విద్యార్థులు చరిత్ర రచయితలు కావాలి: జూలూరు
ఈనాటి విద్యార్థులే రేపటి తరాలకు చరిత్రను అందించే రచయితలని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అన్నారు. ఖమ్మం ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం
పునాస త్రైమాసిక పత్రికను ఆవిష్కరిస్తున్న కలెక్టర్ గౌతమ్, గౌరీశంకర్ తదితరులు
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్టుడే: ఈనాటి విద్యార్థులే రేపటి తరాలకు చరిత్రను అందించే రచయితలని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ అన్నారు. ఖమ్మం ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు-చరిత్ర-ఐక్యూఏసీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ‘మన ఊరు-మన చరిత్ర’ మన చరిత్రను మనమే రాసుకుందాం కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. దేశంలో ఏ సాహిత్య అకాడమీ చేపట్టని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల విద్యార్థులను ప్రోత్సహించి వారి గ్రామాల చరిత్రను తెలుసుకునేలా చేయటానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థులు కలాలు పట్టి కదిలితే అద్భుతమైన చరిత్ర వెలుగు చూస్తుందన్నారు. ఊరు ఎప్పుడు పుట్టింది...ఎలా రూపాన్ని తీసుకున్నదో పరిశోధనాత్మకంగా అనేకాంశాలను నిక్షిప్తం చేయాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వీరుల గురించి ఇప్పటివరకు చరిత్రకారులకు దొరకని అంశాలు, వీర తెలంగాణ సాయుధ పోరాటాన్ని రికార్డు చేయాలన్నారు. అందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ ఉత్తమ గ్రంథాలను వెలువరిస్తుందని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, మాజీ మంత్రి శీలం సిద్ధారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బోడేపూడి వెంకటేశ్వరరావు, పద్మశ్రీ వనజీవి రామయ్య లాంటి వారి చరిత్రలు ఎంతో ప్రాధాన్యత ఉన్నవని గౌరీశంకర్ చెప్పారు.
కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ మన చరిత్రను మనం తెలుసుకోకుంటే ఉనికిని కోల్పోయినట్లవుతుందన్నారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.మహ్మద్ జకీరుల్లా మాట్లాడుతూ తెలంగాణ సిద్ధించాక మన చరిత్ర-మన సంస్కృతి గురించి అధ్యయనం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. అనంతరం అకాడమీ రూపొందించిన త్రైమాసిక పత్రిక ‘పునాస’, తెలుగు విభాగం ప్రచురించిన ‘రూబాయిలు-ప్రక్రియ-తత్వం’ వైవిధ్య గ్రంథం, పొలిటికల్ సైన్స్ విభాగం విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన పుస్తకాలను గౌరీశంకర్, కలెక్టర్ గౌతమ్ ఆవిష్కరించారు. తెలుగు శాఖ అధిపతి డా.జె.రమేశ్, చరిత్రశాఖాధిపతి నాగూర్, తెలుగు అధ్యాపకుడు డా.సీతారామ్, హైదరాబాద్ బుక్ఫెయిర్ కార్యదర్శి చంద్రమోహన్, సత్యవతి, డా.బి.వెంకటేశ్వరరెడ్డి, నగరంలోని పలు డిగ్రీ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగునీటిని తప్పనిసరిగా పరీక్షించాలి
[ 28-03-2024]
ప్రజలకు సరఫరా చేసే తాగునీటికి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని ఎంపీడీవో రామకృష్ణ సూచించారు. -
కార్యకర్తలకు అండగా ఉంటా: పాయం
[ 28-03-2024]
కార్యకర్తలకు నిత్యం అండగా ఉంటానని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. పినపాక మండలంలో గురువారం పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు
[ 28-03-2024]
పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వాహనాన్ని బయ్యారం అడ్డరోడ్డులోని ఎన్నికల తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు సోదా చేశారు. -
దుస్తుల పంపిణీ
[ 28-03-2024]
పినపాక మండల పరిధిలోని తోగ్గూడెం గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థులకు గ్రేస్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచితంగా దుస్తులు పంపిణీ చేశారు. -
కాంగ్రెస్లో చేరిన భారాస సొసైటీ డైరెక్టర్
[ 28-03-2024]
భారాసకు చెందిన కారేపల్లి సొసైటీ డైరెక్టర్ డేగల ఉపేందర్ గురువారం కాంగ్రెస్ లో చేరారు. -
కరవు తీరా పని..!
[ 28-03-2024]
కరవు పరిస్థితులతో వ్యవసాయ కూలీ పనులు దొరక్క తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న గ్రామీణులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దన్నుగా నిలుస్తోంది. -
మూడు ప్రైవేట్ ఆసుపత్రుల సీజ్
[ 28-03-2024]
ఖమ్మం నగరంలో మూడు ప్రైవేట్ ఆసుపత్రులను సీజ్ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాలతి తెలిపారు. ఉన్నతాధికారులకు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఖమ్మంలోని వివిధ ఆసుపత్రుల్లో బుధవారం తనిఖీచేశారు. -
‘గాడి’న పడకుంటే.. గత్తర గత్తర
[ 28-03-2024]
అనేక మంది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. కొన్ని మార్గాల్లో యువకులు పోటీలు పడుతూ ద్విచక్ర వాహనాలను అతివేగంతో వంకరటింకరగా నడుపుతున్నారు. -
ఆధ్యాత్మిక కారిడార్ ఏర్పాటుకు కృషి: తాండ్ర
[ 28-03-2024]
అయోధ్య-భద్రాద్రి ఆధ్యాత్మిక కారిడార్ ఏర్పాటుకు కృషి చేస్తామని ఖమ్మం లోక్సభ భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
డ్రాగన్ పండు.. లాభాలు మెండు
[ 28-03-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అనేక మంది ఔత్సాహికులు, విద్యాధికులు, యువ రైతులు సైతం సాగుకు ఆసక్తి చూపుతున్నారు. -
ఆ ఇద్దరు దోచేస్తున్నారు..!
[ 28-03-2024]
‘దేశీ శిక్షణలో భాగంగా అధికారులకు రూ.10వేలు చెల్లించి తరగతులకు హాజరయ్యాను. ఒక్కరోజు గైర్హాజరైతే రూ.3వేలు వసూలు చేశారు. -
ఆక్రమణల చెరలోనే సాగర్ కాల్వలు
[ 28-03-2024]
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ మధిర బ్రాంచి కెనాల్ పరిధిలో ఉన్న ఊటుకూరు, మధిర మేజర్ కాల్వలు కబ్జాకు గురయ్యాయి. -
మద్యం మత్తులో యువకుల హల్చల్
[ 28-03-2024]
చంద్రుగొండలో మద్యం మత్తులో ఐదుగురు యువకులు పలువురిపై దాడిచేసిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. -
నిలబడలేకున్నా.. ఆసరా అందించరూ..
[ 28-03-2024]
నిరుపేద దంపతులు రెక్కల కష్టమ్మీద ముగ్గురు కుమార్తెల్లో ఇద్దరి పెళ్లిళ్లు చేశారు. ఆ కుటుంబాన్ని అనారోగ్య సమస్యలు వెంటాడాయి. -
మద్యం తాగాడని ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుడి నిర్బంధం
[ 28-03-2024]
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు మద్యం తాగి విధులకు హాజరై విద్యార్థులను కొట్టాడని పాఠశాలలో ఉంచి తాళం వేసిన ఘటన చర్ల మండలంలో చోటుచేసుకుంది. -
రామయ్య హుండీలో కాసుల గలగల..!
[ 28-03-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలోని మూడు రకాల హుండీలు కాసులతో కళకళలాడాయి. 26 రోజుల హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. జనరల్ హుండీల ద్వారా రూ.71,22,878 సమకూరింది.
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం