‘రామచంద్రయ్య విశిష్టతను మ్యూజియంలో ఏర్పాటు చేస్తాం’
‘కంచుతాళం- కంచుమేళం’ వాద్య సాధనంతో 20 ఏళ్లుగా ఆదివాసీ సంస్కృతిని చాటుతూ నేడు పద్మశ్రీ పురస్కారం దక్కించుకున్న సకిని రామచంద్రయ్య జీవితానికి సంబంధించిన విశిష్టతను సీడీలు, రచనల రూపంలో గిరిజన మ్యూజియంలో
రామచంద్రయ్యను సన్మానిస్తున్న ఐటీడీఏ అధికారులు డేవిడ్ రాజ్, రమాదేవి తదితరులు
మణుగూరు సాంస్కృతికం, న్యూస్టుడే: ‘కంచుతాళం- కంచుమేళం’ వాద్య సాధనంతో 20 ఏళ్లుగా ఆదివాసీ సంస్కృతిని చాటుతూ నేడు పద్మశ్రీ పురస్కారం దక్కించుకున్న సకిని రామచంద్రయ్య జీవితానికి సంబంధించిన విశిష్టతను సీడీలు, రచనల రూపంలో గిరిజన మ్యూజియంలో ఏర్పాటు చేస్తామని ఐటీడీఏ సహాయక ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ రమాదేవి అన్నారు. బుధవారం మణుగూరులోని కూనవరంలో పద్మశ్రీ రామచంద్రయ్యను కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరక్షరాస్యుడైన రామచంద్రయ్య అరుదైన వాద్య పరికరంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి కోయ తెగల చరిత్రను ప్రజలకు వినిపించేవారన్నారు. ఏవో భీం, ఏసీఎంవో రమణయ్య, ఏటీడీవో నర్సింహారావు, గిరిజన మ్యూజియం ప్రతినిధి వీరస్వామి, ఎంటీఆర్డీ వెంకటేశ్వర్లు, హెచ్వో క్రిష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పార్లమెంట్ ఎన్నికల్లో భారాస అత్యధిక స్థానాలు విజయం
[ 23-04-2024]
మహబూబాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత నామినేషన్ కార్యక్రమానికి వెళ్లేందుకు ఇల్లందుకు చేరుకున్న పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారాస నాయకులు దిండిగల రాజేందర్ ఆధ్వర్యంలో స్వాగతం -
ఏది నిజం?.. సోషల్ మీడియాలో సమాచార వ్యాప్తిపై ఈసీఐ సూచనలివీ..
[ 23-04-2024]
ఎన్నికలోస్తే చాలు, సామాజిక మాధ్యమాల్లో కుప్పలుతెప్పలుగా సమాచారం వచ్చిపడుతుంది. వాటిల్లో పుకార్లు ఏవి? తప్పుదోవ పట్టించేవి ఏవి? నిజమైన సమాచారం ఏదో తెలియక ఓటర్లు తికమకపడుతుంటారు. -
బరిలో నిలవాలంటే.. పరిశీలన దశ దాటాల్సిందే!
[ 23-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ)కి అఫిడవిట్లు సమర్పించారు. -
ప్రాదేశిక ఎన్నికలకు రంగం సిద్ధం
[ 23-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన సామగ్రి సమకూర్చుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి పంచాయతీరాజ్ కమిషనర్ సహా జిల్లా పరిషత్లకు సూచనలందాయి. -
రైతులకు అండగా ఉంటాం: నామా
[ 23-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీరికి భారాస అండగా ఉంటుందని ఆపార్టీ ఖమ్మం లోక్సభ స్థానం అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. -
గ్యారంటీలు నమ్మి మోసపోకండి: తాండ్ర
[ 23-04-2024]
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను నమ్మి ఓటర్లు మోసపోవద్దని, దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్న భాజపాను ఆదరించాలని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు పేర్కొన్నారు. -
సెలవులొచ్చాయ్.. ప్రణాళికలు ఖరారయ్యాయ్!
[ 23-04-2024]
ఈవిద్యా సంవత్సరం నేడు (మంగళవారం) ముగియనుంది. పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం బుధవారం నుంచి వేసవి సెలవులు ప్రకటించింది. ఈనేపథ్యంలో ప్రభుత్వ బడుల బలోపేతంపై దృష్టి సారించింది. -
పది మందిలో ఐదుగురు స్థానికేతరులే..
[ 23-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానానికి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా పది మంది గెలిచారు. వీరిలో ఐదుగురు స్థానికేతరులు కావటం విశేషం. -
అకాల వర్షంతో 700 ఎకరాల్లో పంట నష్టం
[ 23-04-2024]
జిల్లాలో ఆదివారం సాయంత్రం వీచిన ఈదురు గాలులతో కొత్తగూడెం, సుజాతనగర్, చుంచుపల్లి ,లక్ష్మీదేవిపల్లి, ఇల్లెందు, టేకులపల్లి, అశ్వారావుపేట, పినపాక, కరకగూడెం మండలాల్లో సుమారు 700 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు డీఏఓ బాబురావు సోమవారం తెలిపారు. -
‘పది’ విద్యార్థులు ఫలితాలపై ఒత్తిడి చెందొద్దు
[ 23-04-2024]
పదో తరగతి పరీక్ష ఫలితాలు ఎలా ఉన్నా విద్యార్థులు మానసిక ఒత్తిళ్లకు గురికావొద్దని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.జేవీఎల్ శిరీష సోమవారం ఒక ప్రకటనలో సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
క్షమాపణలు యాడ్ సైజ్లోనే ప్రచురించారా? పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!