వ్యవసాయంలో ఉమ్మడి జిల్లా ఆదర్శం
వైవిధ్యమైన పంటలు, ఆధునిక సాగుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా పెట్టింది పేరని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వానాకాలం-2022 సాగుకు సమాయత్తంపై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులకు
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఎస్.నిరంజన్రెడ్డి, వేదికపై మంత్రి అజయ్కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, పల్లా రాజేశ్వరరెడ్డి, ఎం.రఘునందన్రావు, రేగా కాంతారావు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, అనుదీప్, జడ్పీ ఛైర్మన్ కమల్రాజు, ఎమ్మెల్యే సండ్ర తదితరులు
ఖమ్మం వ్యవసాయం, న్యూస్టుడే: వైవిధ్యమైన పంటలు, ఆధునిక సాగుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా పెట్టింది పేరని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వానాకాలం-2022 సాగుకు సమాయత్తంపై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులకు గురువారం ఖమ్మం ఎస్ఆర్గార్డెన్స్లో నిర్వహించిన సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు జిల్లాల రైతులు ఆయిల్పామ్ సాగు పద్ధతులు తెలుసుకునేందుకు భద్రాద్రి జిల్లాకు వస్తున్నారన్నారు. మార్కెట్ డిమాండ్ను బట్టి రైతులు పంటలు వేసేలా, విత్తనాలు, ఎరువుల ఎంపిక, వినియోగంపై రైతు వేదికల ద్వారా అధికారులు అవగాహన కల్పించాలని కోరారు. జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మన వ్యవసాయ ఉత్పత్తులు చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయ రంగం మీద దూరదృష్టి లేదన్నారు. ‘రైతుబంధు’ ద్వారా కర్షకుల ఖాతాల్లో నగదు వేయటం దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం చేయలేదన్నారు.రైతులు, రైతు బంధు సమితి సభ్యులు, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి మార్పులు తీసుకురావాలన్నారు.
* మంత్రి అజయ్కుమార్ మాట్లాడుతూ సాగు బాగుపడాలంటే వ్యవసాయ విస్తరణ జరగాలన్నారు. నూతన యాజమాన్య పద్ధతులు, వాడాల్సిన ఎరువులపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయశాఖలో అన్ని పోస్టులను భర్తీ చేసిన ఏకైక సీఎం కేసీఆర్ అని చెప్పారు.
* ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో రైతుల గురించి ఆలోచన చేసింది కేసీఆర్ మాత్రమేనన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలన్నారు.
* రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ రైతు బంధు సమితులకు ప్రోత్సాహం అందిస్తామని, ప్రభుత్వ కార్యక్రమాల్లో గుర్తింపు కూడా కల్పిస్తామని, గౌరవ వేతనం కూడాపరిశీలనలో ఉందన్నారు.కార్యక్రమంలో వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్ ఎం.రఘునందన్రావు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, అనుదీప్, జడ్పీ ఛైర్మన్ కమల్రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, లావుడ్యా రాములునాయక్, మెచ్చా నాగేశ్వరరావు, డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషయ్య, డీసీఎంఎస్ ఛైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్క్ఫెడ్ వైస్ ఛైర్మన్ రాజశేఖర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ వెంకటేశ్వరరావు, డీఏవోలు సరిత, అభిమన్యుడు పాల్గొన్నారు.
* రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఉభయ జిల్లాల చెందిన నలుగురు ఏఈవోలతో ‘మాటా-మంతీ’ నిర్వహించి ఆకట్టుకున్నారు. విధి నిర్వహణ, రైతులకు అందుతున్న సేవలు, అనుభవాలు, ఉద్యోగ ప్రస్థానం గురించి ఒక్కొక్కరితో మాట్లాడారు.
* శాస్త్రవేత్తలతో అవగాహన: సాగు సన్నాహక సమావేశం సందర్భంగా రెండు జిల్లాల వ్యవసాయశాఖ అధికారులకు ప్రతిభ పరీక్ష నిర్వహించారు. ఏఈవోలు, ఏవోలు, డీఏవోలకు ఒక లింకు ద్వారా ప్రశ్న పత్రం అందించి దాన్ని పూర్తి చేసేందుకు రెండు గంటల సమయం ఇచ్చారు. సమావేశం పూర్తయిన తర్వాత ప్రతిభ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఉదయం జరిగిన సమావేశంలో పలు అంశాలపై శాస్త్రవేత్తలతో అవగాహన కల్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా
[ 25-04-2024]
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు బుధవారం విడుదల య్యాయి. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 63.84 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నాలుగో స్థానంలో, -
కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాంరెడ్డి
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిని ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. కాంగ్రెస్ శ్రేణుల నెలన్నర రోజుల ఉత్కంఠకు తెరపడింది. -
భారాస హయాంలోనే ఉభయ జిల్లాల అభివృద్ధి: హరీశ్రావు
[ 25-04-2024]
ఖమ్మం జిల్లా అభివృద్ధికి గత భారాస ప్రభుత్వం పనిచేస్తే.. కాంగ్రెస్ సర్కారులో మంత్రి పదవులు పొందిన నేతలు మాత్రం తమ కుటుంబీకులకు ఎంపీ టికెట్ ఇప్పించుకునేందుకు అధిష్ఠానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. -
కూలీ బిడ్డకు 993 మార్కులు
[ 25-04-2024]
మారుమూల గిరిజన బిడ్డ ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించింది. బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో భద్రాద్రి జిల్లా -
కేసీఆర్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి: తెదేపా
[ 25-04-2024]
మాజీ సీఎం కేసీఆర్ అబద్దపు జోస్యాలు, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తెదేపా ఖమ్మం పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు కేతినేని హరీశ్ చంద్ర హితవు పలికారు. -
భాజపాతోనే సమగ్రాభివృద్ధి: తాండ్ర
[ 25-04-2024]
భాజపా గెలుపుతోనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ఖమ్మం లోక్సభ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
గంజాయి పేరెత్తకుండా
[ 25-04-2024]
ఏపీ సరిహద్దునున్న మన్యం జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో కొంతకాలంగా గంజాయి ఎక్కువగా పట్టుబడుతోంది. రవాణా, విక్రయ ఘటనల్లో చిక్కే నిందితుల్లో ఎక్కువ మంది యువతే కావడం ఆందోళనకరం. -
మలేరియా కట్టడికి పరిశుభ్రత మంత్రం
[ 25-04-2024]
మైదాన ప్రాంతాలతో పోల్చిచూస్తే భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లోనే మలేరియా జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. -
ఓటరు తుది జాబితాలో తప్పులు ఉండొద్దు: కలెక్టర్
[ 25-04-2024]
ఓటు నమోదు దరఖాస్తుల విచారణ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. ఓటరు తుది జాబితాను తప్పులు లేకుండా రూపొందించాలన్నారు. -
తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతా: ఎంపీ నామా
[ 25-04-2024]
తెలంగాణ ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం పార్లమెంటు పోరాడేందుకు మరోసారి తనకు అవకాశం కల్పించాలని భారాస లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. -
ఆరో రోజు 21 సెట్ల నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో ఆరోరోజు బుధవారం 14 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు -
ఓటర్ల తుది జాబితా అభ్యర్థులకు అందించాలి
[ 25-04-2024]
లోక్సభ నియోజకవర్గాల వారీగా ఓటర్ల తుది జాబితా సిద్ధం చేసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)