జీపు ఢీకొని వ్యక్తి దుర్మరణం
మోపెడ్ను జీపు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సత్తుపల్లిలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎన్టీఆర్నగర్కు చెందిన చిరు వ్యాపారి
పొన్నంపల్లి చంద్రం
సత్తుపల్లి, న్యూస్టుడే: మోపెడ్ను జీపు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సత్తుపల్లిలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఎన్టీఆర్నగర్కు చెందిన చిరు వ్యాపారి పొన్నంపల్లి చంద్రం(60) జామకాయలు కొనుగోలు చేసేందుకు తన వాహనంపై వేంసూరు రోడ్డు నుంచి రింగ్ సెంటర్ వైపు వస్తున్నాడు. అదే సమయంలో సత్తుపల్లి నుంచి నూజివీడు వెళ్తున్న జీపు షాదీఖానా సమీపంలో ఎదురుగా వెళ్తున్న పంచాయతీ ట్రాక్టర్ను అధిగమించే క్రమంలో టీవీఎస్ను ఢీకొంది. అనంతరం కరెంటు స్తంభాన్నీ ఢీకొట్టింది. ప్రమాదంలో చంద్రం 40 అడుగుల దూరంలో రోడ్డు పక్కన పడి అక్కడికక్కడే మృతి చెందాడు. జీపు డ్రైవర్ పంతంగి గోపీకృష్ణ, సొంటి శ్రీరామ్ప్రసాద్కూ తీవ్ర గాయాలయ్యాయి. దయాకర్ అనే మరో వ్యక్తి పరారయ్యాడు. క్షతగాత్రులను స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చంద్రానికి భార్య కుమారి, కుమారుడు వెంకటేశ్వరరావు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వరుస చోరీల నిందితుని అరెస్టు
నేలకొండపల్లి, న్యూస్టుడే: వరుస చోరీలతో పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన అంతరాష్ట్ర దొంగను నేలకొండపల్లి పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గువ్వలగూడెం, నేలకొండపల్లి, పైనంపల్లి గ్రామాల్లో ఇటీవల దొంగతనాలు జరిగాయి. వాటిలో లభించిన ఆధారాల ద్వారా నేలకొండపల్లి ఎస్సై స్రవంతి దర్యాప్తు చేశారు. ఈ మూడు దొంగతనాలను పాల్పడింది మధిర మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన కంభంపాటి యేసోబు అలియాస్ సురేష్గా గుర్తించారు. నేలకొండపల్లి ఎస్సై ఆధ్వర్యంలో అతని ఆచూకీ గుర్తించి అరెస్టు చేశారు. ఇతనిపై మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు, మరిపెడ ఠాణాల్లో, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా వీరులపాడు ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. మధిర గ్రామీణం, టౌన్, ఎర్రుపాలెం, సత్తుపల్లి, బోనకల్లు, వైరా, ఖమ్మం, ఏపీ ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం, నందిగామ, తిరువూరు ఠాణాల పరిధుల్లో పలు దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి శిక్ష అనుభవించి వచ్చాడు. అయినప్పటికీ తన నేర ప్రవృత్తిని కొనసాగిస్తూ నేలకొండపల్లి పోలీసులకు మరోమారు చిక్కాడు. పోలీసులు ఇతని నుంచి 6 తులాల బంగారం, 25 తులాల వెండి వస్తువులు, 3.5 లక్షలు నగదు, టీవీ, సెల్ఫోన్, కూలర్లను స్వాధీనం చేసుకున్నారు. నేలకొండపల్లి ఎస్సై స్రవంతిని ఖమ్మం గ్రామీణ ఏసీపీ బస్వారెడ్డి అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా
[ 25-04-2024]
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు బుధవారం విడుదల య్యాయి. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 63.84 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నాలుగో స్థానంలో, -
కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాంరెడ్డి
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిని ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. కాంగ్రెస్ శ్రేణుల నెలన్నర రోజుల ఉత్కంఠకు తెరపడింది. -
భారాస హయాంలోనే ఉభయ జిల్లాల అభివృద్ధి: హరీశ్రావు
[ 25-04-2024]
ఖమ్మం జిల్లా అభివృద్ధికి గత భారాస ప్రభుత్వం పనిచేస్తే.. కాంగ్రెస్ సర్కారులో మంత్రి పదవులు పొందిన నేతలు మాత్రం తమ కుటుంబీకులకు ఎంపీ టికెట్ ఇప్పించుకునేందుకు అధిష్ఠానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. -
కూలీ బిడ్డకు 993 మార్కులు
[ 25-04-2024]
మారుమూల గిరిజన బిడ్డ ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించింది. బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో భద్రాద్రి జిల్లా -
కేసీఆర్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి: తెదేపా
[ 25-04-2024]
మాజీ సీఎం కేసీఆర్ అబద్దపు జోస్యాలు, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తెదేపా ఖమ్మం పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు కేతినేని హరీశ్ చంద్ర హితవు పలికారు. -
భాజపాతోనే సమగ్రాభివృద్ధి: తాండ్ర
[ 25-04-2024]
భాజపా గెలుపుతోనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ఖమ్మం లోక్సభ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
గంజాయి పేరెత్తకుండా
[ 25-04-2024]
ఏపీ సరిహద్దునున్న మన్యం జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో కొంతకాలంగా గంజాయి ఎక్కువగా పట్టుబడుతోంది. రవాణా, విక్రయ ఘటనల్లో చిక్కే నిందితుల్లో ఎక్కువ మంది యువతే కావడం ఆందోళనకరం. -
మలేరియా కట్టడికి పరిశుభ్రత మంత్రం
[ 25-04-2024]
మైదాన ప్రాంతాలతో పోల్చిచూస్తే భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లోనే మలేరియా జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. -
ఓటరు తుది జాబితాలో తప్పులు ఉండొద్దు: కలెక్టర్
[ 25-04-2024]
ఓటు నమోదు దరఖాస్తుల విచారణ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. ఓటరు తుది జాబితాను తప్పులు లేకుండా రూపొందించాలన్నారు. -
తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతా: ఎంపీ నామా
[ 25-04-2024]
తెలంగాణ ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం పార్లమెంటు పోరాడేందుకు మరోసారి తనకు అవకాశం కల్పించాలని భారాస లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. -
ఆరో రోజు 21 సెట్ల నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో ఆరోరోజు బుధవారం 14 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు -
ఓటర్ల తుది జాబితా అభ్యర్థులకు అందించాలి
[ 25-04-2024]
లోక్సభ నియోజకవర్గాల వారీగా ఓటర్ల తుది జాబితా సిద్ధం చేసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)