వానొస్తే ముంపేనా?
జిల్లాలోని పురపాలికల్లో వర్షాకాలంలో నెలకొనే ప్రధాన సమస్య లోతట్టు ప్రాంతాల ముంపు. ముందస్తు చర్యలతో దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధుల్లో చలనమే పట్టించుకోకపోవడం
పురపాలకాల్లో కానరాని ముందస్తు జాగ్రత్త చర్యలు
కొత్తగూడెం-భద్రాచలం ప్రధాన రహదారిపైకి చేరిన వరద (దాచిన చిత్రం)
జిల్లాలోని పురపాలికల్లో వర్షాకాలంలో నెలకొనే ప్రధాన సమస్య లోతట్టు ప్రాంతాల ముంపు. ముందస్తు చర్యలతో దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధుల్లో చలనమే పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది. ముంపు నివారణ చర్యలపై పాలకవర్గం, అధికారులతో సమావేశాల్ని ఏర్పాటు చేసి చర్చించాలి. ఉభయ జిల్లాల్లోని పురపాలకాల్లో ఇప్పటి వరకు ఈ తరహా సన్నద్ధత ప్రారంభించనే లేదు.
కొత్తగూడెం అర్బన్, న్యూస్టుడే
వర్షాకాలం నేపథ్యంలో జిల్లాలోని పురపాలికల్లో ప్రమాద ఘంటికలు మోగడం సహజంగా మారింది. వర్షాలు కురిసే
సమయం సమీపిస్తున్న నేపథ్యంలో నాలాలను శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది. వరద, మురుగు నీరు కాల్వల ద్వారా ప్రవహిస్తోంది. వీటి నిర్వహణ సక్రమంగా లేకపోవడం, పలు చోట్ల కొత్తగా నిర్మించకపోవడంతో అయిదు పురపాలకాల్లో భారీ వర్షాలు పడితే లోతట్టు జలమయం అవుతోంది. గతేడాది కురిసిన వర్షాలకు రోడ్లపై మోకాలి లోతు వరద చేరింది. ఈ సారి కూడా ఎలాంటి ఉపశమన ప్రణాళికలు లేకుండానే వర్షాకాలాన్ని ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.
సమస్యకు ప్రధాన కారణాలు
* కాలువల కబ్జా: వరద ప్రవాహానికి కాల్వలు, వాగులే ఆధారం. వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. కొన్నిచోట్ల విద్యుత్తు స్తంభాలను మధ్యలోనే వదిలేసి డ్రెయిన్లు నిర్మించారు. ఇసుక, మట్టి, ఇళ్లల్లోంచి వెలువడే వ్యర్థాలు ప్లాస్టిక్ కాల్వల్లో పేరుకుపోతున్నాయి. ‘మిషన్ భగీరథ’ పనుల పేరుతో కాల్వలు ధ్వంసం చేసి వదిలేశారు.
* అనుసంధాన లోపాలు
లోతట్టు కాలనీలు ముంపునకు గురవడానికి గల ప్రధాన కారణాల్లో మరొకటి.. కాల్వలను ప్రధాన డ్రెయిన్లు, నాలాలకు అనుసంధానించకుండా వదిలేయడం. దీంతో ఏ ప్రాంతంలో వెలువడే మురుగు అక్కడే స్తంభిస్తోంది.
* పేరుకుపోతున్న పూడిక
వాగులు, చెరువులు, పంటకాల్వలు వంటి వాటిల్లో వ్యర్థాలు పారబోయడం.. నిర్వహణ లేక పిచ్చిచెట్లు పెరగడంతో ప్రవాహం లోతట్టు కాలనీలకు పోటెత్తుతోంది.
పాల్వంచలో వరద సమస్య తలెత్తే కాలనీలను గుర్తించాం. ప్రవాహం పెద్ద ఎత్తున వస్తే ముందుకు సాగేలా అవసరమైన చోట్ల యంత్రాలతో కందకాలు తీయిస్తున్నాం. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కాల్వలు ప్రధాన డ్రెయిన్లకు అనుసంధానం చేస్తున్నాం. పూడికతీత పనులు కొనసాగుతున్నాయి. కాల్వలు, నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపడితే ఎట్టిపరిస్థితుల్లో కూల్చివేస్తామని అవగాహన కల్పిస్తున్నాం.
- సీహెచ్ శ్రీకాంత్, కమిషనర్, పాల్వంచ
పాల్వంచ
మున్సిపాల్టీ పరిధిలో శివనగర్, అయ్యప్పనగర్, వెంకటేశ్వరహిల్స్ కాలనీ, బంజారకాలనీ, ఇందిరానగర్కాలనీ, హమాలీకాలనీ, వనమాకాలనీ, జయమ్మకాలనీ, తెలంగాణ నగర్, గాంధీనగర్, ఒడ్డుగూడెం, కేసీఆర్నగర్, బాపూజీ నగర్కాలనీలు ప్రధాన లోతట్టు ప్రాంతాలు. సగం కాలనీల మురుగు, వరదంతా ఇక్కడికే వచ్చి చేరుతుంది. పట్టణంలో ఉన్న చెరువులు ఆక్రమణ చెరలో ఉండటంతో వరద ముందుకుపోవడానికి మార్గం ఉండటం లేదు. గతేడాది భారీ వర్షాలకు జరిగిన ప్రమాదాలతో ఇద్దరు మృతిచెందగా, రూ.లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లింది.
ఇల్లెందు
పట్టణ నడిబొడ్డున ఉన్న బుగ్గవాగులో సింగరేణి, పురపాలకం ఆధ్వర్యంలో వ్యర్థాల తొలగింపు, పిచ్చిమొక్కల తొలగింపు ప్రక్షాళన చేయాల్సి ఉంది. కానీ అది జరగలేదు. ఈసారి కూడా పరిసర కాలనీలు ముంపునకు గురవడం తథ్యమని స్థానికులు వాపోతున్నారు. 5వ వార్డు లాల్బహుదూర్ శాస్త్రినగర్, 6, 7, 8 వార్డులో నంబర్-2 బస్తీ, 19వ వార్డులో ఆంబజార్ లోతట్టు ప్రాంతాలు. 2005లో కాలనీలు వరద విపత్తుకు విలవిలలాడాయి.
మణుగూరు
వాగుమల్లారం, అశోక్నగర్, ఆదర్శ్నగర్, సుందరయ్యనగర్, మేదరబస్తీ, ఇందిరానగర్, చాకలి ఐలమ్మనగర్, కాళీ మాత ఏరియాల్లో భారీ వర్షాలకు ముంపునకు గురవుతాయి. కోడిపుంజలవాగు, కట్టువాగుల్లో సింగరేణి, పురపాలకం ఆధ్వర్యంలో వాగుల్లో పూడికతీత చేపట్టాల్సి ఉంది. ఓబీ గుట్టలపై నుంచి వచ్చే వరద పలు కాలనీలను వణికిస్తోంది. ప్రవాహాన్ని మళ్లిస్తేనే ప్రయోజనం ఉంటుంది. ఏటా రూపొందిస్తున్న ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం కావడం గమనార్హం.
కొత్తగూడెం
లోతట్టు ప్రాంతాలుగా ఉన్న ప్రశాంత్నగర్, పాతకొత్తగూడెం, ఎస్సీ, ఎస్టీ కాలనీలతో పాటుగా మరికొన్ని ఏరియాల్లో కాల్వల నిర్మాణం సరిగా లేక మురుగు ఇళ్లల్లోకి ప్రవహిస్తోంది. గత రెండు, మూడేళ్లుగా సమస్య జటిలమవుతున్నా పట్టింపులేదు.
మధిర
హనుమాన్కాలనీ, ఎంప్లాయీస్కాలనీ, వదర రాఘవాపురం, ముస్లిం కాలనీ, ఎస్సీ, ఎస్టీ కాలనీలను వరద సమస్య వేధిస్తోంది. ఇక్కడ ముంపు బెడద నివారణకు చర్యలు చేపట్టాలనే డిమాండ్ ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
[ 25-04-2024]
మారుమూల గిరిజన బిడ్డ ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించింది. బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో భద్రాద్రి జిల్లా -
ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా
[ 25-04-2024]
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు బుధవారం విడుదల య్యాయి. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 63.84 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నాలుగో స్థానంలో, -
కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాంరెడ్డి
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిని ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. కాంగ్రెస్ శ్రేణుల నెలన్నర రోజుల ఉత్కంఠకు తెరపడింది. -
భారాస హయాంలోనే ఉభయ జిల్లాల అభివృద్ధి: హరీశ్రావు
[ 25-04-2024]
ఖమ్మం జిల్లా అభివృద్ధికి గత భారాస ప్రభుత్వం పనిచేస్తే.. కాంగ్రెస్ సర్కారులో మంత్రి పదవులు పొందిన నేతలు మాత్రం తమ కుటుంబీకులకు ఎంపీ టికెట్ ఇప్పించుకునేందుకు అధిష్ఠానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. -
కేసీఆర్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి: తెదేపా
[ 25-04-2024]
మాజీ సీఎం కేసీఆర్ అబద్దపు జోస్యాలు, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తెదేపా ఖమ్మం పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు కేతినేని హరీశ్ చంద్ర హితవు పలికారు. -
భాజపాతోనే సమగ్రాభివృద్ధి: తాండ్ర
[ 25-04-2024]
భాజపా గెలుపుతోనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ఖమ్మం లోక్సభ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
గంజాయి పేరెత్తకుండా
[ 25-04-2024]
ఏపీ సరిహద్దునున్న మన్యం జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో కొంతకాలంగా గంజాయి ఎక్కువగా పట్టుబడుతోంది. రవాణా, విక్రయ ఘటనల్లో చిక్కే నిందితుల్లో ఎక్కువ మంది యువతే కావడం ఆందోళనకరం. -
మలేరియా కట్టడికి పరిశుభ్రత మంత్రం
[ 25-04-2024]
మైదాన ప్రాంతాలతో పోల్చిచూస్తే భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లోనే మలేరియా జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. -
ఓటరు తుది జాబితాలో తప్పులు ఉండొద్దు: కలెక్టర్
[ 25-04-2024]
ఓటు నమోదు దరఖాస్తుల విచారణ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. ఓటరు తుది జాబితాను తప్పులు లేకుండా రూపొందించాలన్నారు. -
తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతా: ఎంపీ నామా
[ 25-04-2024]
తెలంగాణ ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం పార్లమెంటు పోరాడేందుకు మరోసారి తనకు అవకాశం కల్పించాలని భారాస లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. -
ఆరో రోజు 21 సెట్ల నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో ఆరోరోజు బుధవారం 14 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు -
ఓటర్ల తుది జాబితా అభ్యర్థులకు అందించాలి
[ 25-04-2024]
లోక్సభ నియోజకవర్గాల వారీగా ఓటర్ల తుది జాబితా సిద్ధం చేసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!