నాలుగు దిశల్లో ముదింపు
పట్టణాల్లో ఉత్పత్తవుతున్న వ్యర్థాలను వేర్వేరుగా సేకరించడం, వాహనాల ద్వారా తరలించడం, యంత్రాలను ఉపయోగించి పునర్వినియోగించడం.. ఇలా వ్యర్థాలకు అర్థం కల్పిస్తూ ఆదాయంగా మలుస్తున్నారు. పౌరుల భాగస్వామ్యంతో పట్టణ పారిశుద్ధ్యం మెరుగుపర్చడం,
స్వచ్ఛ సర్వేక్షణ్ నియమావళి విడుదల
పాల్వంచలో తడివ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువు తయారీ కేంద్రం
కొత్తగూడెం అర్బన్, న్యూస్టుడే: పట్టణాల్లో ఉత్పత్తవుతున్న వ్యర్థాలను వేర్వేరుగా సేకరించడం, వాహనాల ద్వారా తరలించడం, యంత్రాలను ఉపయోగించి పునర్వినియోగించడం.. ఇలా వ్యర్థాలకు అర్థం కల్పిస్తూ ఆదాయంగా మలుస్తున్నారు. పౌరుల భాగస్వామ్యంతో పట్టణ పారిశుద్ధ్యం మెరుగుపర్చడం, ఆహ్లాద వాతావరణాన్ని కల్పిస్తున్న సంస్థలకు కేంద్రం ర్యాంకులు, అవార్డులు, నగదు ప్రోత్సహాకాన్ని అందజేస్తోంది. 2016 నుంచి కేంద్రం స్వచ్ఛసర్వేక్షణ్ పేరుతో కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేస్తోంది. ఏటా కేంద్ర బృందాలు స్థానిక సంస్థల పనితీరును గుర్తిస్తున్నాయి. తాజాగా స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 టూల్కిట్ను దిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి మనోజ్జోషి ఇటీవల విడుదల చేశారు. 2023లో ఆర్ఆర్ఆర్(రెడ్యూస్ రీసైకిల్ రీయూజ్)కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన సర్వేల్లో మూడు దశలుండగా తాజాగా నాలుగు దశల్లో మదిస్తారు.
ఈసారి ఆర్ఆర్ఆర్కే ప్రాధాన్యం
స్వచ్ఛసర్వేక్షణ్ ఒక్కో ఏడాది ఒక్కో అంశాన్ని లక్ష్యంగా చేసుకుని పనులను నిర్దేశిస్తున్నారు. గతేడాది సామాజిక, బహిరంగ మరుగుదొడ్ల నిర్మాణం, తడి, పొడి వ్యర్థాలను వేరు చేయడం వంటి అంశాలను లక్ష్యంగా ఉంచారు. 2023లో వ్యర్థాలను పునర్వినియోగం చేసి ఆదాయాన్ని ఆర్జిస్తున్న పురపాలికలను గుర్తించనున్నారు. దీనినే ఆర్ఆర్ఆర్(రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్)గా పిలుస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.
జనాభా ఆధారంగా అవార్డులు
1. 15వేల లోపు 2. 15-25వేల లోపు
3. 25-50వేలు 4. 50-లక్ష వరకు..
5. లక్ష-10లక్షలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సార్వత్రిక సమరం.. సిబ్బంది సిద్ధం..!
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై ఈసీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఓటరు నమోదు నుంచి అభ్యర్థుల నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ వరకు ప్రతి ఘట్టంలో అధికారులు, ఎన్నికల సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తారు. -
దండుకున్నారు.. తిప్పించుకుంటున్నారు..!
[ 29-03-2024]
కొత్తగూడెం నియోజకవర్గంలో ‘దళితబంధు’ పేరిట భారీగా వసూళ్ల పర్వం సాగింది. ఒక్కొక్కరి నుంచి ఏకంగా రూ.3 లక్షలు దండుకున్నారు. ఈవ్యవహారంలో అప్పటి ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు, పురపాలికలోని కొంతమంది ప్రజాప్రతినిధులు కీలకంగా వ్యవహరించారు. -
అసైన్డ్ భూముల్లో కట్టడాల కూల్చివేత
[ 29-03-2024]
ఖమ్మం నగరంలోని 8వ డివిజన్ వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలో అసైన్డ్ భూముల్లో అసలు యజమానులు కాకుండా కొనుగోలు చేసినవారు చేపట్టిన నిర్మాణాలను రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు గురువారం కూల్చివేశారు. -
పిండం దశలోనే పిసికేస్తున్నారు!
[ 29-03-2024]
ఆరోగ్య సమస్యలకు చికిత్స అందిస్తామని అనుమతులు తీసుకున్న ఆస్పత్రిలో గర్భవిచ్ఛిత్తికి పాల్పడుతున్నారు. ధనార్జన కోసం అనైతిక వైద్యం చేస్తూ పిండ దశలోనే ప్రాణాలు తీసేస్తున్నారు. -
అటు సాధన.. ఇటు శోధన
[ 29-03-2024]
రూ.15వేల రుణం కోసం ఆశపడిన ఐదుగురు మహిళలు, తెలియకుండానే తమ ఖాతాల ద్వారా రూ.కోట్ల లావాదేవీలు నడిపారు. నమ్మించిన యువకుడు ఒక బ్యాంకు ఖాతా పేరు చెప్పి, మరో బ్యాంకు ఖాతా తెరచి మోసగించాడని ఆలస్యంగా గ్రహించారు. -
‘సైబర్’ దోపిడీ సొమ్ము.. అమాయకుల ఖాతాలకు!
[ 29-03-2024]
సైబర్ నేరస్థులు అమాయకుల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారని, వాటి సాయంతో లూటీ సొమ్మును వాడుకుంటున్నారని ఎస్పీ బి.రోహిత్రాజు గురువారం తెలిపారు. -
ఎండల గండాలకు జాగ్రత్తలే గొడుగు
[ 29-03-2024]
మార్చి నెలలోనే ఎండలు ముదిరాయి. వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని సింగరేణి, పలు పరిశ్రమల ప్రభావిత ప్రాంతాల్లో వేడి ఇంకొంచెం ఎక్కువగా ఉంటోంది. -
అప్పుల బాధతో యువరైతు బలవన్మరణం
[ 29-03-2024]
పంటల దిగుబడి సరిగా రాలేదన్న మనస్తాపంతో ఓ యువరైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకుపాల్పడ్డాడు. పాల్వంచ గ్రామీణ ఎస్సై బి.శ్రీనివాస్ కథనం ప్రకారం.. మండలంలోని యానంబైలు గ్రామానికి చెందిన మంత్రి శశికుమార్ (26) నాలుగెకరాల్లో పత్తి, అయిదు ఎకరాల్లో వరి సాగు చేశాడు. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగుపయనమయ్యారు. -
మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, కొరియర్ అరెస్టు
[ 29-03-2024]
నిషేధిత సీపీఐ మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ బి.రోహిత్రాజు తెలిపారు. గురువారం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. -
9 నుంచి శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు
[ 29-03-2024]
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 9 నుంచి 23 వరకు జరిగే శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేపట్టాలని ఆర్డీఓ దామోదర్రావు ఆదేశించారు. రామాలయం ఈఓ రమాదేవితో కలిసి తన కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు.