అట్టహాసంగా హనుమజ్జయంతి ఉత్సవాలు
భద్రాచలం రామాలయంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న హనుమాన్ జయంతి వేడుకలు సోమవారం అట్టహాసంగా ఆరంభమయ్యాయి. తొలిరోజు ఉదయం సుందరాకాండ పారాయణం భక్తిశ్రద్ధలతో సాగింది. కార్యాలయ ఉద్యోగులకు ఆలయం వద్ద బాధ్యతలను అప్పగించారు
రాముణ్ని దర్శించుకున్న జస్టిస్ సీతారామమూర్తి
భద్రాచలం, న్యూస్టుడే: భద్రాచలం రామాలయంలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న హనుమాన్ జయంతి వేడుకలు సోమవారం అట్టహాసంగా ఆరంభమయ్యాయి. తొలిరోజు ఉదయం సుందరాకాండ పారాయణం భక్తిశ్రద్ధలతో సాగింది. కార్యాలయ ఉద్యోగులకు ఆలయం వద్ద బాధ్యతలను అప్పగించారు. ఇప్పటికే అంజన్న భక్తుల తాకిడి పెరిగింది. కొంతమంది ఇక్కడ ఇరుముళ్లు సమర్పిస్తున్నారు. కొండగట్టులోని ఆంజనేయుడి ఆలయంలో నిర్వహించే ఉత్సవాలకు భద్రాచలం రామాలయం నుంచి పట్టు వస్త్రాలను అధికారికంగా పంపించారు. 25న ఆంజనేయుడి కోవెలలో ప్రత్యేక అభిషేకాలు తమలపాకుల పూజలుంటాయి.
సీతారామ కల్యాణోత్సవం: ప్రధాన ఆలయంలో ముత్యాలతో పొదిగిన వస్త్రాలంకృతులైన శ్రీసీతారాముల దర్శనంతో భక్తుల మది పులకించింది. బేడా మండపం వద్ద క్షేత్ర విశిష్టతను ప్రవచనం చేసిన తీరు మంత్రముగ్ధులను చేసింది. వైష్ణవ సంప్రదాయం ప్రకారం విష్వక్సేనుణ్ని ఆరాధించి పుణ్యాహ వాచనం నిర్వహించి కంకణ ధారణ చేశారు. కన్యాదానం కమనీయమై నిలవగా సీతమ్మకు యోక్త్రధారణ, రామయ్యకు యజ్ఞోపవీత ధారణ అట్టహాసంగా సాగింది. మాంగళ్యధారణతో ప్రతీ మది పులకించింది. దర్బారు సేవను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి రాముణ్ని దర్శించుకోవడంతో సూపరింటెండెంట్ శ్రీనివాస్ సాదరంగా ఆహ్వానం పలికారు. ఈయన వెంట భద్రాచలం జ్యుడీషియల్ మొదటిశ్రేణి మెజిస్ట్రేట్ సురేశ్ ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్లో చేరిన భారాస సొసైటీ డైరెక్టర్
[ 28-03-2024]
భారాసకు చెందిన కారేపల్లి సొసైటీ డైరెక్టర్ డేగల ఉపేందర్ గురువారం కాంగ్రెస్ లో చేరారు. -
కరవు తీరా పని..!
[ 28-03-2024]
కరవు పరిస్థితులతో వ్యవసాయ కూలీ పనులు దొరక్క తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న గ్రామీణులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దన్నుగా నిలుస్తోంది. -
మూడు ప్రైవేట్ ఆసుపత్రుల సీజ్
[ 28-03-2024]
ఖమ్మం నగరంలో మూడు ప్రైవేట్ ఆసుపత్రులను సీజ్ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాలతి తెలిపారు. ఉన్నతాధికారులకు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఖమ్మంలోని వివిధ ఆసుపత్రుల్లో బుధవారం తనిఖీచేశారు. -
‘గాడి’న పడకుంటే.. గత్తర గత్తర
[ 28-03-2024]
అనేక మంది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. కొన్ని మార్గాల్లో యువకులు పోటీలు పడుతూ ద్విచక్ర వాహనాలను అతివేగంతో వంకరటింకరగా నడుపుతున్నారు. -
ఆధ్యాత్మిక కారిడార్ ఏర్పాటుకు కృషి: తాండ్ర
[ 28-03-2024]
అయోధ్య-భద్రాద్రి ఆధ్యాత్మిక కారిడార్ ఏర్పాటుకు కృషి చేస్తామని ఖమ్మం లోక్సభ భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
డ్రాగన్ పండు.. లాభాలు మెండు
[ 28-03-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అనేక మంది ఔత్సాహికులు, విద్యాధికులు, యువ రైతులు సైతం సాగుకు ఆసక్తి చూపుతున్నారు. -
ఆ ఇద్దరు దోచేస్తున్నారు..!
[ 28-03-2024]
‘దేశీ శిక్షణలో భాగంగా అధికారులకు రూ.10వేలు చెల్లించి తరగతులకు హాజరయ్యాను. ఒక్కరోజు గైర్హాజరైతే రూ.3వేలు వసూలు చేశారు. -
ఆక్రమణల చెరలోనే సాగర్ కాల్వలు
[ 28-03-2024]
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ మధిర బ్రాంచి కెనాల్ పరిధిలో ఉన్న ఊటుకూరు, మధిర మేజర్ కాల్వలు కబ్జాకు గురయ్యాయి. -
మద్యం మత్తులో యువకుల హల్చల్
[ 28-03-2024]
చంద్రుగొండలో మద్యం మత్తులో ఐదుగురు యువకులు పలువురిపై దాడిచేసిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. -
నిలబడలేకున్నా.. ఆసరా అందించరూ..
[ 28-03-2024]
నిరుపేద దంపతులు రెక్కల కష్టమ్మీద ముగ్గురు కుమార్తెల్లో ఇద్దరి పెళ్లిళ్లు చేశారు. ఆ కుటుంబాన్ని అనారోగ్య సమస్యలు వెంటాడాయి. -
మద్యం తాగాడని ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుడి నిర్బంధం
[ 28-03-2024]
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు మద్యం తాగి విధులకు హాజరై విద్యార్థులను కొట్టాడని పాఠశాలలో ఉంచి తాళం వేసిన ఘటన చర్ల మండలంలో చోటుచేసుకుంది. -
రామయ్య హుండీలో కాసుల గలగల..!
[ 28-03-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలోని మూడు రకాల హుండీలు కాసులతో కళకళలాడాయి. 26 రోజుల హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. జనరల్ హుండీల ద్వారా రూ.71,22,878 సమకూరింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్