logo

నేటి నుంచి జిల్లాలో మంత్రుల పర్యటన

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌లు శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జిల్లాలో  పర్యటించనున్నారు. ఉదయం పది గంటలకు ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో క్యాథ్‌ల్యాబ్‌,

Published : 28 Jan 2022 05:14 IST

ఖమ్మం నగరపాలకం, న్యూస్‌టుడే: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌లు శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జిల్లాలో  పర్యటించనున్నారు. ఉదయం పది గంటలకు ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో క్యాథ్‌ల్యాబ్‌, ట్రామాకేర్‌ యూనిట్‌ను ప్రారంభిస్తారు. 10.45గంటలకు ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించే వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొంటారు. మధ్యాహ్నం మధిర మండలం ఆత్కూరు, 3.10గంటలకు మధిర పట్టణంలో, సాయంత్రం 5 గంటలకు సత్తుపల్లి పట్టణంలో, 5.30గంటలకు నారాయణపురంలో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారు. శనివారం ఉదయం 9గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రామవరంలో నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తారు. 9.45గంటలకు పాల్వంచలో నిర్మిస్తున్న మెడికల్‌, నర్సింగ్‌ కళాశాల పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు సూర్యాపేట బయలుదేరి వెళతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని