జోరుగా జీరో వ్యాపారం
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిరప ఖరీదుదారుల హవా కొనసాగుతోంది. కొంతమంది ఇష్టారాజ్యంగా కొనుగోళ్లు చేస్తున్నారు. మార్కెట్ పాలకవర్గాన్నిగానీ, అధికారులనుగానీ వీరు పెద్దగా పట్టించుకోరు.
ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి
ఖమ్మం వ్యవసాయం, న్యూస్టుడే
ఖమ్మం మార్కెట్కు వచ్చిన మిరప బస్తాలు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిరప ఖరీదుదారుల హవా కొనసాగుతోంది. కొంతమంది ఇష్టారాజ్యంగా కొనుగోళ్లు చేస్తున్నారు. మార్కెట్ పాలకవర్గాన్నిగానీ, అధికారులనుగానీ వీరు పెద్దగా పట్టించుకోరు. నిబంధనలను అమలు చేయరు. దడవాయిల ప్రమేయం లేకుండానే నేరుగా విపణిలో కొనుగోళ్లు జరిపి సరకు తరలిస్తారు. ఈ సరకుకు పన్ను చెల్లించకపోవటం వల్ల మార్కెట్ పెద్ద మొత్తంలో ఆదాయం కోల్పోతోంది. మార్కెట్ కమిటీ లోపాలను ఆసరా చేసుకుని సాగిస్తున్న జీరో దందాపై ‘న్యూస్టుడే’ ప్రత్యేక కథనమిదీ.
‘ఈ-టామ్’ విధానం..
మిరపలో ఈ-నామ్ విధానం అమలు సాధ్యం కాకపోవటంతో ప్రభుత్వం ఈ-టామ్’(తెలంగాణ అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఎక్స్ఛేంజ్) విధానం అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ విధానం ద్వారానే కొనుగోళ్లు జరుగుతున్నాయి. దడవాయిలు రైతుల సరకు వివరాలను పీవోఎస్ మిషన్లలో నమోదు చేస్తారు. పీవోఎస్ మిషన్ల సమాచారం ‘ఈ-టామ్’కు అనుసంధానం చేసి ఉంటుంది. దీనివల్ల విపణిలో కొనుగోళ్లు పారదర్శకంగా ఉంటాయి. ఈనామ్ అమలు చేసిన మొదటి సంవత్సరం 2015లో 89 మంది దడవాయిలకు 89 పీవోఎస్ మిషన్లను సరఫరా చేశారు. అంతకు ముందు కాంటాలు మాన్యువల్ పద్ధతిలో జరిగేవి. పీవోస్ మిషన్లు వచ్చిన తర్వాత దాదాపు విపణిలో మాన్యువల్ పద్ధతి పూర్తిగా రద్దయ్యింది.
సాంకేతిక సమస్యలతో..
పీవోఎస్ మిషన్లలో ఇప్పుడు అనేక సాంకేతిక సమస్యలు తలెత్తి తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. బ్యాటరీ ఛార్జింగ్ ఆగటం లేదు. దీంతో దడవాయిలు కాంటాలు ఆపి ఛార్జింగ్ పెట్టుకునేందుకు వెళ్తుండటంతో జాప్యం జరుగుతోంది. ఇలా ప్రతి రోజూ ఇదే సమస్య నెలకొంటోంది. ఎన్నిసార్లు వీటికి మరమ్మతులు చేసినా సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. సుమారు ఆరేళ్లు కావటంతో వీటి లైఫ్టైమ్ కూడా దగ్గరపడింది.
దడవాయిలు లేకుండా కొనుగోళ్లు
ఛార్జింగ్ కోసం దడవాయిలు వెళ్లే సమయాన్ని మార్కెట్లోని ఖరీదుదారులు సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం దడవాయి కాంటా వేస్తేనే దానికి తక్ పట్టీ వస్తుంది. సరకుకు చట్టబద్ధత ఉంటుంది. రైతుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ-టామ్ పోర్టల్లో నమోదై ఉంటాయి. ఇలాంటివేవీ పట్టించుకోకుండా కొంత మంది ఖరీదుదారులు దడవాయిల ప్రమేయం లేకుండా సొంత మనుషులతో మాన్యువల్గా కాంటాలు వేయించుకుని రైతులకు తెల్లకాగితంపై వివరాలు రాసి ఇస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల రైతుకు ఏదైనా ప్రమాదం జరిగితే బీమా కూడా వర్తించే అవకాశం ఉండదు. తక్పట్టీ లేకుండా మార్కెట్లో సరకు అమ్మనట్లు ఎలాంటి ఆధారం ఉండదు. వ్యాపారి మార్కెట్కు చెల్లించాల్సిన ఒక శాతం పన్ను నుంచి కూడా తప్పించుకుంటున్నాడు. ఇలా నిత్యం జరిగే వ్యాపారం వల్ల మార్కెట్ పెద్ద మొత్తంలో ఆదాయం కోల్పోతోంది. ఉదాహరణకు సోమవారం మార్కెట్కు సుమారు 30వేల బస్తాలకు పైగా సరకు వచ్చింది. కానీ అధికారులు చూపించిన లెక్కల్లో మాత్రం సుమారు 21వేల బస్తాలే ఉండటం విశేషం. మిరప సీజన్లో బడా ఖరీదు వ్యాపారులు చేసే మాయాజాలం అంతుపట్టకుండా ఉంటుంది.
పారదర్శకంగానే మిర్చి కొనుగోళ్లు: ఆర్.మల్లేశం, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి.
మిరపలో జీరో అనేది అబద్ధం. ఖరీదుదారులు నేరుగా కాంటాలు వేసుకోవటం జరగదు. దడవాయిలు ఛార్జింగ్ పెట్టుకునేందుకు వెళ్లినప్పుడు ఆలస్యం జరుగుతుందనే ఉద్దేశంతో ఒకటి రెండు క్వింటాళ్ల తాలు బస్తాలు వేసుకుంటారు తప్ప సరకును వారే కాంటాలు వేయరు. అదీ ఒకరిద్దరు వ్యాపారులు మాత్రమే చేసే అవకాశం ఉంది. పీవోస్ మిషన్ల కోసం ఆర్డరు పెట్టాం. యార్డులో అన్ని కొనుగోళ్లు నిబంధనల ప్రకారం పారదర్శకంగా జరుగుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగాలను ఏలిన రామయ్యకు పట్టాభిషేకం
[ 19-04-2024]
ధర్మమే ఆకారం దాల్చిన రామావతారుడు భద్రగిరిలో కొలువై ఉండగా తక్కువేమి మనకు అంటూ కోలాటాలు ఆడారు. -
తొలిరోజు ఖమ్మంలో ఒకటే నామినేషన్
[ 19-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో తొలిరోజు గురువారం ఒక నామపత్రం దాఖలైంది. అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఆదార్) పార్టీ తరఫున ముదిగొండ మండలం గంధసిరికి చెందిన కుక్కల నాగయ్య ఒక సెట్ నామపత్రాలను ఆర్ఓ గౌతమ్కు అందజేశారు -
ఏ పత్రం.. ఏం చెబుతుందంటే..?
[ 19-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రకటన గురువారం వెలువడింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫాం-1 ద్వారా ఆయా స్థానాల్లో నోటీసు జారీ చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లను గురువారం నుంచే స్వీకరిస్తున్నారు. -
అడుగంటిన జలం.. అపర భగీరథ ప్రయత్నం
[ 19-04-2024]
అడుగంటిన భూగర్భజలాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో కొందరు రైతులు పామాయిల్ సాగు చేశారు. -
18లో మేలుకొలుపు ప్రజాస్వామ్య గెలుపు
[ 19-04-2024]
ప్రజాస్వామ్య ఎన్నికల్లో యువ ఓటర్ల చైతన్యమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం వినూత్న ప్రయోగాలు చేస్తోంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కొత్తగా చేపట్టే కార్యక్రమం.. ‘టర్నింగ్-18’. అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నిక ప్రక్రియలో ఏ ఒక్కఓటరూ వెనకబడకుండా చూడటమే అంతిమ లక్ష్యం. -
బేతుపల్లి అంకమ్మతల్లి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి
[ 19-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బేతుపల్లి అంకమ్మ తల్లి తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మవారిని ఊరేగించే రథాలను సిద్ధం చేశారు. -
ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
[ 19-04-2024]
జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో క్రోధి నామ సంవత్సర వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. స్వామి వారికి ప్రాతఃకాల అర్చనల అనంతరం యజ్ఞశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు -
సోనియా రుణం తీర్చుకోవాలి: మంత్రి తుమ్మల
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ అగ్రనేత సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు -
గుళికల మందు మింగి బలవన్మరణం
[ 19-04-2024]
గుళికల మందు మింగి ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ నాగేశ్వరరావు కథనం ప్రకారం.. అశ్వారావవుపేట కోతమిషన్ బజారులో కూలీ పనులు చేస్తూ జీవించే బమ్మిడి సాంబయ్య(62)కు పదిహేనేళ్ల కిందట కడుపు పైభాగంలో కణితి ఏర్పడింది -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
[ 19-04-2024]
రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన జూలూరుపాడు మండలం సాయిరాంతండా వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది
తాజా వార్తలు (Latest News)
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’