దళితుల అభ్యున్నతికి భాగ్యరెడ్డి వర్మ ఎనలేని కృషి: కలెక్టర్
దళితుల అభ్యున్నతికి భాగ్యరెడ్డి వర్మ ఎనలేని కృషిచేశారని కలెక్టర్ డి.అనుదీప్ అన్నారు. ఆయన సంస్కరణాభిలాష నేటి సమాజానికి దిక్సూచిగా నిలుస్తుందని కొనియాడారు. భాగ్యరెడ్డివర్మ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ నివాళులర్పించారు.
భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాల వేస్తున్న కలెక్టర్ డి.అనుదీప్
కొత్తగూడెం పట్టణం, న్యూస్టుడే: దళితుల అభ్యున్నతికి భాగ్యరెడ్డి వర్మ ఎనలేని కృషిచేశారని కలెక్టర్ డి.అనుదీప్ అన్నారు. ఆయన సంస్కరణాభిలాష నేటి సమాజానికి దిక్సూచిగా నిలుస్తుందని కొనియాడారు. భాగ్యరెడ్డివర్మ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ అణగారిన వర్గాల ఉన్నతికి విద్యాభివృద్ధే మార్గమని భాగ్యరెడ్డి బస్తీల్లో రాత్రి పాఠశాలలు ప్రారంభించారన్నారు. హైదరాబాద్ ఇసామియా బజార్లో 1910లోనే దళిత బాలికలకు తెలుగు మాధ్యమ పాఠశాల ప్రారంభించినట్లు చెప్పారు. సాంఘిక దురాచారాలపై ప్రజా చైతన్యానికి కృషిచేశారన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ అభివృద్ధి అధికారి అనసూర్య, మైనారిటీ సంక్షేమ అధికారి సంజీవరావు, భూగర్భ జలవనరుల శాఖ అధికారి బాలు, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ రవి శంకర్, కలెక్టరేట్ ఏఓ గన్యా, సహాయ సాంఘిక సంక్షేమ అధికారి వెంకటేశ్వర్లు, శివభాస్కర్ పాల్గొన్నారు.
ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి
‘పది’ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడిని లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని కలెక్టర్ డి.అనుదీప్ సూచించారు. ఉజ్వల భవిష్యత్తు కోసం మంచి గ్రేడ్తో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. సోమవారం నుంచి ప్రారంభంకానున్న పరీక్షలను ఆందోళనతో కాకుండా ఆత్మవిశ్వాసంతో రాయాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అన్ని జాగ్రత్తలు పాటించాలన్నారు. చూచిరాతలకు పాల్పడి జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టుకోవద్దని, తల్లిదండ్రులు సైతం తెలియజెప్పాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివిధ అనుమతులకు సువిధ
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానానికి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే అనేక యాప్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
భాజపాను ఆశీర్వదించండి
[ 20-04-2024]
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన భాజపాను ఖమ్మం ప్రజలు లోక్సభ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ కోరారు. -
వర్షాకాలం రాకముందే పనులు ప్రారంభించాలి: మంత్రి తుమ్మల
[ 20-04-2024]
వర్షాకాలం సమీపించకముందే మున్నేరు కేబుల్ వంతెన సీసీ పనులు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. -
ఖమ్మం మార్కెట్కు మరింత ఆదాయం
[ 20-04-2024]
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు రూ.2,761 కోట్ల పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరిగాయి. -
భారాసకు మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ రాజీనామా
[ 20-04-2024]
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ శుక్రవారం ప్రకటించారు. 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన తాను కేవలం అభివృద్ధి కోసం షరతులు లేకుండా భారాసలో చేరానన్నారు. -
రైతుల ఆదాయం రెట్టింపునకు కృషి
[ 20-04-2024]
రైతుల ఆదాయం రెట్టింపయినప్పుడే వారి శ్రమకు ప్రతిఫలం దక్కినట్లని తెలంగాణ ఆయిల్ఫెడ్ ఎండీ కె.అశోక్రెడ్డి అన్నారు. -
ప్రచారం హద్దు మీరితే.. శ్రీముఖం తధ్యం!
[ 20-04-2024]
ప్రస్తుతం ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలో ప్రచారం జోరందుకుంది. నాలుగో దశలో జరగనున్న పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 18వ తేదీనే నామినేషన్ ప్రక్రియ మొదలైంది. -
వేగంగా ఉద్యోగాల్లో స్థిరపడే పాలిటెక్నిక్
[ 20-04-2024]
సాంకేతిక విద్య అభ్యసించే వారికి సాధారణ కోర్సుల వారితో పోల్చితే ఉద్యోగావకాశాలు, జీతభత్యాలు ఎక్కువ. ప్రస్తుతం నిరుద్యోగిత ప్రబలుతున్న నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కోర్సుల ఎంపికపై శ్రద్ధ పెరిగింది. -
లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడి మృతి
[ 20-04-2024]
ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన ఘటన ఖమ్మం ఎన్టీఆర్ కూడలిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... -
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోరిక బలరాంనాయక్ నామపత్రం దాఖలు చేసిన సందర్భంగా ఎన్టీఆర్ -
ఇక లెక్కలే.. మిగిలాయి..!
[ 20-04-2024]
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన కల్యాణ బ్రహ్మోత్సవాలు 23 వరకు కొనసాగనున్నప్పటికీ ప్రధాన వేడుక పూర్తి కావడంతో ఆదాయ వ్యయాల పరిశీలనపై అధికారులు దృష్టి సారించారు. -
సీతారాములకు ఘనంగా మహదాశీర్వచనం
[ 20-04-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో కల్యాణం అనంతరం పట్టాభిషేకాన్ని తిలకించిన భక్తులకు శుక్రవారం సదస్యం పేరిట మరో ఉత్సవం వీక్షించే భాగ్యం దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి