విద్యార్థుల ప్రయాణ భత్యం హూలుకేనా?
ప్రభుత్వ పాఠశాలల పిల్లలందరూ క్రమం తప్పకుండా తరగతులకు హాజరయ్యేలా చూసేందుకు ప్రభుత్వం రవాణా భత్యం చెల్లిస్తోంది. ఈ ‘రవాణా భత్యం’ పథకం గ్రామీణ ప్రాంతం విద్యార్థులకు ఎంతో ఊరటనిస్తుంది. రవాణా ఛార్జీల్లేని కారణంగా బడులకు గైర్హాజరయ్యే శాతాన్ని గణనీయంగా
1,125 మందికి..రూ.20 లక్షల చెల్లింపుల్లో జాప్యం
పాల్వంచ విద్యావిభాగం, న్యూస్టుడే
కొత్తగూడెం ఓ పాఠశాలకు ఆర్టీసీ బస్సు ద్వారా చేరుకుంటున్న విద్యార్థులు
ప్రభుత్వ పాఠశాలల పిల్లలందరూ క్రమం తప్పకుండా తరగతులకు హాజరయ్యేలా చూసేందుకు ప్రభుత్వం రవాణా భత్యం చెల్లిస్తోంది. ఈ ‘రవాణా భత్యం’ పథకం గ్రామీణ ప్రాంతం విద్యార్థులకు ఎంతో ఊరటనిస్తుంది. రవాణా ఛార్జీల్లేని కారణంగా బడులకు గైర్హాజరయ్యే శాతాన్ని గణనీయంగా తగ్గించే పథకం ఇది. దీన్ని ఉపయోగించుకుని దూర ప్రాంత పిల్లలు చాలా మంది ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో ఉదయాన్నే తరగతులకు తరలివస్తుంటారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ‘2021-22’ విద్యా సంవత్సరం నుంచి రవాణా భత్యం చెల్లించకపోవడం పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తోంది. మూడు నెలల చొప్పున నేరుగా విద్యార్థుల ఖాతాలోకి జమ చేయాల్సి ఉండగా... ఆ దిశగా విద్యాశాఖ చొరవ చూపించలేదు.
జిల్లాలో ఏదీ పరిస్థితి
జిల్లావ్యాప్తంగా ప్రాథమిక స్థాయిలో 319, ప్రాథమికోన్నత స్థాయిలో 425, ఉన్నత పాఠశాలలకు 381 మంది విద్యార్థులు దూరప్రాంతాల నుంచి విద్యాలయాలకు చేరుకుంటున్నారు. వారికి ఒక్కొక్కరికి నెలకు చొప్పున రూ.600 చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన ప్రస్తుత విద్యా సంవత్సరం 1,125 మందికి రూ.20,25,000 మంజూరు కావాలి. మూణ్నెల్లకోసారి భత్యం ఠంఛనుగా ఇస్తేనే రవాణా కష్టాలు తప్పుతాయి. ప్రస్తుతం విద్యా సంవత్సరం ముగిసినా ఇంకా జాప్యం చేస్తుండటం గమనార్హం. ప్రాథమిక స్థాయిలో కిలో మీటరు దూరం, ప్రాథమికోన్నత స్థాయిలో 3 కి.మీ. ఆపైన, ఉన్నత పాఠశాల వారైతే 5 కిలో మీటర్ల దూరం నుంచి వస్తే ఈ పథకం వర్తిస్తుంది. ‘2022-23’ విద్యా సంవత్సరానికి ప్రాథమిక స్థాయిలో 575, ప్రాథమికోన్నత 961, ఉన్నత పాఠశాలలో 260 కలిపి మొత్తం 1,796 మంది భత్యం పొందేందుకు అర్హులని జిల్లా విద్యా శాఖాధికారులు హైదరాబాద్లోని ఉన్నతాధికారులకు ఇప్పటికే నివేదిక పంపించారు.
* ‘విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిధుల మంజూరు కోరుతూ ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదిక పంపాం. రానున్న విద్యా సంవత్సరం ప్రతిపాదనలు సైతం ముందస్తుగా ఇప్పటికే గుర్తించాం. నిధులు మంజూరవగానే నేరుగా విద్యార్థుల ఖాతాలో జమచేస్తాం’.
- సతీశ్కుమార్, ఏఎస్వో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!