సత్తుపల్లికి త్వరలో రైలు కూత
రైలు మార్గం ద్వారా సత్తుపల్లిలోని ఉపరితల గనుల నుంచి బొగ్గు రవాణా చేసేందుకు సర్వం సిద్ధమైంది. ఇక నుంచి రైలు మార్గం ద్వారా దేశ నలుమూలలకు సత్తుపల్లి బొగ్గు తరలిపోనుంది. ఏడాదికి 10 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా సాధించే క్రమంలో పర్యావరణం దెబ్బతినకుండా మేలు జరిగేలా,
ఏడాదికి 10 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా లక్ష్యం
రైలు మార్గం ద్వారా సత్తుపల్లిలోని ఉపరితల గనుల నుంచి బొగ్గు రవాణా చేసేందుకు సర్వం సిద్ధమైంది. ఇక నుంచి రైలు మార్గం ద్వారా దేశ నలుమూలలకు సత్తుపల్లి బొగ్గు తరలిపోనుంది. ఏడాదికి 10 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా సాధించే క్రమంలో పర్యావరణం దెబ్బతినకుండా మేలు జరిగేలా, రోడ్డు ప్రమాదాలను అరికట్టేలా భద్రాచలం రోడ్డు నుంచి సత్తుపల్లి జేవీఆర్ ఓసీకి చేపట్టిన రైలు మార్గం ఎట్టకేలకు పూర్తయ్యింది.
జేవీఆర్, కిష్టారం ఓసీల నుంచి నాణ్యమైన బొగ్గు తరలించేందుకు ఇప్పటికే దాదాపు రూ.400కోట్లతో అత్యాధునిక పద్ధతిలో నిర్మించిన కోల్ హ్యాడ్లింగ్ ప్లాంట్(సీహెచ్పీ) సైతం పూర్తికాగా.. మరో వైపు రూ.1000 కోట్లతో చేపట్టిన రైల్వే లైను పనుల్ని, మరో రూ.200 కోట్లతో చేపట్టిన రైల్వే సైడింగ్ పనులను అధికారులు పూర్తి చేశారు. రెండు, మూడు రోజుల్లో రైలు మార్గంలో బొగ్గు రవాణా చేసే ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
* ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులతోపాటు సింగరేణి డైరెక్టర్లు, జీఎం, ఇతర అధికారులు రైలు ఇంజన్తో ట్రైల్రన్ వేశారు. సత్తుపల్లిలోని బొగ్గు గనులు యావత్ సింగరేణికే మణిహారంగా నిలవనున్నాయి. సత్తుపల్లి పరిసర ప్రాంతంలో మరో 30 నుంచి 40 ఏళ్లపాటు బొగ్గు వెలికి తీసే అవకాశం ఉండటంతో ఆ దిశగా అధికార యంత్రాంగం ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.
* ఇప్పటికే సత్తుపల్లి ఓసీ-1 పూర్తి కాగా ఓసీ-2లో 237 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలు తీయనుంది. ఓసీ-2లో ఇప్పటి వరకు 8 మిలియన్ టన్నుల బొగ్గును వెలికితీయగా మరో 229 టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. అదేవిధంగా కిష్టారం ఓసీలో మొత్తం 21.61 మిలియన్ టన్నుల బొగ్గు తీయాల్సి ఉండగా ఇప్పటి వరకు 3.70 మిలియన్ టన్నులు తీశారు. మరో 17.91 మిలియన్ టన్నుల బొగ్గును తీసేందుకు అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.్చ
రోజుకు 30వేల టన్నుల తరలింపు
సత్తుపల్లి నుంచి రోజుకు 30వేల టన్నుల బొగ్గు రవాణా చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జేవీఆర్ ఓసీ-2లో రోజుకు 30వేల టన్నులను మూడు షిప్టుల్లో వెలికి తీస్తుండగా కిష్టారం ఓసీలోనూ మరో 7 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోంది. దీంతో రోజుకు సీహెచ్పీ ద్వారా 30వేల టన్నులను రైలు వ్యాగన్ల ద్వారా తరలించేందుకు సింగరేణి అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. అంతేగాకుండా ప్రైవేటు లారీలకూ మార్కెట్ను బట్టి బొగ్గు లోడింగ్ ఇచ్చే అంశాలపై సింగరేణి అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తగ్గనున్న రోడ్డు ప్రమాదాలు..
రైలు మార్గం పూర్తయిన నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం సత్తుపల్లి నుంచి కొత్తగూడెంకు కంపెనీ టిప్పర్లతోపాటు ప్రైవేటు లారీలు, టిప్పర్ల ద్వారానూ బొగ్గును తరలిస్తున్నారు. బొగ్గు లారీలు, టిప్పర్లు రోజుకు 600 వరకు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు 16 ఏళ్లుగా అనేక రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని పలువురు మృత్యువాత పడ్డారు. రైలు మార్గం ద్వారా బొగ్గు రవాణా ఆరంభమైతే ఈ ప్రమాదాలు తగ్గుతాయని పలువురు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివిధ అనుమతులకు సువిధ
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానానికి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే అనేక యాప్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
భాజపాను ఆశీర్వదించండి
[ 20-04-2024]
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన భాజపాను ఖమ్మం ప్రజలు లోక్సభ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ కోరారు. -
వర్షాకాలం రాకముందే పనులు ప్రారంభించాలి: మంత్రి తుమ్మల
[ 20-04-2024]
వర్షాకాలం సమీపించకముందే మున్నేరు కేబుల్ వంతెన సీసీ పనులు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. -
ఖమ్మం మార్కెట్కు మరింత ఆదాయం
[ 20-04-2024]
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు రూ.2,761 కోట్ల పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరిగాయి. -
భారాసకు మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ రాజీనామా
[ 20-04-2024]
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ శుక్రవారం ప్రకటించారు. 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన తాను కేవలం అభివృద్ధి కోసం షరతులు లేకుండా భారాసలో చేరానన్నారు. -
రైతుల ఆదాయం రెట్టింపునకు కృషి
[ 20-04-2024]
రైతుల ఆదాయం రెట్టింపయినప్పుడే వారి శ్రమకు ప్రతిఫలం దక్కినట్లని తెలంగాణ ఆయిల్ఫెడ్ ఎండీ కె.అశోక్రెడ్డి అన్నారు. -
ప్రచారం హద్దు మీరితే.. శ్రీముఖం తధ్యం!
[ 20-04-2024]
ప్రస్తుతం ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలో ప్రచారం జోరందుకుంది. నాలుగో దశలో జరగనున్న పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 18వ తేదీనే నామినేషన్ ప్రక్రియ మొదలైంది. -
వేగంగా ఉద్యోగాల్లో స్థిరపడే పాలిటెక్నిక్
[ 20-04-2024]
సాంకేతిక విద్య అభ్యసించే వారికి సాధారణ కోర్సుల వారితో పోల్చితే ఉద్యోగావకాశాలు, జీతభత్యాలు ఎక్కువ. ప్రస్తుతం నిరుద్యోగిత ప్రబలుతున్న నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కోర్సుల ఎంపికపై శ్రద్ధ పెరిగింది. -
లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడి మృతి
[ 20-04-2024]
ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన ఘటన ఖమ్మం ఎన్టీఆర్ కూడలిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... -
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోరిక బలరాంనాయక్ నామపత్రం దాఖలు చేసిన సందర్భంగా ఎన్టీఆర్ -
ఇక లెక్కలే.. మిగిలాయి..!
[ 20-04-2024]
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన కల్యాణ బ్రహ్మోత్సవాలు 23 వరకు కొనసాగనున్నప్పటికీ ప్రధాన వేడుక పూర్తి కావడంతో ఆదాయ వ్యయాల పరిశీలనపై అధికారులు దృష్టి సారించారు. -
సీతారాములకు ఘనంగా మహదాశీర్వచనం
[ 20-04-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో కల్యాణం అనంతరం పట్టాభిషేకాన్ని తిలకించిన భక్తులకు శుక్రవారం సదస్యం పేరిట మరో ఉత్సవం వీక్షించే భాగ్యం దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం