పెళ్లి ట్రాక్టరు బోల్తా.. మహిళ దుర్మరణం
బంధువులంతా కలిసి ట్రాక్టరులో పెళ్లి వేడుకకు వెళ్తుండగా వాహనం బోల్తా పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. ప్రమాదం నుంచి నవ వధువు స్వల్పగాయాలతో బయటపడగా ఓ మహిళ మృతిచెందారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. పాల్వంచ మండలం మందరికలపాడుకు చెందిన మడవి
పాల్వంచ గ్రామీణం, న్యూస్టుడే
పాయికే మృతదేహం
బంధువులంతా కలిసి ట్రాక్టరులో పెళ్లి వేడుకకు వెళ్తుండగా వాహనం బోల్తా పడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. ప్రమాదం నుంచి నవ వధువు స్వల్పగాయాలతో బయటపడగా ఓ మహిళ మృతిచెందారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. పాల్వంచ మండలం మందరికలపాడుకు చెందిన మడవి అందయ్య, జోగమ్మల కుమార్తె బండికి బూర్గంపాడు మండలం టేకులచెరువుకు చెందిన ఊరయ్యతో వివాహం కుదిరింది. సోమవారం సాయంత్రం ముహూర్తం ఉండటంతో నవ వధువు సహా మొత్తం 46 మంది బంధువులు మధ్యాహ్నం ట్రాక్టరులో బయల్దేరారు. నాలుగు కి.మీ. దూరం వెళ్లగానే మొండికట్ట గ్రామం వద్ద మలుపులో ట్రాక్టరు అదుపు తప్పి బోల్తాపడింది. కొందరు ప్రమాదాన్ని ఊహించి కిందకు దూకేశారు. ట్రక్కు బోల్తాపడటంతో వధువు బంధువు, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్జిల్లా ధర్మారం (పామేడు) గిరిజన గూడేనికి చెందిన సోడి పాయికే(30) అక్కడికక్కడే మృతిచెందింది. మడివి సురేశ్(12), రమేశ్(35), శివాజీ(10)తో పాటు నందయ్య(30), మడవి కుమారి(10) తీవ్రంగా గాయపడ్డారు. వీరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం తరలించారు. మిగిలిన వారికి పాల్వంచ ఏరియా ఆసుపత్రిలో వైద్యం చేయిస్తున్నారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలున్నారు. డ్రైవర్ అందారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదంతో వివాహం ఆగిపోయింది.
హాహాకారాలు..
ప్రమాదంలో చిన్నారులు, పెద్దలు సహా ట్రాక్టరులో వెళ్లిన ప్రతిఒక్కరూ గాయాలపావగా.. సుమారు పది మందికి కాళ్లు, చేతుల్లో ఏదో ఒకటి విరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారిని వెంటనే ‘108’ సిబ్బంది పాల్వంచకు, అక్కడ్నుంచి ఖమ్మంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఆరుగురికి తలకు, మరో 20 మంది కాళ్లు, చేతులకు గాయాలై హాహాకారాలు చేశారు. గాయపడ్డవారిలో 14 మంది 15 ఏళ్లలోపు బాలలున్నారు. సురేశ్(12), శివాజీ(10) అనే చిన్నారుల పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం తరలించినట్లు బంధువులు తెలిపారు. పాల్వంచ ఆసుపత్రిలో చేరిన 36 మంది క్షతగాత్రులలో.. రాజా, అయితీ, లక్ష్మయ్య, ఎం.లక్ష్మయ్య, చెన్నారావు, దేవి, నందా, ఎం.దేవి, కుమారి, పద్దం దేవి, నందిని, పూజ, జ్యోతి, కుమారి, కుంజాదేవి, మడకం లక్ష్మి, రాకేశ్, జ్యోతి, బీమా తదితరులున్నారు. గాయాలతో బోరున విలపిస్తున్న చిన్నారులను చూసి చూపరులు కంటతడిపెట్టారు. క్షతగాత్రులకు మూడు వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. పాల్వంచ పట్టణం, గ్రామీణం పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది వారితో పాటు బంధువులకు భోజనాలు సమకూర్చి మానవత చాటారు.
తక్షణ సాయం...
మొండికట్టలో పెళ్లి ట్రాక్టర్ బోల్తాపడిందని తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ నాయకుడు ఎడవల్లి కృష్ణ సమీపంలో జరుగుతున్న ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని నిలిపివేసి వెళ్లారు. క్షతగాత్రులను 108తో పాటు తమ ప్రచార వాహనంలో పాల్వంచ ఆస్పత్రికి తరలించారు. సీపీఐ మండల నాయకుడు పూర్ణచందర్రావు క్షతగాత్రులను పరామర్శించారు. కొందరి ఖర్చుల కోసం రూ.5 వేల సాయం తక్షణం అందించారు. వనమా వెంకటేశ్వరరావు కూడా బాధితులను పరామర్శించారు. వైద్యం అందించాలని, భోజనాలు ఏర్పాటు చేయాలని వైద్యులను ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏన్కూరులో హనుమాన్ శోభాయాత్ర
[ 23-04-2024]
ఏన్కూర్లో హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల భక్తులు టీఎల్ పేట రామాలయానికి చేరుకొని అక్కడ నుంచి 10 కి.మీ శోభాయాత్రతో పాటు ద్విచక్ర వాహన ప్రదర్శన నిర్వహించారు. -
భాగ్యనగర్ తండాలో బోనాల వేడుక
[ 23-04-2024]
భాగ్యనగర్ తండాలో బోనాల వేడుకను మంగళవారం వైభవంగా నిర్వహించారు. -
పార్లమెంట్ ఎన్నికల్లో భారాస అత్యధిక స్థానాలు విజయం
[ 23-04-2024]
మహబూబాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత నామినేషన్ కార్యక్రమానికి వెళ్లేందుకు ఇల్లందుకు చేరుకున్న పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారాస నాయకులు దిండిగల రాజేందర్ ఆధ్వర్యంలో స్వాగతం -
ఏది నిజం?.. సోషల్ మీడియాలో సమాచార వ్యాప్తిపై ఈసీఐ సూచనలివీ..
[ 23-04-2024]
ఎన్నికలోస్తే చాలు, సామాజిక మాధ్యమాల్లో కుప్పలుతెప్పలుగా సమాచారం వచ్చిపడుతుంది. వాటిల్లో పుకార్లు ఏవి? తప్పుదోవ పట్టించేవి ఏవి? నిజమైన సమాచారం ఏదో తెలియక ఓటర్లు తికమకపడుతుంటారు. -
బరిలో నిలవాలంటే.. పరిశీలన దశ దాటాల్సిందే!
[ 23-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ)కి అఫిడవిట్లు సమర్పించారు. -
ప్రాదేశిక ఎన్నికలకు రంగం సిద్ధం
[ 23-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన సామగ్రి సమకూర్చుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి పంచాయతీరాజ్ కమిషనర్ సహా జిల్లా పరిషత్లకు సూచనలందాయి. -
రైతులకు అండగా ఉంటాం: నామా
[ 23-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీరికి భారాస అండగా ఉంటుందని ఆపార్టీ ఖమ్మం లోక్సభ స్థానం అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. -
గ్యారంటీలు నమ్మి మోసపోకండి: తాండ్ర
[ 23-04-2024]
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను నమ్మి ఓటర్లు మోసపోవద్దని, దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్న భాజపాను ఆదరించాలని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు పేర్కొన్నారు. -
సెలవులొచ్చాయ్.. ప్రణాళికలు ఖరారయ్యాయ్!
[ 23-04-2024]
ఈవిద్యా సంవత్సరం నేడు (మంగళవారం) ముగియనుంది. పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం బుధవారం నుంచి వేసవి సెలవులు ప్రకటించింది. ఈనేపథ్యంలో ప్రభుత్వ బడుల బలోపేతంపై దృష్టి సారించింది. -
పది మందిలో ఐదుగురు స్థానికేతరులే..
[ 23-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానానికి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా పది మంది గెలిచారు. వీరిలో ఐదుగురు స్థానికేతరులు కావటం విశేషం. -
అకాల వర్షంతో 700 ఎకరాల్లో పంట నష్టం
[ 23-04-2024]
జిల్లాలో ఆదివారం సాయంత్రం వీచిన ఈదురు గాలులతో కొత్తగూడెం, సుజాతనగర్, చుంచుపల్లి ,లక్ష్మీదేవిపల్లి, ఇల్లెందు, టేకులపల్లి, అశ్వారావుపేట, పినపాక, కరకగూడెం మండలాల్లో సుమారు 700 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు డీఏఓ బాబురావు సోమవారం తెలిపారు. -
‘పది’ విద్యార్థులు ఫలితాలపై ఒత్తిడి చెందొద్దు
[ 23-04-2024]
పదో తరగతి పరీక్ష ఫలితాలు ఎలా ఉన్నా విద్యార్థులు మానసిక ఒత్తిళ్లకు గురికావొద్దని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.జేవీఎల్ శిరీష సోమవారం ఒక ప్రకటనలో సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్