ఈకేవైసీ పూర్తిచేస్తేనే ఖాతాల్లోకి నగదు
‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం కింద రూ.6 వేల సాయం ఖాతాల్లో జమ కావాలంటే రైతులతో ‘ఈకేవైసీ (ఎలక్ట్రానిక్-నో యువర్ కస్టమర్) ప్రక్రియ పూర్తిచేయించాలని అధికారులకు ఆదేశాలందాయి.
‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం కింద రూ.6 వేల సాయం ఖాతాల్లో జమ కావాలంటే రైతులతో ‘ఈకేవైసీ (ఎలక్ట్రానిక్-నో యువర్ కస్టమర్) ప్రక్రియ పూర్తిచేయించాలని అధికారులకు ఆదేశాలందాయి. కొంతమంది లబ్ధిదారులు ఆధార్ లింక్ చేసినా బ్యాంకు ఖాతా వివరాలకు చరవాణి నంబర్లు అనుసంధానం చేయించలేదు. మరణించిన వారి వివరాలూ జిల్లాస్థాయి అధికారులు పరిశీలించి తొలగించలేదు. ఈ సమస్యలతో అనర్హులకు సైతం నిధులు జమవుతున్నాయి. దీనికి చెక్ పెట్టేందుకు ‘ఈకేవైసీ’ తప్పనిసరి చేశారు. ‘పీఎం కిసాన్ పోర్టల్’, ‘పీఎం కిసాన్ యాప్’లలో నేరుగా లబ్ధిదారులే నేరుగా స్మార్ట్ఫోన్లలో ఓటీపీ సాయంతో వివరాలు పొందుపరిచే అవకాశం ఉంది. ఈ వెసులుబాటు లేనివారు సీఎస్సీ(కామన్ సర్వీస్ సెంటర్), మీ సేవా కేంద్రాల్లో బయోమెట్రిక్ ద్వారా అనుసంధానం చేసుకోవచ్ఛు ఇందుకోసం గడువు ఈ నెల 31 వరకు ఉన్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ పేర్కొంది.
స్పందించిన వారు 12 వేల మందే..
జిల్లాలోని 22 మండలాల్లో ఆధార్ అనుసంధానం కలిగి ఉన్న పథకం లబ్ధిదారులు 69,095 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 12,193 మంది మాత్రమే ఈకేవైసీ ప్రక్రియ పూర్తిచేసుకున్నారు. ఇంకా ఈ ప్రక్రియను పూర్తిచేయాల్సిన వారు 56,902 మంది ఉన్నారు. తాజా నిబంధనపై ఏజెన్సీ, పల్లెల్లోని పేద రైతులకు పెద్దగా అవగాహన లేదు. ఇప్పటి వరకు ఈకేవైసీ చేయించిన వారిలో సుమారు 7 వేల మంది సీఎస్సీ, మీ సేవా కేంద్రాలపైనే ఆధారపడ్డారు. మిగిలిన వారూ గడువులోగా స్పందించకపోతే ఏటా కేంద్రం 3 విడతల్లో అందజేసే రూ.6 వేల సాయం దక్కకుండా పోతుంది.
చరవాణిలో పూర్తిచేస్తే..
‘పీఎం కిసాన్’ వెబ్పోర్టల్లో సొంతంగా వివరాలు నమోదు చేయదలచిన వారు ముఖ్య విషయాన్ని గమనించాలి. వెబ్సైట్ తెరిచిన తర్వాత ‘ఫార్మర్ కార్నర్’లో సూచించిన ‘ఈ-కేవైసీ’ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఆధార్, ఫోన్ నంబరుకు వచ్చిన ఓటీపీ (వన్టైం పాస్వర్డ్) నమోదు చేసిన తర్వాత ‘ఈకేవైసీ సక్సెస్’ అని రావాలి. లేదంటే ప్రక్రియ పూర్తికానట్లు భావించాలి. ఆధార్, ఫోన్ నంబరు లింక్ చేయించని వారు సమీప సీఎస్సీ కేంద్రాల్లో బయోమెట్రిక్ ద్వారా నమోదు చేయించుకోవచ్ఛు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సార్వత్రిక సమరం.. సిబ్బంది సిద్ధం..!
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై ఈసీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఓటరు నమోదు నుంచి అభ్యర్థుల నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ వరకు ప్రతి ఘట్టంలో అధికారులు, ఎన్నికల సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తారు. -
దండుకున్నారు.. తిప్పించుకుంటున్నారు..!
[ 29-03-2024]
కొత్తగూడెం నియోజకవర్గంలో ‘దళితబంధు’ పేరిట భారీగా వసూళ్ల పర్వం సాగింది. ఒక్కొక్కరి నుంచి ఏకంగా రూ.3 లక్షలు దండుకున్నారు. ఈవ్యవహారంలో అప్పటి ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు, పురపాలికలోని కొంతమంది ప్రజాప్రతినిధులు కీలకంగా వ్యవహరించారు. -
అసైన్డ్ భూముల్లో కట్టడాల కూల్చివేత
[ 29-03-2024]
ఖమ్మం నగరంలోని 8వ డివిజన్ వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలో అసైన్డ్ భూముల్లో అసలు యజమానులు కాకుండా కొనుగోలు చేసినవారు చేపట్టిన నిర్మాణాలను రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు గురువారం కూల్చివేశారు. -
పిండం దశలోనే పిసికేస్తున్నారు!
[ 29-03-2024]
ఆరోగ్య సమస్యలకు చికిత్స అందిస్తామని అనుమతులు తీసుకున్న ఆస్పత్రిలో గర్భవిచ్ఛిత్తికి పాల్పడుతున్నారు. ధనార్జన కోసం అనైతిక వైద్యం చేస్తూ పిండ దశలోనే ప్రాణాలు తీసేస్తున్నారు. -
అటు సాధన.. ఇటు శోధన
[ 29-03-2024]
రూ.15వేల రుణం కోసం ఆశపడిన ఐదుగురు మహిళలు, తెలియకుండానే తమ ఖాతాల ద్వారా రూ.కోట్ల లావాదేవీలు నడిపారు. నమ్మించిన యువకుడు ఒక బ్యాంకు ఖాతా పేరు చెప్పి, మరో బ్యాంకు ఖాతా తెరచి మోసగించాడని ఆలస్యంగా గ్రహించారు. -
‘సైబర్’ దోపిడీ సొమ్ము.. అమాయకుల ఖాతాలకు!
[ 29-03-2024]
సైబర్ నేరస్థులు అమాయకుల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారని, వాటి సాయంతో లూటీ సొమ్మును వాడుకుంటున్నారని ఎస్పీ బి.రోహిత్రాజు గురువారం తెలిపారు. -
ఎండల గండాలకు జాగ్రత్తలే గొడుగు
[ 29-03-2024]
మార్చి నెలలోనే ఎండలు ముదిరాయి. వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని సింగరేణి, పలు పరిశ్రమల ప్రభావిత ప్రాంతాల్లో వేడి ఇంకొంచెం ఎక్కువగా ఉంటోంది. -
అప్పుల బాధతో యువరైతు బలవన్మరణం
[ 29-03-2024]
పంటల దిగుబడి సరిగా రాలేదన్న మనస్తాపంతో ఓ యువరైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకుపాల్పడ్డాడు. పాల్వంచ గ్రామీణ ఎస్సై బి.శ్రీనివాస్ కథనం ప్రకారం.. మండలంలోని యానంబైలు గ్రామానికి చెందిన మంత్రి శశికుమార్ (26) నాలుగెకరాల్లో పత్తి, అయిదు ఎకరాల్లో వరి సాగు చేశాడు. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగుపయనమయ్యారు. -
మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, కొరియర్ అరెస్టు
[ 29-03-2024]
నిషేధిత సీపీఐ మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ బి.రోహిత్రాజు తెలిపారు. గురువారం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. -
9 నుంచి శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు
[ 29-03-2024]
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 9 నుంచి 23 వరకు జరిగే శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేపట్టాలని ఆర్డీఓ దామోదర్రావు ఆదేశించారు. రామాలయం ఈఓ రమాదేవితో కలిసి తన కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు
-
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ