పల్లెల్లో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం
గ్రామాల్లో పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యమిస్తూ నిత్యం ఇంటింటి నుంచి చెత్త సేకరణ జరగాలి.. డంపింగ్ యార్డులకు తరలించిన అనంతరం తడి చెత్త నుంచి కంపోస్టు ఎరువు తయారీకి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి జూపల్లి హరిప్రసాద్ తెలిపారు.
గ్రామాల్లో పారిశుద్ధ్య పనులకు ప్రాధాన్యమిస్తూ నిత్యం ఇంటింటి నుంచి చెత్త సేకరణ జరగాలి.. డంపింగ్ యార్డులకు తరలించిన అనంతరం తడి చెత్త నుంచి కంపోస్టు ఎరువు తయారీకి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి జూపల్లి హరిప్రసాద్ తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో పర్యటించి, పరిస్థితులు పూర్తిగా అవగాహన చేసుకోవాల్సి ఉందన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో జూన్ 3 నుంచి చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిపారు. డీపీవోగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ఆయనతో ‘న్యూస్టుడే’ ముఖాముఖి నిర్వహించింది. వివరాలు ఇలా...
డంపింగ్ యార్డులు, సెగ్రిగేషన్ షెడ్స్, శ్మశాన వాటికల వినియోగం ఎలా ఉంది?
జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డులు, సెగ్రిగేషన్ షెడ్స్, శ్మశాన వాటికల నిర్మాణం పూర్తయింది. ఇళ్లలో సేకరించిన చెత్తను ట్రాక్టర్లతో డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. అక్కడ తడి, పొడి చెత్త వేరు చేసి తడి చెత్తతో కంపోస్ట్ ఎరువు తయారు చేస్తున్నారు. శ్మశాన వాటికలను అందరూ వినియోగించుకునేలా అవగాహన కల్పించాల్సి ఉంది.
గ్రామీణ క్రీడా ప్రాంగణాల ఎంపిక, నిర్వహణ ఎలా ఉంది?
ప్రతి గ్రామ పంచాయతీలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అనువైన స్థలాలను రెవెన్యూ అధికారులు పరిశీలించి, ఎంపిక చేసి గ్రామ పంచాయతీకి అప్పగిస్తారు. క్రీడా ప్రాంగణం అభివృద్ధికి ప్రభుత్వం రూ.50 వేలు ఇస్తుంది. క్రీడా ప్రాంగణం చదును చేయటం, వాలీబాల్, క్రికెట్ కిట్స్ కొనుగోలు చేసి అందుబాటులో ఉంచుతారు. ఇతర గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తారు.
గ్రామ పంచాయతీ కార్యదర్శులు డీఎస్ఆర్ అమలు ఎలా ఉంది?
ప్రతి పంచాయతీ కార్యదర్శి ఉదయం 7 గంటలకు యాప్లో లాగ్ఇన్ అవ్వాలి. యాప్లో సూచించిన రెండు రోడ్లు, రెండు డ్రెయిన్లు శుభ్రం చేయించి, ఫొటోలు 8 గంటల వరకు డీఎస్ఆర్ యాప్లో అప్లోడ్ చేయాలి. ఈ ప్రక్రియ అంతా హైదరాబాద్ నుంచి పర్యవేక్షిస్తారు.
వర్షాకాలం వస్తుంది కదా.. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
డీపీవో: ట్రాక్టర్ ట్రక్కు మధ్యలో రేకు అడ్డుగా ఉంచి రెండు భాగాలుగా చేసి తడి, పొడి చెత్త సేకరించాలి. ఇంటి యజమానులు సైతం తడి, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలి.ఈ మేరకు గ్రామాల్లో గృహిణులకు అవగాహన కార్యక్రమాలు చేపడతాం. డ్రైయిన్లలో పూడిక తొలగించటం, అంతర్గత రహదారులపై గోతులు పూడ్చటం, చెత్త, పిచ్చి చెట్లు తొలగించాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించాం.
కొందరు సర్పంచులు, కార్యదర్శులు ట్రాక్టర్లను సొంత పనులకు ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి కదా..?
డీపీవో: గ్రామ పంచాయతీ ట్రాక్టర్లను దుర్వినియోగం చేసినట్లు రుజువైతే చర్యలు తీసుకుంటాం. ట్రాక్టర్లు, ట్రక్కుల, ట్యాంకర్లు వినియోగంపై గ్రామ పంచాయతీ కార్యదర్శులు పూర్తి బాధ్యత వహిస్తారు.
పన్నుల వసూలు ఎలా ఉంది?
* 2021-22 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో రూ.20.48 కోటకు గాను రూ.19.52 కోట్లు పన్నులు వసూలు చేశాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాటి చెట్టు పైనుంచి పడి కల్లుగీత కార్మికుడి మృతి
[ 19-04-2024]
ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
జగాలను ఏలిన రామయ్యకు పట్టాభిషేకం
[ 19-04-2024]
ధర్మమే ఆకారం దాల్చిన రామావతారుడు భద్రగిరిలో కొలువై ఉండగా తక్కువేమి మనకు అంటూ కోలాటాలు ఆడారు. -
తొలిరోజు ఖమ్మంలో ఒకటే నామినేషన్
[ 19-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో తొలిరోజు గురువారం ఒక నామపత్రం దాఖలైంది. అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఆదార్) పార్టీ తరఫున ముదిగొండ మండలం గంధసిరికి చెందిన కుక్కల నాగయ్య ఒక సెట్ నామపత్రాలను ఆర్ఓ గౌతమ్కు అందజేశారు -
ఏ పత్రం.. ఏం చెబుతుందంటే..?
[ 19-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రకటన గురువారం వెలువడింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫాం-1 ద్వారా ఆయా స్థానాల్లో నోటీసు జారీ చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లను గురువారం నుంచే స్వీకరిస్తున్నారు. -
అడుగంటిన జలం.. అపర భగీరథ ప్రయత్నం
[ 19-04-2024]
అడుగంటిన భూగర్భజలాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో కొందరు రైతులు పామాయిల్ సాగు చేశారు. -
18లో మేలుకొలుపు ప్రజాస్వామ్య గెలుపు
[ 19-04-2024]
ప్రజాస్వామ్య ఎన్నికల్లో యువ ఓటర్ల చైతన్యమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం వినూత్న ప్రయోగాలు చేస్తోంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కొత్తగా చేపట్టే కార్యక్రమం.. ‘టర్నింగ్-18’. అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నిక ప్రక్రియలో ఏ ఒక్కఓటరూ వెనకబడకుండా చూడటమే అంతిమ లక్ష్యం. -
బేతుపల్లి అంకమ్మతల్లి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి
[ 19-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బేతుపల్లి అంకమ్మ తల్లి తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మవారిని ఊరేగించే రథాలను సిద్ధం చేశారు. -
ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
[ 19-04-2024]
జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో క్రోధి నామ సంవత్సర వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. స్వామి వారికి ప్రాతఃకాల అర్చనల అనంతరం యజ్ఞశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు -
సోనియా రుణం తీర్చుకోవాలి: మంత్రి తుమ్మల
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ అగ్రనేత సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు -
గుళికల మందు మింగి బలవన్మరణం
[ 19-04-2024]
గుళికల మందు మింగి ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ నాగేశ్వరరావు కథనం ప్రకారం.. అశ్వారావవుపేట కోతమిషన్ బజారులో కూలీ పనులు చేస్తూ జీవించే బమ్మిడి సాంబయ్య(62)కు పదిహేనేళ్ల కిందట కడుపు పైభాగంలో కణితి ఏర్పడింది -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
[ 19-04-2024]
రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన జూలూరుపాడు మండలం సాయిరాంతండా వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది
తాజా వార్తలు (Latest News)
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్