గులాబీ సారథులుగా తాతా, రేగా
క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అధికార తెరాస.. మరో ముందడుగు వేసింది. 2023 ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్న గులాబీ పార్టీ క్షేత్రస్థాయిలో పటిష్ట కార్యాచరణతో ముందుకెళ్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి జిల్లా పార్టీకి అధ్యక్షులను నియమిస్తూ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇద్దరు
ఈటీవీ, ఖమ్మం
సీఎం కేసీఆర్ను కలిసిన మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్,
పల్లా రాజేశ్వర్రెడ్డి, కోరం కనకయ్య, ఎమ్మెల్యే రేగా కాంతారావు
క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అధికార తెరాస.. మరో ముందడుగు వేసింది. 2023 ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్న గులాబీ పార్టీ క్షేత్రస్థాయిలో పటిష్ట కార్యాచరణతో ముందుకెళ్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి జిల్లా పార్టీకి అధ్యక్షులను నియమిస్తూ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇద్దరు కొత్త అధ్యక్షులను ప్రకటించారు. ఖమ్మం జిల్లా సారథిగా ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, భద్రాద్రి కొత్తగూడెం తెరాస జిల్లా అధ్యక్షునిగా పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావును నియమిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. పార్టీ బలోపేతంపై చాలా రోజులుగా సుదీర్ఘ కసరత్తు చేస్తున్న కేసీఆర్.. జిల్లాలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలతోపాటు జిల్లా నేతల మధ్య విబేధాల నేపథ్యంలో ఆచితూచి అడుగులు వేశారు. ఉభయ జిల్లాల్లో ముఖ్య నేతల నుంచి పార్టీ అధ్యక్షుల ఎంపికపై అభిప్రాయాలు తీసుకున్నారు. రెండు జిల్లాల్లోనూ భారీగానే ఆశావహుల జాబితా పార్టీ అధిష్ఠానానికి చేరింది. అయితే.. రాష్ట్రవ్యాప్తంగా చాలా వరకు ప్రజాప్రతినిధులకే జిల్లా పార్టీ బాధ్యతలు అప్పగించిన పరిస్థితుల్లో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోనూ అదే ఒరవడిని కొనసాగించారు. కొత్త అధ్యక్షుల నియామకం ఉమ్మడి ఖమ్మం జిల్లా గులాబీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపుతోంది.
సయోధ్య కుదిరేనా!
వీరి నియామకం ఉమ్మడి ఖమ్మం జిల్లా తెరాసలో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇప్పటికే గులాబీ దళంలో కొందరు నేతలు ఎన్నికలు వచ్చినప్పుడు తప్ప మరెప్పుడూ వేదికలు పంచుకున్న సందర్భాలు తక్కువే. ఏ నియోజవర్గానికి వారే అన్నట్లుగా నేతలు ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలు నడుపుతున్నారు. కొందరు నేతలు పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్లుగానే ఉన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు, మాజీ ఎమ్మెల్యేల మధ్య గ్రూపు రాజకీయాలకు కొదవే లేదు. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కొత్త సారథుల బాధ్యతలు కీలకం కానున్నాయి. పార్టీని బలోపేతం చేయాలంటే ముఖ్య నేతలందరినీ ఒకేతాటిపైకి తేవాల్సిన అవసరం ఉంది. కొత్త సారథులపై గురుతర బాధ్యత ఉందన్నది పార్టీ వర్గాల్లో సాగుతున్న చర్చ. పార్టీని బలోపేతం చేయడం ఒక ఎత్తయితే.. జిల్లాలో నేతలను ఏకతాటిపైకి తీసుకు రావడంలో జిల్లా సారథులు ఎలా సఫలీకృతమవుతారన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది.
ఇద్దరికీ జోడు పదవులు
జిల్లా సారథులుగా ఎంపికైన ఇద్దరు నేతలను జోడు పదవులు వరించాయి. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్సీగా తాతా మధుసూదన్ గెలిచిశాసనమండలి సభ్యుడిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేశారు. కొద్దిరోజుల్లోనే జిల్లా పార్టీ అధ్యక్ష పదవి వరించడం గమనార్హం. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలుకు చెందిన ఆయన రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెరాసలో చేరి వివిధ పదవులు అనుభవించారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవి బీసీలకు దక్కుతుందని భావించారు. కానీ..ఎవరూ ఊహించని రీతిలో తాతా మధుసూదన్ వైపే పార్టీ మొగ్గుచూపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షునిగా నియమించిన రేగా కాంతారావు పినపాక ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గానూ పనిచేస్తున్నారు. కోయ సామాజిక వర్గానికి చెందిన రేగా కాంతారావు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. మారిన రాజకీయ పరిణామాల్లో తెరాస తీర్థం పుచ్చుకోగా.. ప్రభుత్వ విప్ పదవి దక్కింది. తాజాగా భద్రాద్రి జిల్లా అధ్యక్షుడి రూపంలో మరోసారి రేగా కాంతారావును అదృష్టం వరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివిధ అనుమతులకు సువిధ
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానానికి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే అనేక యాప్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
భాజపాను ఆశీర్వదించండి
[ 20-04-2024]
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన భాజపాను ఖమ్మం ప్రజలు లోక్సభ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ కోరారు. -
వర్షాకాలం రాకముందే పనులు ప్రారంభించాలి: మంత్రి తుమ్మల
[ 20-04-2024]
వర్షాకాలం సమీపించకముందే మున్నేరు కేబుల్ వంతెన సీసీ పనులు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. -
ఖమ్మం మార్కెట్కు మరింత ఆదాయం
[ 20-04-2024]
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు రూ.2,761 కోట్ల పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరిగాయి. -
భారాసకు మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ రాజీనామా
[ 20-04-2024]
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ శుక్రవారం ప్రకటించారు. 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన తాను కేవలం అభివృద్ధి కోసం షరతులు లేకుండా భారాసలో చేరానన్నారు. -
రైతుల ఆదాయం రెట్టింపునకు కృషి
[ 20-04-2024]
రైతుల ఆదాయం రెట్టింపయినప్పుడే వారి శ్రమకు ప్రతిఫలం దక్కినట్లని తెలంగాణ ఆయిల్ఫెడ్ ఎండీ కె.అశోక్రెడ్డి అన్నారు. -
ప్రచారం హద్దు మీరితే.. శ్రీముఖం తధ్యం!
[ 20-04-2024]
ప్రస్తుతం ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలో ప్రచారం జోరందుకుంది. నాలుగో దశలో జరగనున్న పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 18వ తేదీనే నామినేషన్ ప్రక్రియ మొదలైంది. -
వేగంగా ఉద్యోగాల్లో స్థిరపడే పాలిటెక్నిక్
[ 20-04-2024]
సాంకేతిక విద్య అభ్యసించే వారికి సాధారణ కోర్సుల వారితో పోల్చితే ఉద్యోగావకాశాలు, జీతభత్యాలు ఎక్కువ. ప్రస్తుతం నిరుద్యోగిత ప్రబలుతున్న నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కోర్సుల ఎంపికపై శ్రద్ధ పెరిగింది. -
లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడి మృతి
[ 20-04-2024]
ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన ఘటన ఖమ్మం ఎన్టీఆర్ కూడలిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... -
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోరిక బలరాంనాయక్ నామపత్రం దాఖలు చేసిన సందర్భంగా ఎన్టీఆర్ -
ఇక లెక్కలే.. మిగిలాయి..!
[ 20-04-2024]
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన కల్యాణ బ్రహ్మోత్సవాలు 23 వరకు కొనసాగనున్నప్పటికీ ప్రధాన వేడుక పూర్తి కావడంతో ఆదాయ వ్యయాల పరిశీలనపై అధికారులు దృష్టి సారించారు. -
సీతారాములకు ఘనంగా మహదాశీర్వచనం
[ 20-04-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో కల్యాణం అనంతరం పట్టాభిషేకాన్ని తిలకించిన భక్తులకు శుక్రవారం సదస్యం పేరిట మరో ఉత్సవం వీక్షించే భాగ్యం దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం