ప్రశాంతంగా పది పరీక్షలు
జిల్లాలో పదో తరగతి పరీక్షలు తొలి రోజు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరిగింది. విద్యార్థులు గంట ముందే తమ కేంద్రాలకు చేరుకున్నారు. నిర్వాహకులు గంట ముందే లోపలకు అనుమతించారు.
పాల్వంచ బొల్లోరిగూడెం పరీక్ష కేంద్రం వద్ద విద్యార్థులు
పాల్వంచ విద్యావిభాగం, న్యూస్టుడే: జిల్లాలో పదో తరగతి పరీక్షలు తొలి రోజు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరిగింది. విద్యార్థులు గంట ముందే తమ కేంద్రాలకు చేరుకున్నారు. నిర్వాహకులు గంట ముందే లోపలకు అనుమతించారు. జిల్లావ్యాప్తంగా 75 కేంద్రాల్లో తెలుగు పరీక్ష మొదలవగా.. ఆయాచోట్ల బందోబస్తు కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. జిల్లాలో 13,334 మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను 13,080 మంది హాజరయ్యారు. 254 మంది గైర్హాజరయ్యారు. కేంద్రాల్లో సరైన సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులుపడ్డారు. పాల్వంచ కిన్నెరసాని గురుకులం ‘సీ’ కేంద్రంలో లోపలకు వెళ్లేందుకు ఎండలోనే నిల్చున్నారు. షామియానాలు కూడా ఏర్పాటు చేయలేదు. పాల్వంచ బొల్లోరిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తాగునీటి బాటిళ్లను అనుమతించక పోవడంపై తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు. నిబంధనల ప్రకారం అనుమతి ఉందన్నారు. పరీక్ష ప్రారంభ సమయానికి పలుచోట్ల తాగునీరు లేక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కొత్తగూడెం మర్వాడీ క్యాంపు ఏరియాలోని ఆనందఖని పాఠశాల కేంద్రంలో హాల్టిక్కెట్ల నంబర్లు చూసుకునేందుకు మురుగు కాలువ పక్కన అవస్థలు పడ్డారు. మణుగూరు మండలంలోని సమితి సింగారం పాఠశాలలో గాలిపంకాలు లేక ఉక్కపోతతో అల్లాడారు.
అధికారుల తనిఖీలు: జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ కొత్తగూడెం, చుంచుపల్లి మండలాల్లోని బాబుక్యాంపు, కోర్టు సమీపంలోని ఉన్నత పాఠశాలలోని పది పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించారు. సీసీకెమెరాల పనితీరును పరిశీలించారు. ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని నిర్వాహకులను ఆదేశించారు. సమయం ముగిసే వరకు విద్యార్థులను బయటకు విడిచిపెట్టొద్దన్నారు. ఆ సమయంలో కలెక్టర్ తన చరవాణిని వెంట తీసుకెళ్లలేదు. డీఈవో సోమశేఖరశర్మ భద్రాచలం, బూర్గంపాడు, ములకలపల్లి మండలాలోని ఆరు పరీక్ష కేంద్రాలను సందర్శించారు. అక్కడి వసతులపై ఆరా తీశారు. అయిదు ఫ్లైయింగ్ స్వ్కాడ్ బృందాలు 28 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే
[ 29-03-2024]
ఖమ్మం జిల్లా ఏన్కూర్లో గుడ్ ఫ్రైడేను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఏన్కూర్లో ఆర్సీఎం చర్చి నుంచి ప్రార్థనలు చేస్తూ సిలువ మార్గంగా టీఎల్ పేట చర్చి వరకు చేరుకున్నారు. -
సార్వత్రిక సమరం.. సిబ్బంది సిద్ధం..!
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై ఈసీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఓటరు నమోదు నుంచి అభ్యర్థుల నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ వరకు ప్రతి ఘట్టంలో అధికారులు, ఎన్నికల సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తారు. -
దండుకున్నారు.. తిప్పించుకుంటున్నారు..!
[ 29-03-2024]
కొత్తగూడెం నియోజకవర్గంలో ‘దళితబంధు’ పేరిట భారీగా వసూళ్ల పర్వం సాగింది. ఒక్కొక్కరి నుంచి ఏకంగా రూ.3 లక్షలు దండుకున్నారు. ఈవ్యవహారంలో అప్పటి ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు, పురపాలికలోని కొంతమంది ప్రజాప్రతినిధులు కీలకంగా వ్యవహరించారు. -
అసైన్డ్ భూముల్లో కట్టడాల కూల్చివేత
[ 29-03-2024]
ఖమ్మం నగరంలోని 8వ డివిజన్ వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలో అసైన్డ్ భూముల్లో అసలు యజమానులు కాకుండా కొనుగోలు చేసినవారు చేపట్టిన నిర్మాణాలను రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు గురువారం కూల్చివేశారు. -
పిండం దశలోనే పిసికేస్తున్నారు!
[ 29-03-2024]
ఆరోగ్య సమస్యలకు చికిత్స అందిస్తామని అనుమతులు తీసుకున్న ఆస్పత్రిలో గర్భవిచ్ఛిత్తికి పాల్పడుతున్నారు. ధనార్జన కోసం అనైతిక వైద్యం చేస్తూ పిండ దశలోనే ప్రాణాలు తీసేస్తున్నారు. -
అటు సాధన.. ఇటు శోధన
[ 29-03-2024]
రూ.15వేల రుణం కోసం ఆశపడిన ఐదుగురు మహిళలు, తెలియకుండానే తమ ఖాతాల ద్వారా రూ.కోట్ల లావాదేవీలు నడిపారు. నమ్మించిన యువకుడు ఒక బ్యాంకు ఖాతా పేరు చెప్పి, మరో బ్యాంకు ఖాతా తెరచి మోసగించాడని ఆలస్యంగా గ్రహించారు. -
‘సైబర్’ దోపిడీ సొమ్ము.. అమాయకుల ఖాతాలకు!
[ 29-03-2024]
సైబర్ నేరస్థులు అమాయకుల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారని, వాటి సాయంతో లూటీ సొమ్మును వాడుకుంటున్నారని ఎస్పీ బి.రోహిత్రాజు గురువారం తెలిపారు. -
ఎండల గండాలకు జాగ్రత్తలే గొడుగు
[ 29-03-2024]
మార్చి నెలలోనే ఎండలు ముదిరాయి. వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని సింగరేణి, పలు పరిశ్రమల ప్రభావిత ప్రాంతాల్లో వేడి ఇంకొంచెం ఎక్కువగా ఉంటోంది. -
అప్పుల బాధతో యువరైతు బలవన్మరణం
[ 29-03-2024]
పంటల దిగుబడి సరిగా రాలేదన్న మనస్తాపంతో ఓ యువరైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకుపాల్పడ్డాడు. పాల్వంచ గ్రామీణ ఎస్సై బి.శ్రీనివాస్ కథనం ప్రకారం.. మండలంలోని యానంబైలు గ్రామానికి చెందిన మంత్రి శశికుమార్ (26) నాలుగెకరాల్లో పత్తి, అయిదు ఎకరాల్లో వరి సాగు చేశాడు. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగుపయనమయ్యారు. -
మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, కొరియర్ అరెస్టు
[ 29-03-2024]
నిషేధిత సీపీఐ మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ బి.రోహిత్రాజు తెలిపారు. గురువారం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. -
9 నుంచి శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు
[ 29-03-2024]
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 9 నుంచి 23 వరకు జరిగే శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేపట్టాలని ఆర్డీఓ దామోదర్రావు ఆదేశించారు. రామాలయం ఈఓ రమాదేవితో కలిసి తన కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
సీ-విజిల్కు తాకిడి.. రెండు వారాల్లోనే 79 వేల ఫిర్యాదులు
-
సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. 42 మంది మృతి
-
లోక్సభ ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
-
బాబాయిని చంపిన వ్యక్తికి ఎంపీ టికెట్.. చెల్లెలుపై కేసులు: చంద్రబాబు
-
ఆ నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డు.. నెట్టింట ఆగ్రహం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM