logo

సమస్యలపై కలెక్టర్‌కు వినతులు

జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్‌ గౌతమ్‌కు కలెక్టరేట్‌లో సోమవారం వినతులు అందించారు. కొవిడ్‌ నిబంధనల మేరకు గ్రీవెన్స్‌ డేను రద్దు చేయగా, తమ సమస్యలపై అర్జీలు

Published : 25 Jan 2022 04:06 IST

ఖమ్మం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్‌ గౌతమ్‌కు కలెక్టరేట్‌లో సోమవారం వినతులు అందించారు. కొవిడ్‌ నిబంధనల మేరకు గ్రీవెన్స్‌ డేను రద్దు చేయగా, తమ సమస్యలపై అర్జీలు అందించేందుకు పలువురు కలెక్టరేట్‌లోని పరిష్కృతి విభాగం వద్ద వేచిఉన్నారు. అటుగా వెళుతున్న కలెక్టర్‌ను పలువురు కలిసి అర్జీలు అందించారు. పెనుబల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందినవారు కొత్తగూడెం-సత్తుపల్లి రైల్వేలైన్‌ నిర్మాణంలో తమ భూములు తీసుకున్నారని, నష్టపరిహారం పూర్తి స్థాయిలో ఇప్పించాలని కోరుతూ వినతి పత్రాలు అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని