తరుగు.. లేదంటే తిరస్కరణ
మూడు రోజుల క్రితం వేంసూరు మండలంలోని ఓ ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ఖమ్మంలోని ఓ మిల్లుకు లారీలోడు ధాన్యం వచ్చింది. తేమ శాతం ఎక్కువగా ఉందని, ధాన్యం ఆరబెట్టాలని లేకుంటే క్వింటాకు 10 కిలోలు తరుగు తీయాలని మిల్లర్
మిల్లర్ల కొర్రీలతో ధాన్యం రైతుల దైన్యం
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్టుడే
కొనుగోలు కేంద్రంలో లారీలోకి ధాన్యం లోడింగ్
* మూడు రోజుల క్రితం వేంసూరు మండలంలోని ఓ ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి ఖమ్మంలోని ఓ మిల్లుకు లారీలోడు ధాన్యం వచ్చింది. తేమ శాతం ఎక్కువగా ఉందని, ధాన్యం ఆరబెట్టాలని లేకుంటే క్వింటాకు 10 కిలోలు తరుగు తీయాలని మిల్లర్ సూచించారు. లేదంటే వెనక్కి తీసుకెళ్లి ధాన్యం ఆరబెట్టి తీసుకురావాలని సూచించారు. దీంతో రైతులు లబోదిబోమంటూ తిరిగి కొనుగోలు కేంద్రానికి తరలించి ఆరబెట్టారు. లారీ రవాణా ఖర్చులు ఎవరు భరించాలో స్పష్టత లేదు. ధాన్యం ఆరబెట్టిన తర్వాత తీసుకెళ్లినా ఆ మిల్లర్ సక్రమంగా తీసుకుంటారో లేదో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.
* ఇటీవల తల్లాడ మండలంలోని ఓ కొనుగోలు కేంద్రం నుంచి ఖమ్మంలోని ఓ మిల్లుకు వచ్చిన ధాన్యం నాణ్యతా ప్రమాణాలకు అనువుగా లేదని మిల్లర్ 10 కిలోల తరుగు తీయాలని సూచించారు. అందుకు రైతులు అంగీకరించలేదు. ఓ ప్రజాప్రతినిధి దృష్టికి సమస్య వెళ్లింది. అయినా మిల్లర్ మాటే నెగ్గింది. రైతుల ధాన్యాన్ని వెనక్కి తిప్పి పంపారు.
..ఇలా ధాన్యం తిరస్కస్తుంటే చాలా మంది రైతులు ధాన్యాన్ని వెనక్కి తెచ్చుకోలేక, వారితో రాజీ పడి తరుగు తీసి ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగిస్తున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉందని, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యం లేదని, చెత్త, చెదారం ఎక్కువగా ఉందని సాకులు చెపుతూ క్వింటాకు 5 నుంచి 10 కిలోలు కోత పెడుతున్నారు.
ఏఈవోల ధ్రువీకరణకు విలువ లేదా?
రైతు తీసుకొచ్చిన ధాన్యం నాణ్యతా ప్రమాణాలు పరిశీలించి సంబంధిత ఏఈవో ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. ఆ పత్రం ఆధారంగానే కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం వేసి, రైతుల వివరాలు నమోదు చేస్తారు. అక్కడితో రైతు బాధ్యత ముగుస్తుంది. కానీ కేంద్రం నుంచి రవాణా అయిన ధాన్యాన్ని చివరి నిమిషంలో మిల్లర్ ఆపేసి నాణ్యత లేదంటూ అడ్డుకుంటున్నారు. అంటే ఏఈవో ధ్రువీకరణ తప్పుగా ఇచ్చారా...లేదా ఆ పత్రానికి విలువ లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వ్యవసాయ శాఖ రికార్డుల్లోనూ పంటల సాగు వివరాలు (క్రాప్ బుకింగ్) సక్రమంగా లేవని, రైతుల వివరాలు ఏఈవోలకు తెలియని పరిస్థితి ఉందనే అంశంపై చర్చనీయాంశంగా మారింది. చివరికి రైతులు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నారు.
పొరుగు రాష్ట్రం నుంచి రాక
మరోవైపు పొరుగు రాష్ట్రం నుంచి కొందరు దళారులు సరిహద్దుల్లోని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం అక్రమంగా పంపించి విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ ఏడాది జిల్లాలో యాసంగి వరి సాగు చాలా తక్కువ. గతేడాది కంటే ఇప్పటికే సరిహద్దుల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఎక్కువ మొత్తంలో ధాన్యం సేకరణ జరిగింది. పంట సాగు తక్కువైనా ధాన్యం మాత్రం ఎక్కువగా కొనుగోలు చేశారు. ఎలా సాధ్యమైందనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. సత్తుపల్లి, వేంసూరు, నేలకొండపల్లి, పెనుబల్లి, కల్లూరు మండలాల్లోని కొన్ని కేంద్రాల్లో గతేడాది కంటే ప్రస్తుత సీజన్లో ఎక్కువ ధాన్యం సేకరించినట్లు తెలుస్తోంది.
యాసంగి ధాన్యం సేకరణ మరో వారం రోజుల్లో పూర్తవుతుంది. నాణ్యతా ప్రమాణాల పేరుతో కొన్ని చోట్ల మిల్లర్లు తరుగు తీస్తామంటే అంగీకరించలేదు. కొన్ని కేంద్రాల్లో గతేడాది కంటే ఈసారి ఎక్కువ సేకరణ జరిగినట్లు సమాచారం ఉంది. సేకరణ ప్రక్రియ ముగిసిన తర్వాత గణాంకాలు పరిశీలించాల్సి ఉంటుంది. రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు జమలో ఇబ్బంది లేదు.
-నరసింహారావు, సహాయ మేనేజర్, పౌరసరఫరాల సంస్థ, ఖమ్మం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బదిలీ పొందిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలి
[ 19-04-2024]
గత విద్యా సంవత్సరంలో బదిలీ పొంది రిలీవర్ లేనందున రిలీవ్ చేయని ఉపాధ్యాయులను వెంటనే వారు బదిలీ పొందిన స్థానంలో నియమించాలని తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భానోత్ వీరు నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. -
విజేతలకు బహుమతులు అందజేత
[ 19-04-2024]
పొన్నేల్లో బోడేపూడి ట్రస్ట్ ద్వారా మండల స్థాయి క్రికెట్ పోటీలు అంబేద్కర్ యువ మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. -
తాటి చెట్టు పైనుంచి పడి కల్లుగీత కార్మికుడి మృతి
[ 19-04-2024]
ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
జగాలను ఏలిన రామయ్యకు పట్టాభిషేకం
[ 19-04-2024]
ధర్మమే ఆకారం దాల్చిన రామావతారుడు భద్రగిరిలో కొలువై ఉండగా తక్కువేమి మనకు అంటూ కోలాటాలు ఆడారు. -
తొలిరోజు ఖమ్మంలో ఒకటే నామినేషన్
[ 19-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో తొలిరోజు గురువారం ఒక నామపత్రం దాఖలైంది. అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఆదార్) పార్టీ తరఫున ముదిగొండ మండలం గంధసిరికి చెందిన కుక్కల నాగయ్య ఒక సెట్ నామపత్రాలను ఆర్ఓ గౌతమ్కు అందజేశారు -
ఏ పత్రం.. ఏం చెబుతుందంటే..?
[ 19-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రకటన గురువారం వెలువడింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫాం-1 ద్వారా ఆయా స్థానాల్లో నోటీసు జారీ చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లను గురువారం నుంచే స్వీకరిస్తున్నారు. -
అడుగంటిన జలం.. అపర భగీరథ ప్రయత్నం
[ 19-04-2024]
అడుగంటిన భూగర్భజలాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో కొందరు రైతులు పామాయిల్ సాగు చేశారు. -
18లో మేలుకొలుపు ప్రజాస్వామ్య గెలుపు
[ 19-04-2024]
ప్రజాస్వామ్య ఎన్నికల్లో యువ ఓటర్ల చైతన్యమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం వినూత్న ప్రయోగాలు చేస్తోంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కొత్తగా చేపట్టే కార్యక్రమం.. ‘టర్నింగ్-18’. అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నిక ప్రక్రియలో ఏ ఒక్కఓటరూ వెనకబడకుండా చూడటమే అంతిమ లక్ష్యం. -
బేతుపల్లి అంకమ్మతల్లి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి
[ 19-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బేతుపల్లి అంకమ్మ తల్లి తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మవారిని ఊరేగించే రథాలను సిద్ధం చేశారు. -
ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
[ 19-04-2024]
జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో క్రోధి నామ సంవత్సర వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. స్వామి వారికి ప్రాతఃకాల అర్చనల అనంతరం యజ్ఞశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు -
సోనియా రుణం తీర్చుకోవాలి: మంత్రి తుమ్మల
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ అగ్రనేత సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు -
గుళికల మందు మింగి బలవన్మరణం
[ 19-04-2024]
గుళికల మందు మింగి ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ నాగేశ్వరరావు కథనం ప్రకారం.. అశ్వారావవుపేట కోతమిషన్ బజారులో కూలీ పనులు చేస్తూ జీవించే బమ్మిడి సాంబయ్య(62)కు పదిహేనేళ్ల కిందట కడుపు పైభాగంలో కణితి ఏర్పడింది -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
[ 19-04-2024]
రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన జూలూరుపాడు మండలం సాయిరాంతండా వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు