ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ
ప్రభుత్వ పాఠశాలల సమగ్రాభివృద్ధి, పటిష్టమైన మౌలిక సదుపాయాల కోసం విద్యాశాఖలో ’మన ఊరు- మన బడి’ కార్యక్రమానికి కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య,
మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట
తీరనున్న విద్యార్థుల వెతలు
పూర్తి శిథిలావస్థకు చేరిన మణుగూరు ఉన్నత పాఠశాల
మణుగూరు సాంస్కృతికం, న్యూస్టుడే: ప్రభుత్వ పాఠశాలల సమగ్రాభివృద్ధి, పటిష్టమైన మౌలిక సదుపాయాల కోసం విద్యాశాఖలో ’మన ఊరు- మన బడి’ కార్యక్రమానికి కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, హాజరు కొనసాగింపుతోపాటు డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి అభ్యసన సామర్థ్యాలను మెరుగు పరచనున్నారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ పాఠశాలలకు ఇక మహర్దశ పట్టనుంది. ప్రస్తుతం అనేక పాఠశాలలు సమస్యలతో కునారిల్లుతున్నాయి. ప్రధానంగా తరగతి గదులు, తాగునీటి సౌకర్యం, శౌచాలయాలు సరిపోయినన్ని లేకపోవటం లాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా, అన్ని పనులు వేగంగా అమలుకు పాఠశాల నిర్వహణ కమిటి(ఎస్ఎంసీ)లకు బాధ్యతలు అప్పగిస్తారు.
జిల్లాలో 1,036 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. కొవిడ్ కారణంగా రెండేళ్లుగా బోధన కుంటుపడింది. దీనికి తోడు వసతుల లేమి వేధిస్తోంది. తరగతి గదులు వినియోగంలోలేక చాలా వరకు శిథిలావస్థకు చేరాయి. మరమ్మతులు చేయకపోవడంతో ఎప్పుడే ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. ప్రహరీలు, తాగునీటి వసతి లేకపోవడం, తలుపులు, కిటికీలు, బల్లలు విరిగిపోవడంతో చదువులెలా కొనసాగించాలో ప్రశ్నార్థకంగా మారింది. ఏళ్లుగా విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపుతున్నా.. నిధుల విడుదలలో నిర్లక్ష్యం నెలకొంటోంది. మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక సమస్య ఎదురవుతోంది. విద్యార్థులు అధికశాతం బల్లలు లేక కింద కూర్చునే పాఠాలు వింటున్నారు.
చదువు‘కొనే’ పరిస్థితి లేకుండా..
జిల్లాలో పేద, మధ్యతరగతి వర్గాలు ఒకరిని చూసి మరొకరు ప్రైవేటు విద్యాసంస్థల్లో పిల్లల్ని చేర్పిస్తున్నారు. స్థోమత లేకున్నా పిల్లల భవిష్యత్తు కోసం అప్పులు చేసి మరీ చదివిస్తున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో రుసుముల సంగతి చెప్పక్కర్లేదు. కొవిడ్ వేళ ఆర్థిక సమస్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపారు. దీంతో గణనీయంగా విద్యార్థుల సంఖ్య పెరిగింది. అందుకు అనుగుణంగా సౌకర్యాలు లేవు. మరమ్మతులు, రుసుముల నియంత్రణపై సర్కారు తీసుకున్న నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
గ్రామీణ విద్యార్థులకు ప్రోత్సాహం..
జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలవుతోంది. నేటి పోటీ ప్రపంచంలో పిల్లల్ని తెలుగు చదివించాలంటే తల్లిదండ్రులు విముఖత చూపుతున్నారు. ప్రస్తుతం ప్రాథమిక, ఉన్నత స్థాయిలో చదివే బడులకే ఆంగ్ల మాధ్యమం అనుమతించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. గ్రామీణ విద్యార్థులను ప్రోత్సహించేలా చర్యలు చేపడుతున్నారు.
ముఖ్యాంశాలు...
* సాంకేతిక విజ్ఞాన ఆధారిత విద్యను అందించటం కోసం డిజిటల్ తరగతుల ఏర్పాటు, అదనపు తరగతి గదుల నిర్మాణం, గదులకు మరమ్మతులు, అవసరమైన మేరకు ఫర్నీచర్ ఏర్పాటు, శౌచాలయాలు, ఇతర వసతుల కల్పిన ఈప్రణాళిక ముఖ్య ఉద్దేశం.
* ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టి మూడు దశల్లో మూడేళ్ల వ్యవధిలో విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగు పరచటం.
* 2021-22 విద్యా సంవత్సరం మొదటి దశలో మండల కేంద్రాన్ని యూనిట్గా తీసుకుని అన్ని రకాల(ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత) పాఠశాలల్లో అత్యధిక నమోదు అయిన ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో ముందుగా దీన్ని అమలు చేస్తారు.
* ప్రతి పాఠశాలలో పూర్వ విద్యార్థుల సంఘాలను ఏర్పాటు చేసి ఇందులో ఇద్దరు క్రియాశీలక సభ్యులను, సర్పంచి, ఇద్దరు పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. దాతలు, సీఎస్ఆర్ నిధులు తదితర మార్గాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బదిలీ పొందిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలి
[ 19-04-2024]
గత విద్యా సంవత్సరంలో బదిలీ పొంది రిలీవర్ లేనందున రిలీవ్ చేయని ఉపాధ్యాయులను వెంటనే వారు బదిలీ పొందిన స్థానంలో నియమించాలని తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భానోత్ వీరు నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. -
విజేతలకు బహుమతులు అందజేత
[ 19-04-2024]
పొన్నేల్లో బోడేపూడి ట్రస్ట్ ద్వారా మండల స్థాయి క్రికెట్ పోటీలు అంబేద్కర్ యువ మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. -
తాటి చెట్టు పైనుంచి పడి కల్లుగీత కార్మికుడి మృతి
[ 19-04-2024]
ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
జగాలను ఏలిన రామయ్యకు పట్టాభిషేకం
[ 19-04-2024]
ధర్మమే ఆకారం దాల్చిన రామావతారుడు భద్రగిరిలో కొలువై ఉండగా తక్కువేమి మనకు అంటూ కోలాటాలు ఆడారు. -
తొలిరోజు ఖమ్మంలో ఒకటే నామినేషన్
[ 19-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో తొలిరోజు గురువారం ఒక నామపత్రం దాఖలైంది. అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఆదార్) పార్టీ తరఫున ముదిగొండ మండలం గంధసిరికి చెందిన కుక్కల నాగయ్య ఒక సెట్ నామపత్రాలను ఆర్ఓ గౌతమ్కు అందజేశారు -
ఏ పత్రం.. ఏం చెబుతుందంటే..?
[ 19-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రకటన గురువారం వెలువడింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫాం-1 ద్వారా ఆయా స్థానాల్లో నోటీసు జారీ చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లను గురువారం నుంచే స్వీకరిస్తున్నారు. -
అడుగంటిన జలం.. అపర భగీరథ ప్రయత్నం
[ 19-04-2024]
అడుగంటిన భూగర్భజలాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో కొందరు రైతులు పామాయిల్ సాగు చేశారు. -
18లో మేలుకొలుపు ప్రజాస్వామ్య గెలుపు
[ 19-04-2024]
ప్రజాస్వామ్య ఎన్నికల్లో యువ ఓటర్ల చైతన్యమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం వినూత్న ప్రయోగాలు చేస్తోంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కొత్తగా చేపట్టే కార్యక్రమం.. ‘టర్నింగ్-18’. అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నిక ప్రక్రియలో ఏ ఒక్కఓటరూ వెనకబడకుండా చూడటమే అంతిమ లక్ష్యం. -
బేతుపల్లి అంకమ్మతల్లి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి
[ 19-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బేతుపల్లి అంకమ్మ తల్లి తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మవారిని ఊరేగించే రథాలను సిద్ధం చేశారు. -
ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
[ 19-04-2024]
జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో క్రోధి నామ సంవత్సర వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. స్వామి వారికి ప్రాతఃకాల అర్చనల అనంతరం యజ్ఞశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు -
సోనియా రుణం తీర్చుకోవాలి: మంత్రి తుమ్మల
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ అగ్రనేత సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు -
గుళికల మందు మింగి బలవన్మరణం
[ 19-04-2024]
గుళికల మందు మింగి ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ నాగేశ్వరరావు కథనం ప్రకారం.. అశ్వారావవుపేట కోతమిషన్ బజారులో కూలీ పనులు చేస్తూ జీవించే బమ్మిడి సాంబయ్య(62)కు పదిహేనేళ్ల కిందట కడుపు పైభాగంలో కణితి ఏర్పడింది -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
[ 19-04-2024]
రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన జూలూరుపాడు మండలం సాయిరాంతండా వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ