రైతుకు సంజీవని వరంగల్ డిక్లరేషన్: మల్లు రవి
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ నేతృత్వంలో ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్ కష్టాల్లో ఉన్న కర్షకలకు పాలిట ఓ సంజీవని అని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ మల్లు రవి
ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్టుడే: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ నేతృత్వంలో ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్ కష్టాల్లో ఉన్న కర్షకలకు పాలిట ఓ సంజీవని అని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ మల్లు రవి అన్నారు. ఖమ్మం డీసీసీ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో రైతులకు వరంగల్ రైతు డిక్లరేషన్పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించిన చరిత్ర తెరాస ప్రభుత్వానికి దక్కిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో విత్తనాలకు, పంటలకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చామని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు నూరుశాతం రాయితీ ఇచ్చి ప్రోత్సహించామని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వరి రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు వంచిస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంపై పోరాటం చేస్తున్నట్లు ఒకరోజు ధర్నా చేసి తర్వాత మేమే కొంటామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
బాధిత రైతు కుటుంబాలను ఆదుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడి ప్రజల సొమ్మును పక్క రాష్ట్రాల్లో రైతులకు పరిహారంగా అందించడం ఏంటని ప్రశ్నించారు. నేలకొండపల్లి మండలం నాచేపల్లి సొసైటీ పరిధిలో 20వేల క్వింటాలు వీధుల్లోనే ఉన్నాయన్నారు. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. రాబోవు ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్రంలో ప్రభుత్వాలను ప్రజలు మార్చాలని కోరారు. విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నగర అధ్యక్షుడు ఎండీ జావీద్, నాయకులు మొక్కా శేఖర్గౌడ్, వీరభద్రం, కరుణాకర్రెడ్డి, మలీదు వెంకటేశ్వర్లు, హుస్సేన్, అంజయ్య పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బదిలీ పొందిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలి
[ 19-04-2024]
గత విద్యా సంవత్సరంలో బదిలీ పొంది రిలీవర్ లేనందున రిలీవ్ చేయని ఉపాధ్యాయులను వెంటనే వారు బదిలీ పొందిన స్థానంలో నియమించాలని తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భానోత్ వీరు నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. -
విజేతలకు బహుమతులు అందజేత
[ 19-04-2024]
పొన్నేల్లో బోడేపూడి ట్రస్ట్ ద్వారా మండల స్థాయి క్రికెట్ పోటీలు అంబేద్కర్ యువ మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. -
తాటి చెట్టు పైనుంచి పడి కల్లుగీత కార్మికుడి మృతి
[ 19-04-2024]
ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
జగాలను ఏలిన రామయ్యకు పట్టాభిషేకం
[ 19-04-2024]
ధర్మమే ఆకారం దాల్చిన రామావతారుడు భద్రగిరిలో కొలువై ఉండగా తక్కువేమి మనకు అంటూ కోలాటాలు ఆడారు. -
తొలిరోజు ఖమ్మంలో ఒకటే నామినేషన్
[ 19-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో తొలిరోజు గురువారం ఒక నామపత్రం దాఖలైంది. అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఆదార్) పార్టీ తరఫున ముదిగొండ మండలం గంధసిరికి చెందిన కుక్కల నాగయ్య ఒక సెట్ నామపత్రాలను ఆర్ఓ గౌతమ్కు అందజేశారు -
ఏ పత్రం.. ఏం చెబుతుందంటే..?
[ 19-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రకటన గురువారం వెలువడింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫాం-1 ద్వారా ఆయా స్థానాల్లో నోటీసు జారీ చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లను గురువారం నుంచే స్వీకరిస్తున్నారు. -
అడుగంటిన జలం.. అపర భగీరథ ప్రయత్నం
[ 19-04-2024]
అడుగంటిన భూగర్భజలాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో కొందరు రైతులు పామాయిల్ సాగు చేశారు. -
18లో మేలుకొలుపు ప్రజాస్వామ్య గెలుపు
[ 19-04-2024]
ప్రజాస్వామ్య ఎన్నికల్లో యువ ఓటర్ల చైతన్యమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం వినూత్న ప్రయోగాలు చేస్తోంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కొత్తగా చేపట్టే కార్యక్రమం.. ‘టర్నింగ్-18’. అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నిక ప్రక్రియలో ఏ ఒక్కఓటరూ వెనకబడకుండా చూడటమే అంతిమ లక్ష్యం. -
బేతుపల్లి అంకమ్మతల్లి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి
[ 19-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బేతుపల్లి అంకమ్మ తల్లి తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మవారిని ఊరేగించే రథాలను సిద్ధం చేశారు. -
ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
[ 19-04-2024]
జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో క్రోధి నామ సంవత్సర వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. స్వామి వారికి ప్రాతఃకాల అర్చనల అనంతరం యజ్ఞశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు -
సోనియా రుణం తీర్చుకోవాలి: మంత్రి తుమ్మల
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ అగ్రనేత సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు -
గుళికల మందు మింగి బలవన్మరణం
[ 19-04-2024]
గుళికల మందు మింగి ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ నాగేశ్వరరావు కథనం ప్రకారం.. అశ్వారావవుపేట కోతమిషన్ బజారులో కూలీ పనులు చేస్తూ జీవించే బమ్మిడి సాంబయ్య(62)కు పదిహేనేళ్ల కిందట కడుపు పైభాగంలో కణితి ఏర్పడింది -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
[ 19-04-2024]
రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన జూలూరుపాడు మండలం సాయిరాంతండా వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు