కాలువ చెంత.. నీరందక చింత
శ్రీరాంసాగర్ వరద కాలువ వస్తుందంటే రైతులు ఎంతో సంతోషించారు. 2008లో ఎకరానికి రూ.80 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు పరిహారం చెల్లిస్తూ భూసేకరణ పనులు చకచకా పూర్తి చేశారు.తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం గ్రామీణం
కూసుమంచి, న్యూస్టుడే
తవ్వకం పనులు పూర్తయిన ప్రాంతంలో నిరుపయోగంగా..
శ్రీరాంసాగర్ వరద కాలువ వస్తుందంటే రైతులు ఎంతో సంతోషించారు. 2008లో ఎకరానికి రూ.80 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు పరిహారం చెల్లిస్తూ భూసేకరణ పనులు చకచకా పూర్తి చేశారు.తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం గ్రామీణం మండలంలో పూర్తిగా నేలకొండపల్లి మండలంలోని కొంత ప్రాంతానికి వెరసీ సుమారు 74 వేల ఎకరాలకు సాగునీరందించే ప్రధాన కాలువ డీబీఎం-60 తవ్వకం పనులు పూర్తయ్యాయి. అయితే అనుసంధాన కాలువ పనులు పూర్తికాకపోవడంతో సమస్య ఏర్పడింది.
వీడని గ్రహణం...
డీబీఎం-60 ప్రధాన కాలువకు అనుసంధానమైన 7ఆర్ కాలువ పనులు నిలిచిపోయాయి. పరిహారం విషయంలో సమస్యలు, చెక్కుల జారీలో జాప్యం తదితర సమస్యలతో 9 మంది రైతులకు చెందిన 11 ఎకరాల భూసేకరణ నిలిచిపోవడంతో సమస్య ఏర్పడింది. 2018లో తెలంగాణ ప్రభుత్వం భక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని ఈ కాలువలతో అనుసంధానించారు. ప్రధాన కాలువలో పాలేరు జలాలు ప్రవహించాయి. అనుసంధాన పిల్లకాలువల తవ్వకం పనులు చకచకా జరిగాయి. వేసవిలో పశువులు తాగేందుకు చుక్కనీరుండని చెరువులు పాలేరు జలాల చేరికతో మండువేసవిలో అలుగులు పారాయి. ఈ తరుణంలో తమకు పరిహారం పెంచి ఇవ్వాలనే రైతుల వినతిని అధికారులు తిరస్కరించడంతో రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న పరిహారం సమకూర్చితే తాము భూముల్ని అప్పగిస్తామని రైతులు స్పష్టం చేస్తున్నారు.
ఆరు వేల ఎకరాలకు సాగునీరు కరవు
7ఆర్ కాలువ పనులు అర్దాంతరంగా నిలిచిపోవడంతో ఆయకట్టు 6 వేల ఎకరాలకు భక్తరామదాసు ఫలాలు అందడం లేదు. కాలువ పరిధిలో లోక్యాతండా, కోక్యాతండా, కూసుమంచి, గంగబండతండా, గట్టుసింగారం, పెరిక సింగారం, జుజ్జులరావుపేట తదితర గ్రామాల చెరువులకు నీరందడం లేదు. కాలువ చెంతనే ఉన్నప్పటికీ వేలాది మంది రైతుల సాగునీటి చింత నేటికీ తీరడంలేదు.
పరిహారం విషయంలో రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కాలువ తవ్వకం పనులు నిలిచి ఉన్నాయి. దీంతో ఆరు వేల ఎకరాలకు నీరందని విషయం యదార్థమే. గతంలో ప్రభుత్వం ఇచ్చిన పరిహారానికి, రైతులు కోరుతున్న పరిహారానికి చాలా వ్యత్యాసం ఉన్న దృష్ట్యా సమస్య పరిష్కారానికి జాప్యం జరిగింది. అయితే ఇటీవల రైతులతో చర్చలు జరుపుతున్నాం. కొద్దిరోజుల్లోనే లోక్అదాలత్ ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాం.
- సీఈ శంకర్నాయక్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన జీఎం
[ 25-04-2024]
ఇల్లందు ఏరియా సింగరేణి రన్స్ అండ్ గోల్స్ స్టేడియం (24 ఏరియా)లో వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోషియేషన్ ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. -
కారేపల్లిలో భాజపా అభ్యర్థి రోడ్ షో
[ 25-04-2024]
కారేపల్లి ప్రధాన రహదారిలో భాజపా ఖమ్మం ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద రావు గురువారం రోడ్ షో నిర్వహించారు. -
ఆ ఊట నీళ్లే వారికి అమృతం.. 30 ఏళ్లుగా తాగుతున్న ఆదివాసీలు
[ 25-04-2024]
చర్ల మండలంలోని మారుమూల పల్లె వెంకటచెరువులో ఆదివాసీలు ఇప్పటికీ ఊటనీటినే తాగుతున్నారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
[ 25-04-2024]
మారుమూల గిరిజన బిడ్డ ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించింది. బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో భద్రాద్రి జిల్లా -
ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా
[ 25-04-2024]
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు బుధవారం విడుదల య్యాయి. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 63.84 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నాలుగో స్థానంలో, -
కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాంరెడ్డి
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిని ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. కాంగ్రెస్ శ్రేణుల నెలన్నర రోజుల ఉత్కంఠకు తెరపడింది. -
భారాస హయాంలోనే ఉభయ జిల్లాల అభివృద్ధి: హరీశ్రావు
[ 25-04-2024]
ఖమ్మం జిల్లా అభివృద్ధికి గత భారాస ప్రభుత్వం పనిచేస్తే.. కాంగ్రెస్ సర్కారులో మంత్రి పదవులు పొందిన నేతలు మాత్రం తమ కుటుంబీకులకు ఎంపీ టికెట్ ఇప్పించుకునేందుకు అధిష్ఠానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. -
కేసీఆర్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి: తెదేపా
[ 25-04-2024]
మాజీ సీఎం కేసీఆర్ అబద్దపు జోస్యాలు, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తెదేపా ఖమ్మం పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు కేతినేని హరీశ్ చంద్ర హితవు పలికారు. -
భాజపాతోనే సమగ్రాభివృద్ధి: తాండ్ర
[ 25-04-2024]
భాజపా గెలుపుతోనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ఖమ్మం లోక్సభ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
గంజాయి పేరెత్తకుండా
[ 25-04-2024]
ఏపీ సరిహద్దునున్న మన్యం జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో కొంతకాలంగా గంజాయి ఎక్కువగా పట్టుబడుతోంది. రవాణా, విక్రయ ఘటనల్లో చిక్కే నిందితుల్లో ఎక్కువ మంది యువతే కావడం ఆందోళనకరం. -
మలేరియా కట్టడికి పరిశుభ్రత మంత్రం
[ 25-04-2024]
మైదాన ప్రాంతాలతో పోల్చిచూస్తే భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లోనే మలేరియా జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. -
ఓటరు తుది జాబితాలో తప్పులు ఉండొద్దు: కలెక్టర్
[ 25-04-2024]
ఓటు నమోదు దరఖాస్తుల విచారణ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. ఓటరు తుది జాబితాను తప్పులు లేకుండా రూపొందించాలన్నారు. -
తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతా: ఎంపీ నామా
[ 25-04-2024]
తెలంగాణ ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం పార్లమెంటు పోరాడేందుకు మరోసారి తనకు అవకాశం కల్పించాలని భారాస లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. -
ఆరో రోజు 21 సెట్ల నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో ఆరోరోజు బుధవారం 14 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు -
ఓటర్ల తుది జాబితా అభ్యర్థులకు అందించాలి
[ 25-04-2024]
లోక్సభ నియోజకవర్గాల వారీగా ఓటర్ల తుది జాబితా సిద్ధం చేసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM