ఉత్సాహం రెట్టింపు
రాజ్యసభ తెరాస అభ్యర్థుల జాబితాలో ఖమ్మం జిల్లాకు బంపర్ ఆఫర్ దక్కింది. ప్రకటించిన ముగ్గురు అభ్యర్థుల్లో ఖమ్మం జిల్లా నుంచే ఇద్దరికి చోటు దక్కింది. ప్రముఖ హెటిరో డ్రగ్స్ అధినేత
రాజ్యసభ తెరాస అభ్యర్థులుగా పార్థసారథిరెడ్డి, రవిచంద్ర
ఈటీవీ, ఖమ్మం: రాజ్యసభ తెరాస అభ్యర్థుల జాబితాలో ఖమ్మం జిల్లాకు బంపర్ ఆఫర్ దక్కింది. ప్రకటించిన ముగ్గురు అభ్యర్థుల్లో ఖమ్మం జిల్లా నుంచే ఇద్దరికి చోటు దక్కింది. ప్రముఖ హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథిరెడ్డి, గాయత్రి గ్రానైట్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత వద్దిరాజు రవిచంద్రను అభ్యర్థులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఖమ్మం జిల్లాకు మరో రెండు రాజకీయ పదవులు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. వేంసూరు మండలం కందుకూరుకు చెందిన పార్థసారథిరెడ్డి ప్రముఖ వ్యాపారవేత్తగా ప్రత్యేక గుర్తింపు ఉంది. రవిచంద్ర ప్రముఖ గ్రానైట్ వ్యాపారిగా కాకుండానే రాజకీయంగా బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతగా పేరుంది. వీరిద్దరికీ ముఖ్యమంత్రి కేసీఆర్తో సన్నిహిత సంబంధాలు ఉన్నందునే ఇద్దరినీ రాజ్యసభ అభ్యర్థిత్వం వరించింది. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒకరికి, బీసీ సామాజిక వర్గం నుంచి ఇంకొకరిని అభ్యర్థులుగా ఎంపిక చేయడంతో జిల్లాలో తెరాసలో మరోసారి సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసినట్లైంది.
ఇద్దరూ వ్యాపారవేత్తలే..
బండి పార్థసారథిరెడ్డి వేంసూరు మండలం కందుకూరులో జన్మించారు. కందుకూరులో పదో తరగతి వరకు చదివారు. సత్తుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. 1993లో హెటిరో డ్రగ్స్ కంపెనీ స్థాపించి వ్యాపారవేత్తగా ఎదిగారు. జిల్లాలో సాయిస్ఫూర్తి ట్రస్టు ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలు, దేవాలయాలు అభివృద్ధికి విరాళాలు అందజేశారు.
వద్దిరాజు రవిచంద్ర మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తిలో 1964లో జన్మించారు. ఖమ్మం జిల్లాతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఈ జిల్లా నుంచే ఆయన ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. తెలంగాణ గ్రానైట్ క్వారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. వ్యాపారవేత్తగా, సామాజిక సేవకునిగా, రాజకీయ నాయకునిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో సుదీర్ఘ అనుభవం ఉంది. జిల్లాలో ప్రముఖ బీసీ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ సమక్షంలో తెరాసలో చేరారు. అప్పటి నుంచి ఖమ్మం జిల్లా తెరాస నేతగానే కొనసాగుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాటి చెట్టు పైనుంచి పడి కల్లుగీత కార్మికుడి మృతి
[ 19-04-2024]
ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
జగాలను ఏలిన రామయ్యకు పట్టాభిషేకం
[ 19-04-2024]
ధర్మమే ఆకారం దాల్చిన రామావతారుడు భద్రగిరిలో కొలువై ఉండగా తక్కువేమి మనకు అంటూ కోలాటాలు ఆడారు. -
తొలిరోజు ఖమ్మంలో ఒకటే నామినేషన్
[ 19-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో తొలిరోజు గురువారం ఒక నామపత్రం దాఖలైంది. అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఆదార్) పార్టీ తరఫున ముదిగొండ మండలం గంధసిరికి చెందిన కుక్కల నాగయ్య ఒక సెట్ నామపత్రాలను ఆర్ఓ గౌతమ్కు అందజేశారు -
ఏ పత్రం.. ఏం చెబుతుందంటే..?
[ 19-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రకటన గురువారం వెలువడింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫాం-1 ద్వారా ఆయా స్థానాల్లో నోటీసు జారీ చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లను గురువారం నుంచే స్వీకరిస్తున్నారు. -
అడుగంటిన జలం.. అపర భగీరథ ప్రయత్నం
[ 19-04-2024]
అడుగంటిన భూగర్భజలాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో కొందరు రైతులు పామాయిల్ సాగు చేశారు. -
18లో మేలుకొలుపు ప్రజాస్వామ్య గెలుపు
[ 19-04-2024]
ప్రజాస్వామ్య ఎన్నికల్లో యువ ఓటర్ల చైతన్యమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం వినూత్న ప్రయోగాలు చేస్తోంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కొత్తగా చేపట్టే కార్యక్రమం.. ‘టర్నింగ్-18’. అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నిక ప్రక్రియలో ఏ ఒక్కఓటరూ వెనకబడకుండా చూడటమే అంతిమ లక్ష్యం. -
బేతుపల్లి అంకమ్మతల్లి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి
[ 19-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బేతుపల్లి అంకమ్మ తల్లి తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మవారిని ఊరేగించే రథాలను సిద్ధం చేశారు. -
ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
[ 19-04-2024]
జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో క్రోధి నామ సంవత్సర వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. స్వామి వారికి ప్రాతఃకాల అర్చనల అనంతరం యజ్ఞశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు -
సోనియా రుణం తీర్చుకోవాలి: మంత్రి తుమ్మల
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ అగ్రనేత సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు -
గుళికల మందు మింగి బలవన్మరణం
[ 19-04-2024]
గుళికల మందు మింగి ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ నాగేశ్వరరావు కథనం ప్రకారం.. అశ్వారావవుపేట కోతమిషన్ బజారులో కూలీ పనులు చేస్తూ జీవించే బమ్మిడి సాంబయ్య(62)కు పదిహేనేళ్ల కిందట కడుపు పైభాగంలో కణితి ఏర్పడింది -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
[ 19-04-2024]
రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన జూలూరుపాడు మండలం సాయిరాంతండా వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు