ముచ్చట చెప్పొద్దు.. బాధ్యతతో మెలగాలి
వైద్యులు, సిబ్బంది అంకితభావంతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. ఖమ్మం జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల వైద్యారోగ్య పనితీరు, కొవిడ్ వ్యాక్సినేషన్, ఇంటింటి
ఉమ్మడి జిల్లా వైద్యారోగ్యశాఖ పనితీరుపై మంత్రి హరీశ్రావు అసహనం
క్యాథ్ల్యాబ్ యంత్రాన్ని పరిశీలిస్తున్న మంత్రులు హరీశ్రావు, అజయ్కుమార్, ఎంపీ నామా, కలెక్టర్ గౌతమ్, ఎమ్మెల్యే రాములునాయక్, జడ్పీ ఛైర్మన్ కమల్రాజు, మేయర్ నీరజ, వైద్యాధికారులు
ఈటీవీ, ఖమ్మం: వైద్యులు, సిబ్బంది అంకితభావంతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు సూచించారు. ఖమ్మం జడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల వైద్యారోగ్య పనితీరు, కొవిడ్ వ్యాక్సినేషన్, ఇంటింటి జ్వర సర్వే, ఆస్పత్రిలో ప్రసవాలు, మహిళలు, కిశోర బాలికల్లో రక్తహీనత తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని వైద్యారోగ్య శాఖలో కనిపిస్తున్న లెక్కలు, నివేదికలు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో సాధారణ కాన్పుల కన్నా ఆపరేషన్లు ఊహించని స్థితిలో సాగుతున్నాయని ఒక్క మాతాశిశు సంరక్షణ కేంద్రంలోనే ఇప్పటి వరకు 5 వేల మంది తల్లులు, పిల్లలకు ఆపరేషన్ల రూపంలో అన్యాయం చేశారని మండిపడ్డారు. రాష్ట్రమంతటా 80 శాతం సాధారణ ప్రసవాలు, 20 శాతం శస్త్రచికిత్సలు ఉంటే.. ఉమ్మడి జిల్లాలో పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉందని ఇది చూసి మనమంతా సిగ్గుపడాలని అసహనం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో 81 శాతం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 87 శాతం మంది గర్భిణీలు రక్తహీనతతో బాధపడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. కలెక్టర్లు దీనిపై ఎందుకు దృష్టి సారించడంలేదని ప్రశ్నించారు.
ఇకనైనా మారాలి..
ఉభయ జిల్లాల్లో ప్రభుత్వ రంగ వైద్యారోగ్య సేవలు మరింత మెరుగు పరచాలని వైద్యాధికారులను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, రాష్ట్రంలో వైద్య విద్య అభివృద్ధికి 18 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఒక్కొక్కటి రూ.5 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసుకుంటున్నట్లు చెప్పారు. ఉభయ జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య మరింత పెంచాలన్నారు. ప్రతీ నెలా జిల్లా మంత్రితోపాటు కలెక్టర్లు, జిల్లావైద్యారోగ్య శాఖ అధికారులు గర్భిణులతో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుని వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. జిల్లాలో కల్తీ విక్రయాలు అరికట్టేందుకు ఫుడ్ ఇన్స్పెక్టర్లు కృషిచేయాలని ఆదేశించారు. కాలపరిమితి దాటిన ఔషధాల విక్రయాలు జరగకుండా డ్రగ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేపట్టాలన్నారు. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాట్లాడుతూ ఉభయ జిల్లాల్లో కొవిడ్ కట్టడి చర్యలు సమర్థంగా చేపట్టామన్నారు. రెండు జిల్లాల్లోనూ రెండో డోసు వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేసేలా అధికారులు, వైద్య సిబ్బంది పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కీమోథెరపీ, రేడియోథెరపీ సౌకర్యం కల్పించాలని మంత్రి హరీశ్రావును పువ్వాడ కోరారు. ఆస్పత్రికి ఎంఆర్ఐ సౌకర్యం కల్పించాలని, ప్రభుత్వ ఆస్పత్రి శవాగారాన్ని ఆధునికీకరించాలని కోరారు. దీనికి స్పందించిన హరీశ్ రావు..త్వరలోనే మంత్రి కోరిన అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఆర్థిక సంవత్సరంలో ఖమ్మం ఆస్పత్రికి ఎంఆర్ఐ మంజూరు చేస్తామన్నారు. ఖమ్మం ఆస్పత్రిని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే మూడు నెలల్లో ఖమ్మం నగరంలో బస్తీ దవాఖానాలు ప్రారంభిస్తామని హరీశ్ రావు వెల్లడించారు. సమీక్షలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జడ్పీ ఛైర్మన్ కమల్రాజు, డీసీసీబీ ఛైర్మన్ నాగభూషయ్య, ఎమ్మెల్యేలు ఉపేందర్రెడ్డి, రాములునాయక్, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, ఆయూష్ కమిషనర్ వర్షిణీ, ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీ గంగాధర్, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, అనుదీప్, నగర కమిషనర్ ఆదర్శ్ సురభి, ఉభయ జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారులు, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
క్యాథ్ ల్యాబ్ విభాగం ప్రారంభం
ఆదిలాబాద్ ప్రజలకు క్యాథ్ ల్యాబ్ సేవల్ని త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టంచేశారు. హైదరాబాద్లోని ఆస్పత్రులకు పరిమితమైన గుండె సంబంధిత వైద్య సేవల్ని.. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల వరకు విస్తరించి ప్రజల ప్రాణాలు కాపాడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. రెండ్రోజుల ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన ఖమ్మంలో పర్యటించారు.మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాథ్ ల్యాబ్ విభాగాన్ని మంత్రి ప్రారంభించారు. కార్డియాక్ ఎమర్జెన్సీ ట్రామాకేర్ విభాగాన్ని ప్రారంభించారు. మాతాశిశు సంరక్షణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన తల్లిపాల నిల్వ నిధి కేంద్రం (మిల్క్ బ్యాంకు)ను ప్రారంభించారు. మధిరలో రూ.34 కోట్లతో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రికి శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హరీశ్రావు మాట్లాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
[ 25-04-2024]
మారుమూల గిరిజన బిడ్డ ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించింది. బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో భద్రాద్రి జిల్లా -
ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా
[ 25-04-2024]
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు బుధవారం విడుదల య్యాయి. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 63.84 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నాలుగో స్థానంలో, -
కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాంరెడ్డి
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిని ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. కాంగ్రెస్ శ్రేణుల నెలన్నర రోజుల ఉత్కంఠకు తెరపడింది. -
భారాస హయాంలోనే ఉభయ జిల్లాల అభివృద్ధి: హరీశ్రావు
[ 25-04-2024]
ఖమ్మం జిల్లా అభివృద్ధికి గత భారాస ప్రభుత్వం పనిచేస్తే.. కాంగ్రెస్ సర్కారులో మంత్రి పదవులు పొందిన నేతలు మాత్రం తమ కుటుంబీకులకు ఎంపీ టికెట్ ఇప్పించుకునేందుకు అధిష్ఠానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. -
కేసీఆర్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి: తెదేపా
[ 25-04-2024]
మాజీ సీఎం కేసీఆర్ అబద్దపు జోస్యాలు, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తెదేపా ఖమ్మం పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు కేతినేని హరీశ్ చంద్ర హితవు పలికారు. -
భాజపాతోనే సమగ్రాభివృద్ధి: తాండ్ర
[ 25-04-2024]
భాజపా గెలుపుతోనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ఖమ్మం లోక్సభ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
గంజాయి పేరెత్తకుండా
[ 25-04-2024]
ఏపీ సరిహద్దునున్న మన్యం జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో కొంతకాలంగా గంజాయి ఎక్కువగా పట్టుబడుతోంది. రవాణా, విక్రయ ఘటనల్లో చిక్కే నిందితుల్లో ఎక్కువ మంది యువతే కావడం ఆందోళనకరం. -
మలేరియా కట్టడికి పరిశుభ్రత మంత్రం
[ 25-04-2024]
మైదాన ప్రాంతాలతో పోల్చిచూస్తే భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లోనే మలేరియా జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. -
ఓటరు తుది జాబితాలో తప్పులు ఉండొద్దు: కలెక్టర్
[ 25-04-2024]
ఓటు నమోదు దరఖాస్తుల విచారణ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. ఓటరు తుది జాబితాను తప్పులు లేకుండా రూపొందించాలన్నారు. -
తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతా: ఎంపీ నామా
[ 25-04-2024]
తెలంగాణ ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం పార్లమెంటు పోరాడేందుకు మరోసారి తనకు అవకాశం కల్పించాలని భారాస లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. -
ఆరో రోజు 21 సెట్ల నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో ఆరోరోజు బుధవారం 14 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు -
ఓటర్ల తుది జాబితా అభ్యర్థులకు అందించాలి
[ 25-04-2024]
లోక్సభ నియోజకవర్గాల వారీగా ఓటర్ల తుది జాబితా సిద్ధం చేసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?