భోజన బిల్లులు చెల్లింపుల్లో నిర్లక్ష్యం
కొవిడ్ తర్వాత ప్రభుత్వ విద్యాలయాల్లో మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు ఏజెన్సీలు పెద్దగా ముందుకు రాలేదు. అందుక్కారణం.. ఇచ్చే ధరలు గిట్టుబాటు
ఏజెన్సీలకు రావాల్సిన నిధులు రూ.3.85 కోట్లు
పాల్వంచ విద్యావిభాగం, న్యూస్టుడే: కొవిడ్ తర్వాత ప్రభుత్వ విద్యాలయాల్లో మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు ఏజెన్సీలు పెద్దగా ముందుకు రాలేదు. అందుక్కారణం.. ఇచ్చే ధరలు గిట్టుబాటు కాకపోవడం, చాలీచాలని గౌరవ వేతనం, నెలల పాటు బిల్లుల పెండింగులో ఉంచడమే. దీంతో గత నిర్వాహకులు చాలా మంది స్పందించక పోవడంతో గతేడాది బడుల పునః ప్రారంభం నుంచి ప్రధానోపాధ్యాయులు ప్రత్యామ్నాయంగా వేరొకరికి బాధ్యతలు అప్పగించారు. పాతవారికి, కొత్తవారికి సైతం బిల్లులు బకాయిగా ఉంచడం గమనార్హం. 2021-22 విద్యా సంవత్సరం సెప్టెంబరు నెల నుంచి తరగతులు ప్రారంభం కాగా.. అప్పటికే గత ఏజెన్సీలకు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. దీంతో మళ్లీ విద్యార్థులకు వండి పెట్టేందుకు నిర్వాహకులు చాలాచోట్ల ముందుకు రాలేదు. అలా రాని చోట పాఠశాలల హెచ్ఎంలు కొత్త ఏజెన్సీలను ఏర్పాటు చేసుకున్నారు. వీరికీ చాలా బిల్లులు పెండింగ్లో ఉండటం గమనార్హం.
జిల్లావ్యాప్తంగా 23 మండలాల్లో మధ్యాహ్న భోజన పథకం కింద 2,225 మంది వంట ఏజెన్సీల నిర్వాహకులు పనిచేస్తున్నారు. 1,060 ప్రాథమిక పాఠశాలల్లో 51,312, 162 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 18,210, 131 ఉన్నత పాఠశాలల్లో 11,281 మంది విద్యార్థులున్నారు. ప్రాథమిక స్థాయిలో ఒక్కో విద్యార్థికి రూ.4.97 చొప్పున, ఉన్నత స్థాయిలో రూ.7.45, వేరుగా గుడ్డుకు రూ.4 చొప్పున చెల్లించాల్సి ఉంది. ఈ ఏడాది మొత్తం రూ.3,85,63,263 చెల్లించాలి. ఈ మేరకు ఉన్నతాధికారులకు విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది. ఇందులో ఇటీవల రూ.1,57,23,000 మంజూరు చేశారు. ఇవి ఇంకా ఖాతాల్లో వేయాల్సి ఉంది. గత్యంతరం లేని పరిస్థితుల్లో తాము భోజనాలు పెట్టేందుకు ముందుకొస్తే.. మళ్లీ బకాయిలు పోగు పెడతారా? అంటూ కొత్త నిర్వాహకులు మండిపడుతున్నారు. పెరిగిన కూరగాయలు, నిత్యావర ధరలు భరిస్తూ.. అప్పుటు చేసి మరీ నెట్టుకొచ్చామన్నారు. పలువురు ఏజెన్సీల వారు ఎంఈవోల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఇంకా బిల్లులు పూర్తికాలేదనే సమాధానం వారికి ఎదురవుతోంది.
‘‘ఇప్పటి వరకు సగం నిధులు మంజూరయ్యాయి. ఏజెన్సీల ఖాతాల్లో జమచేసేందుకు ఎంఈవో కార్యాలయాధికారులు చర్యలు చేపడుతున్నారు. మరో వారంలో పనిపూర్తవుతుంది. మరో దశలో మిగతా మొత్తం మంజూరుకానున్నాయి. అవి రాగానే ఖాతాలో జమచేస్తాం.’
- సోమశేఖర్శర్మ, డీఈవో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బదిలీ పొందిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలి
[ 19-04-2024]
గత విద్యా సంవత్సరంలో బదిలీ పొంది రిలీవర్ లేనందున రిలీవ్ చేయని ఉపాధ్యాయులను వెంటనే వారు బదిలీ పొందిన స్థానంలో నియమించాలని తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భానోత్ వీరు నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. -
విజేతలకు బహుమతులు అందజేత
[ 19-04-2024]
పొన్నేల్లో బోడేపూడి ట్రస్ట్ ద్వారా మండల స్థాయి క్రికెట్ పోటీలు అంబేద్కర్ యువ మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. -
తాటి చెట్టు పైనుంచి పడి కల్లుగీత కార్మికుడి మృతి
[ 19-04-2024]
ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
జగాలను ఏలిన రామయ్యకు పట్టాభిషేకం
[ 19-04-2024]
ధర్మమే ఆకారం దాల్చిన రామావతారుడు భద్రగిరిలో కొలువై ఉండగా తక్కువేమి మనకు అంటూ కోలాటాలు ఆడారు. -
తొలిరోజు ఖమ్మంలో ఒకటే నామినేషన్
[ 19-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో తొలిరోజు గురువారం ఒక నామపత్రం దాఖలైంది. అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఆదార్) పార్టీ తరఫున ముదిగొండ మండలం గంధసిరికి చెందిన కుక్కల నాగయ్య ఒక సెట్ నామపత్రాలను ఆర్ఓ గౌతమ్కు అందజేశారు -
ఏ పత్రం.. ఏం చెబుతుందంటే..?
[ 19-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రకటన గురువారం వెలువడింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫాం-1 ద్వారా ఆయా స్థానాల్లో నోటీసు జారీ చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లను గురువారం నుంచే స్వీకరిస్తున్నారు. -
అడుగంటిన జలం.. అపర భగీరథ ప్రయత్నం
[ 19-04-2024]
అడుగంటిన భూగర్భజలాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో కొందరు రైతులు పామాయిల్ సాగు చేశారు. -
18లో మేలుకొలుపు ప్రజాస్వామ్య గెలుపు
[ 19-04-2024]
ప్రజాస్వామ్య ఎన్నికల్లో యువ ఓటర్ల చైతన్యమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం వినూత్న ప్రయోగాలు చేస్తోంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కొత్తగా చేపట్టే కార్యక్రమం.. ‘టర్నింగ్-18’. అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నిక ప్రక్రియలో ఏ ఒక్కఓటరూ వెనకబడకుండా చూడటమే అంతిమ లక్ష్యం. -
బేతుపల్లి అంకమ్మతల్లి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి
[ 19-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బేతుపల్లి అంకమ్మ తల్లి తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మవారిని ఊరేగించే రథాలను సిద్ధం చేశారు. -
ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
[ 19-04-2024]
జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో క్రోధి నామ సంవత్సర వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. స్వామి వారికి ప్రాతఃకాల అర్చనల అనంతరం యజ్ఞశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు -
సోనియా రుణం తీర్చుకోవాలి: మంత్రి తుమ్మల
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ అగ్రనేత సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు -
గుళికల మందు మింగి బలవన్మరణం
[ 19-04-2024]
గుళికల మందు మింగి ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ నాగేశ్వరరావు కథనం ప్రకారం.. అశ్వారావవుపేట కోతమిషన్ బజారులో కూలీ పనులు చేస్తూ జీవించే బమ్మిడి సాంబయ్య(62)కు పదిహేనేళ్ల కిందట కడుపు పైభాగంలో కణితి ఏర్పడింది -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
[ 19-04-2024]
రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన జూలూరుపాడు మండలం సాయిరాంతండా వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది
తాజా వార్తలు (Latest News)
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?