logo

అనుమానంతో భార్య దారుణ హత్య

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. హాయిగా సాగుతున్న కాపురంలో అనుమానం పెనుభూతమై చిచ్చురేపింది. దీంతో అత్యంత పాశవికంగా భార్యను అంతమొందించాడో భర్త. పోలీసుల కథనం ప్రకారం.. పాల్వంచ పట్టణ పరిధిలోని పెద్దబంగారుజాలకు చెందిన తాటి బుచ్చిబాబు

Published : 24 May 2022 02:24 IST

పాల్వంచ పట్టణం, న్యూస్‌టుడే: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. హాయిగా సాగుతున్న కాపురంలో అనుమానం పెనుభూతమై చిచ్చురేపింది. దీంతో అత్యంత పాశవికంగా భార్యను అంతమొందించాడో భర్త. పోలీసుల కథనం ప్రకారం.. పాల్వంచ పట్టణ పరిధిలోని పెద్దబంగారుజాలకు చెందిన తాటి బుచ్చిబాబు, మౌనిక(26)కి తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె. కొన్నేళ్లు కాపురం సజావుగా సాగింది. ఆ తర్వాత మౌనికపై అనుమానం పెరిగింది. దీనికి తోడు బుచ్చిబాబుకు మద్యం అలవాటు ఉండటంతో కాపురంలో తరచూ కలహాలు చోటుచేసుకునేవి. తరచూ భార్యను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసేవాడు. అయినా ఆమె పిల్లల కోసం బాధలు భరించేది. ఆదివారం రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చిన బుచ్చిబాబు మౌనికతో గొడవపడి.. ఆ కోపంలో జామాయిల్‌ కర్రతో తల, కాళ్లు, శరీరభాగాలపై విచక్షణారహితంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సోమవారం ఉదయం స్థానికుల సమాచారంతో పాల్వంచ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పాల్వంచ సీఐ సత్యనారాయణ, ఎస్సై ప్రవీణ్‌ ప్రాథమిక సమాచారం సేకరించారు. సీహెచ్‌సీలో శవ పరీక్షల అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలి తండ్రి వెంకటస్వామి ఫిర్యాదు మేరకు ఎస్సై ప్రవీణ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని