logo

బాలికపై లైంగిక వేధింపులు: నిందితునికి దేహశుద్ధి

బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ వ్యక్తికి దేహశుద్ధి చేసిన ఘటన ఖమ్మం నగరం టేకులపల్లిలో గురువారం చోటుచేసుకుంది. బాలిక బంధువుల కథనం ప్రకారం... పండ్లు విక్రయించే 53 ఏళ్ల వీరమల్ల వెంకన్న స్థానికంగా రెండు పడక గదుల ఇళ్ల సముదాయంలో నివాసం ఉంటున్నాడు.

Published : 28 Jan 2022 05:14 IST

ఖమ్మం అర్బన్‌, న్యూస్‌టుడే: బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ వ్యక్తికి దేహశుద్ధి చేసిన ఘటన ఖమ్మం నగరం టేకులపల్లిలో గురువారం చోటుచేసుకుంది. బాలిక బంధువుల కథనం ప్రకారం... పండ్లు విక్రయించే 53 ఏళ్ల వీరమల్ల వెంకన్న స్థానికంగా రెండు పడక గదుల ఇళ్ల సముదాయంలో నివాసం ఉంటున్నాడు. పాఠశాలలకు సెలవుల నేపథ్యంలో ఐదో తరగతి చదువుతున్న ఓ బాలిక తన తమ్మునితో కలిసి రేగుపండ్లు ఏరుకునేందుకు వెళ్లింది. అటుగా వెళ్లిన అవివాహితుడైన వెంకన్న ఆ బాలికను మందలించడంతోపాటు అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాలిక ఇంటికి పరుగెత్తి తల్లిదండ్రులకు చెప్పింది. ఆగ్రహించిన వారు బంధువులతో కలిసి వెంకన్నను పట్టుకుని దేహశుద్ధి చేసి ఖానాపురంహవేలి పోలీసులకు అప్పగించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ రామకృష్ణ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని