సరదా కాకూడదు విషాదం
వేసవి కాలం వచ్చిందంటే చాలు పిల్లలు సరదాగా ఈతకు వెళుతుంటారు. సెలవులు రావడంతో చిన్నారులు ఇళ్ల వద్దే ఉంటున్నారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు, పెద్దలు ఇతర పనుల్లో నిమగ్నమై ఉండటంతో వారిపై పర్యవేక్షణ కొరవడింది.
ఖమ్మం మయూరిసెంటర్, న్యూస్టుడే
వేసవి కాలం వచ్చిందంటే చాలు పిల్లలు సరదాగా ఈతకు వెళుతుంటారు. సెలవులు రావడంతో చిన్నారులు ఇళ్ల వద్దే ఉంటున్నారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు, పెద్దలు ఇతర పనుల్లో నిమగ్నమై ఉండటంతో వారిపై పర్యవేక్షణ కొరవడింది. ఇటీవల ఈతకు వెళ్లి, ప్రమాదవశాత్తు కాలుజారి నీళ్లలో పడి మరణించిన ఘటనలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఖమ్మంలోని లకారం ట్యాంకుబండ్లో ఓ విద్యార్థి కాలుజారి పడిపోయి మృత్యువాత పడ్డాడు. కారేపల్లి మండలంలో ఓ బాలుడు నడుముకు కట్టుకున్న డబ్బా ఊడిపోవడంతో నీటిలో మునిగి మృతి చెందాడు.
ఈత నేర్చుకుంటూ ప్రమాదాలు
ఖమ్మం నగరంలో స్విమ్మింగ్ ఫూల్లు అందుబాటులో ఉండగా, మిగిలిన ప్రాంతాల్లో ఆ అవకాశం లేదు. దీంతో పిల్లలు, యువకులు వాహనాల ట్యూబులు, తాళ్లను తీసుకొని ఈతకు వెళుతున్నారు. వీటి ఆధారం చేసుకుని కొంతమంది నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో వాటికి చిన్నరంధ్రం ఏర్పడి గాలిపోయినా నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంటుంది. కొందరు ఎండ వేడికి తట్టుకోలేక ఎక్కువ సమయం నీళ్లలోనే గడిపేందుకు ఇష్టపడతారు. ఈదడం రాని వారు సైతం వారిని అనుకరిస్తూ అక్కడే ఉంటున్నారు. ఇక్కడే ప్రమాదాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నీటి మునుగుతూ రక్షించబోయిన వారిని భయంతో గట్టిగా పట్టుకోవడంతో వారూ కూడా మృతి చెందే ప్రమాదం ఉంది.
లోతు తెలియక మునక
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వందలాది చెరువులు, కుంటలు, వ్యవసాయ బావులు ఉన్నాయి. ప్రస్తుతం వాటిల్లో నీళ్లు కూడా అధికంగానే ఉన్నాయి. ఇదివరకు మిషన్ కాకతీయ పథకంలో చెరువులు, కుంటల్లో యంత్రాల సహాయంతో పూడికతీత పనులు నిర్వహించారు. దీంతో అవి ఎక్కువ లోతుగా ఉన్నాయి. వీటిలోకి ఈతకు వెళితే లోతు తెలియక మునిగిపోయే ప్రమాదం ఉంది. చెరువులు, కుంటల్లో ఈత కొట్టే సమయంలో గతంలో చేపలు పట్టేందుకు ఉపయోగించిన వలలు, గడ్డితీగ కాళ్లకు చుట్టుకుని మునిగిపోయే ప్రమాదం ఉంది.
ఇలా చేస్తే మేలు..
* గ్రామాల్లో చెరువులు, వ్యవసాయబావులు, కుంటల వద్ద పగటివేళల్లో కాపలా కాయాలి.
* పిల్లలు మూకుమ్మడిగా చెరువుల్లోకి దిగకుండా చూడాలి.
* జలాశయాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి.
* నీటి లోతును తెలిపేవిధంగా వివరాలు వాటిలో నమోదు చేయాలి.
* తల్లిదండ్రులు, సంరక్షకుల పర్యవేక్షణలోనే చిన్నపిల్లలకు ఈత నేర్పించాలి.
* మగ, ఆడ అనే తేడా లేకుండా పిల్లలు అందరికీ ఈత నేర్పించాలి. ఈ సమయంలో లైఫ్జాకెట్ తప్పనిసరిగా ధరించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
* మహిళలు దుస్తులు ఉతికేందుకు వెళ్లి జారి నీళ్లలో పడే అవకాశాలు ఉన్నాయి. వారు వీలైనంత వరకు ఒడ్డునే అలాంటి పనులు చేపట్టాలి.
పిల్లలపై పర్యవేక్షణే ముఖ్యం
జయప్రకాశ్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి
వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు పిల్లలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. వారు నీటి కుంటలు, చెరువుల వద్దకు వెళ్లకుండా చూడాలి. ఈత నేర్పించడం మంచిదే అయినప్పటికీ తగిన రక్షణ చర్యలు తీసుకోవాలి. నిర్లక్ష్యం వహిస్తే నీటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం
[ 24-04-2024]
బర్లగూడెం గ్రామంలో రాష్ట్రస్థాయిలో ఆర్ఆర్ఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్, బర్లగూడెం ఎక్సలెంట్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను శాసనసభ్యుడు కోరం కనకయ్య ప్రారంభించారు. -
నామినేషన్ దాఖలు చేసిన భారాస ఎంపీ అభ్యర్థి నామా
[ 24-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. -
ఓటుకు పోటెత్తేలా
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. 2014 ఎన్నికలతో పోల్చితే 2019లో జరిగిన సార్వత్రిక సమరంలో పోలింగ్ శాతం తక్కువ నమోదవటంపై కారణాలు అన్వేషించింది. -
అయిదో రోజూ నామినేషన్ల సందడి
[ 24-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో అయిదో రోజు మంగళవారం ఎనిమిది మంది అభ్యర్థులు పదకొండు సెట్ల నామపత్రాలను మంగళవారం సమర్పించారు. -
ప్రచార తీరు.. మారింది గురూ..!
[ 24-04-2024]
ఒకప్పుడు ఎన్నికలు వచ్చాయంటే ఊరూరా ర్యాలీలు, మైకుల హోరుతో ప్రచారం జోరుగా సాగేది. శాసనసభ, లోక్సభ స్థానాల బరిలో నిలిచిన అభ్యర్థులు కనీసం ఒక్కసారైనా ప్రతి గ్రామాన్ని చుట్టేసి వచ్చేవారు. -
అడుగడుగునా అడ్డంకులే..
[ 24-04-2024]
సీతారామ ప్రధాన కాలువ నీటిని వైరా జలాశయానికి అనుసంధానం చేసే కాలువ పనులకు అడగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. -
భద్రాచలం నుంచి తొలి మంత్రి కమలకుమారి
[ 24-04-2024]
ఉద్యోగం వదిలి ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన కర్రెద్దుల కమలకుమారి భద్రాచలం ఎంపీగా నెగ్గి కేంద్రంలో సహాయ మంత్రిగా ఉండి మన్యానికి సేవలు అందించారు. -
పడిపోతున్న ఎండు మిరప ధరలు
[ 24-04-2024]
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఎండు మిరప ధరలు పడిపోతున్నాయి. రోజురోజుకు ధరలు తగ్గటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
దేశ యవనికపై అశ్వారావుపేట పూర్వ విద్యార్థులు సత్తా
[ 24-04-2024]
దేశ యవనికపై అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా జరిగిన వ్యవసాయ శాస్త్రవేత్తల ఎంపికలో ఒకేసారి ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. -
కోల్ ప్లాంట్ కింగ్
[ 24-04-2024]
కేటీపీఎస్ ఐదు, ఆరు దశల కర్మాగారాల కోల్ ప్లాంట్లో పనిచేసే ఓ అధికారిపై కార్మికులు, ఉద్యోగులు వివిధ ఆరోపణలు చేస్తున్నారు. -
‘అమ్మ’ ఆదర్శ పాఠశాలల పనులపై కలెక్టర్ సమీక్ష
[ 24-04-2024]
‘అమ్మ’ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనుల పూర్తి బాధ్యత హెచ్ఎంలదే అని కలెక్టర్ ప్రియాంక అల అన్నారు. కలెక్టరేట్ నుంచి హెచ్ఎంలతో వీడియోకాన్ఫరెన్స్లో మంగళవారం మాట్లాడారు. -
అన్నీ బాగుంటేనే అనుమతులు
[ 24-04-2024]
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఈనెల 19 నుంచి జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!