలంలోని స్నానాలలక్ష్మీపురంలో తన బంధువుల ఇంట జరిగే దశదిన కార్యక్రమానికి చింతకాని మండలం పందిళ్లపల్లికి చెందిన ఏసు దుర్గ(45) తన మరిది ప్రసాద్ బండిపై సోమవారం బయల్దేరింది. కొణిజర్ల మండలం పల్లిపాడు దాటగానే ఎగుడు దిగుడుగా ఉన్న ప్రాంతంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో దుర్గ రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో వెనకనుంచి వస్తున్న లారీ ఆమెపై ఎక్కి కొద్ది దూరం ఈడ్చుకు వెళ్లడంతో శరీరం చూడలేనంత దారుణంగా ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందింది. పది నిమిషాల్లో గమ్యం చేరుతుందనగా ఊహించని ప్రమాదంలో విగత జీవిగా మారింది. అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు మృతదేహాన్ని ఖమ్మంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులున్నారు. కొణిజర్ల పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కుమార్తెను తీసుకెళ్తూ..
కృష్ణకుమారి
కుమార్తెను ఇంటికి తీసుకెళ్తుండగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ విగత జీవిగా మారింది. ఈ ఘటన వైరా సమీపంలోని శాంతినగర్ వద్ద సోమవారం చోటుచేసుకుంది. ఖమ్మం నుంచి వైరా మండలం పాలడుగు వెళ్తున్న ద్విచక్ర వాహనం, వెనక నుంచి వస్తున్న మరో ద్విచక్ర వాహనం ప్రమాదవశాత్తూ ఢీకొన్నాయి. ఘటనలో పాలడుగు వెళ్లే వాహనంపై వెనక కూర్చున్న కేసగాని కృష్ణకుమారి (38) రోడ్డుపై పడి తలకు బలమైన గాయాలయ్యాయి. ఆమెను ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కూతురి చదువు కోసం ఖమ్మంలో ఉంటున్న వీరి కుటుంబం స్వగ్రామం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలున్నారు. ప్రమాద సమయంలో భర్త నర్సింహారావు బండి నడుపుతుండగా మధ్యలో కుమార్తె కూర్చుంది. సెలవులు కావటంతో స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో వాహనంపై ఉన్న మహిళకు స్వల్ప గాయాలయ్యాయి.
గుర్తుతెలియని వాహనం ఢీకొని..
నారపోగు రాయప్ప
తనికెళ్ల సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని సోమవారం రాత్రి వ్యక్తి చనిపోయాడు. తనికెళ్లకు చెందిన నారపోగు రాయప్ప(38) ఓ ప్రయివేటు కళాశాలలో వాచ్మెన్గా పని చేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా రాత్రి 8.30 గంటల సమయంలో గ్రామం నుంచి కళాశాలకు కాలినడకన వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. తీవ్ర గాయాలైన అతను అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
[ 25-04-2024]
మారుమూల గిరిజన బిడ్డ ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించింది. బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో భద్రాద్రి జిల్లా -
ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా
[ 25-04-2024]
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు బుధవారం విడుదల య్యాయి. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 63.84 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నాలుగో స్థానంలో, -
కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాంరెడ్డి
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిని ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. కాంగ్రెస్ శ్రేణుల నెలన్నర రోజుల ఉత్కంఠకు తెరపడింది. -
భారాస హయాంలోనే ఉభయ జిల్లాల అభివృద్ధి: హరీశ్రావు
[ 25-04-2024]
ఖమ్మం జిల్లా అభివృద్ధికి గత భారాస ప్రభుత్వం పనిచేస్తే.. కాంగ్రెస్ సర్కారులో మంత్రి పదవులు పొందిన నేతలు మాత్రం తమ కుటుంబీకులకు ఎంపీ టికెట్ ఇప్పించుకునేందుకు అధిష్ఠానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. -
కేసీఆర్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి: తెదేపా
[ 25-04-2024]
మాజీ సీఎం కేసీఆర్ అబద్దపు జోస్యాలు, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తెదేపా ఖమ్మం పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు కేతినేని హరీశ్ చంద్ర హితవు పలికారు. -
భాజపాతోనే సమగ్రాభివృద్ధి: తాండ్ర
[ 25-04-2024]
భాజపా గెలుపుతోనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ఖమ్మం లోక్సభ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
గంజాయి పేరెత్తకుండా
[ 25-04-2024]
ఏపీ సరిహద్దునున్న మన్యం జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో కొంతకాలంగా గంజాయి ఎక్కువగా పట్టుబడుతోంది. రవాణా, విక్రయ ఘటనల్లో చిక్కే నిందితుల్లో ఎక్కువ మంది యువతే కావడం ఆందోళనకరం. -
మలేరియా కట్టడికి పరిశుభ్రత మంత్రం
[ 25-04-2024]
మైదాన ప్రాంతాలతో పోల్చిచూస్తే భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లోనే మలేరియా జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. -
ఓటరు తుది జాబితాలో తప్పులు ఉండొద్దు: కలెక్టర్
[ 25-04-2024]
ఓటు నమోదు దరఖాస్తుల విచారణ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. ఓటరు తుది జాబితాను తప్పులు లేకుండా రూపొందించాలన్నారు. -
తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతా: ఎంపీ నామా
[ 25-04-2024]
తెలంగాణ ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం పార్లమెంటు పోరాడేందుకు మరోసారి తనకు అవకాశం కల్పించాలని భారాస లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. -
ఆరో రోజు 21 సెట్ల నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో ఆరోరోజు బుధవారం 14 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు -
ఓటర్ల తుది జాబితా అభ్యర్థులకు అందించాలి
[ 25-04-2024]
లోక్సభ నియోజకవర్గాల వారీగా ఓటర్ల తుది జాబితా సిద్ధం చేసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ