logo

కేంద్రంలోకి ప్రైవేటు ఉపాధ్యాయులు

మణుగూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రంలో అడుగడుగునా నిర్లక్ష్యం నెలకొంది. ఉదయం 8.30 తర్వాత కేవలం విద్యార్థులను

Published : 24 May 2022 02:24 IST

విద్యార్థులతో పాటు పరీక్ష రాసే గదిలోకి ప్రవేశించిన తల్లిదండ్రులు, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు

మణుగూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: మణుగూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రంలో అడుగడుగునా నిర్లక్ష్యం నెలకొంది. ఉదయం 8.30 తర్వాత కేవలం విద్యార్థులను మాత్రమే కేంద్రం లోపలికి అనుమతించాల్సినే నిబంధన సిబ్బంది విస్మరించారు. తల్లిదండ్రులతోపాటు పలు ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు పరీక్ష గదుల్లోకి ప్రవేశించారు. 9.10 నిమిషాల వరకు వారంతా అక్కడే ఉండి తమ పాఠశాల విద్యార్థులను దగ్గరుండి మరీ గదుల్లో కూర్చోబెట్టారు. ఇంత జరుగుతున్నా సంబంధిత కేంద్రం నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోలేదు. పోలీసు సిబ్బంది వచ్చి అందరినీ బయటకు పంపించివేశారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని