logo

ప్రతిష్ఠాత్మకంగా కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదు: సురేశ్‌ షెట్కార్‌

కాంగ్రెస్‌ డిజిటల్‌ సభ్యత్వాల నమోదును వేగవంతం చేయాలని ఖమ్మం పార్లమెంటరీ సభ్యత్వాల నమోదు ఇన్‌ఛార్జ్‌, మాజీ ఎంపీ సురేశ్‌ షెట్కార్‌ అన్నారు. గురువారం కొత్తగూడెం భజనమందిరం ఏరియాలో కాంగ్రెస్‌ సభ్యత్వాల నమోదుపై సమీక్ష నిర్వహించారు.

Published : 28 Jan 2022 05:14 IST

మాట్లాడుతున్న మాజీ ఎంపీ సురేశ్‌ షెట్కార్‌

కొత్తగూడెం సాంస్కృతికం, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ డిజిటల్‌ సభ్యత్వాల నమోదును వేగవంతం చేయాలని ఖమ్మం పార్లమెంటరీ సభ్యత్వాల నమోదు ఇన్‌ఛార్జ్‌, మాజీ ఎంపీ సురేశ్‌ షెట్కార్‌ అన్నారు. గురువారం కొత్తగూడెం భజనమందిరం ఏరియాలో కాంగ్రెస్‌ సభ్యత్వాల నమోదుపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్‌ నాయకుడు బాలశౌరి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న సురేశ్‌ మాట్లాడుతూ గడపగడపకు కాంగ్రెస్‌ను తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య మాట్లాడుతూ సభ్యత్వాల నమోదును పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు ఎడవల్లి కృష్ణ, కార్యక్రమ నియోజకవర్గ బాధ్యుడు వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నాయకులు పోట్ల నాగేశ్వరరావు, దేవీప్రసన్న, రాయల శాంతయ్య, నాగసీతారాములు, అర్జున్‌రావు, రాందాస్‌నాయక్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని