దరఖాస్తుల వెల్లువ
ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం ఉపకార వేతనాలు అందిస్తోంది. అవగాహన లోపం, దరఖాస్తులు చేయకపోవడం వంటి కారణాలతో అర్హులందరికీ ప్రీమెట్రిక్ ఉపకార వేతనం దరిచేరడంలేదు. ఈసారి అర్హులందరికీ అందించాలనే
ఎస్సీ ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలకు 4267 మంది నమోదు
ఖమ్మం సంక్షేమవిభాగం, న్యూస్టుడే
విద్యార్థులకు ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తున్న సత్యనారాయణ
ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం ఉపకార వేతనాలు అందిస్తోంది. అవగాహన లోపం, దరఖాస్తులు చేయకపోవడం వంటి కారణాలతో అర్హులందరికీ ప్రీమెట్రిక్ ఉపకార వేతనం దరిచేరడంలేదు. ఈసారి అర్హులందరికీ అందించాలనే లక్ష్యంతో జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి గతేడాది కన్నా మూడింతలు దరఖాస్తులు నమోదు చేయించారు. ఈ విద్యా సంవత్సరంలో 4267 మంది విద్యార్థులు దరఖాస్తులు చేయడంతో రాష్ట్రంలో జిల్లా ముందు స్థానంలో నిలిచింది. అందులో ఇప్పటివరకు 1738 మందికి నిధులు విడుదల చేయగా ఇంకా 2529 మందికి రావాల్సి ఉంది.
జిల్లాకు ప్రథమ స్థానం
ఎస్సీ విద్యార్థులకు ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలు అందించేందుకు జిల్లా పాలనాధికారి గౌతమ్ ప్రత్యేక దృష్టిసారించారు. పలుమార్లు అధికారులతో సమీక్షించి ప్రక్రియను వేగవంతం చేసేందుకు రెవెన్యూ, విద్యాశాఖ, మీసేవ, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో వీరంతా జిల్లాలోని ఆయా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలను అందించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో వసతిగృహ సంక్షేమాధికారులు ప్రతిరోజూ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కలిసి వారిని చైతన్యవంతం చేయడంలో సఫలీకృతులయ్యారు. దీనికితోడు ఎస్సీడీడీ కస్తాల సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రతిరోజూ సాయంత్రం జూమ్ సమావేశం ద్వారా పురోగతిని సమీక్షించడం వంటి పనులు చేశారు. ఒక దశలో ప్రక్రియ వేగవంతం చేసేందుకు అలసత్వం వహించే సంక్షేమాధికారులకు శ్రీముఖాలు కూడా జారీ చేశారు. దీంతో ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేసి విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించేందుకు కృషి చేసి జిల్లాను ముందువరుసలో నిలిపారు.
* రాజీవ్ విద్యాదీవెన(ఆర్వీడీ): 9,10 తరగతులు చదివే విద్యార్థులకు అందించే ఉపకార వేతనం. ఒక్కొక్కరికి రూ.3000 ఇస్తారు.
* న్యూస్కీమ్: 5 నుంచి 8వ తరగతిలో అందించే ఉపకార వేతనం. ఒక్కో బాలురకు రూ.1000, బాలికలకు రూ.1500 అందిస్తారు.
ఏటా దరఖాస్తు సంఖ్య ఆశించినంత సంఖ్యలో రాకపోవడంతో ఈసారి ప్రత్యేక దృష్టిసారించాం. జిల్లా పాలనాధికారి ప్రత్యేక చొరవతో గతంలో ఎన్నడూలేనంతగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
- కస్తాల సత్యనారాయణ, ఎస్సీడీడీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్దే గెలుపు’
[ 26-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: తాండ్ర
[ 26-04-2024]
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
తప్పుడు కేసులతో వేధిస్తే వదిలిపెట్టం: నామా
[ 26-04-2024]
భారాస నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే ఊరుకోబోమని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు హెచ్చరించారు. -
చట్టాలు, నిబంధనలపై అవగాహన తప్పనిసరి: సీపీ
[ 26-04-2024]
చట్టాలు, నిబంధనలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సీపీ సునీల్దత్ అన్నారు. ఖమ్మం సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న సివిల్ స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల .... -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మోగిన నగారా
[ 26-04-2024]
-
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఖమ్మం జిల్లాలోని ప్రైవేటు కళాశాలలు సత్తాచాటాయి. బుధవారం రాత్రి విడుదల చేసిన ఫలితాల్లో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించినట్టు ఆయా కళాశాలల యాజమాన్యాలు వేర్వేరు ప్రకటనల్లో తెలిపాయి. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే. -
బాలింత మృతి..
[ 26-04-2024]
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
[ 26-04-2024]
పెద్దమ్మతల్లికి గురువారం 108 రకాల పుష్పాలతో అర్చకులు వైభవంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు జరిపించారు. -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
[ 26-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్.బి.నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. -
పంచాయతీ కార్యాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను గురువారం ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా