ప్రజలపై చెత్త భారం
జిల్లాలోని పురపాలక ప్రజలపై యూజర్ ఛార్జీల భారం నెలకొంది. ఒక్కోచోట ఒకలా వసూలు చేస్తున్నారు. చెత్త సేకరణకు ఇంటింటికి రూ.30కి బదులు రూ.50 వరకు స్వచ్ఛ వాహనాల సిబ్బంది రాబట్టుకుంటున్నారు.
కొత్తగూడెం పట్టణం, న్యూస్టుడే
స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్తను సేకరిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది
జిల్లాలోని పురపాలక ప్రజలపై యూజర్ ఛార్జీల భారం నెలకొంది. ఒక్కోచోట ఒకలా వసూలు చేస్తున్నారు. చెత్త సేకరణకు ఇంటింటికి రూ.30కి బదులు రూ.50 వరకు స్వచ్ఛ వాహనాల సిబ్బంది రాబట్టుకుంటున్నారు. ఓ వైపు ‘స్వచ్ఛ’ కోటాలో పురపాలకాలకు రూ.లక్షల్లో నిధులు మంజూరవుతున్నా మాపై ఏటేటా భారం పెంచుతూ పోవడం ఏమిటని ప్రజలు పెదవి విరుస్తున్నారు. కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరులో వేల కుటుంబాలపై రూ.కోట్లలో ఛార్జీలు మోపడం విమర్శలకు దారితీస్తోంది. సాధారణ నిధుల్లోంచి ఠంఛనుగా వేతనాలు మంజూరు చేసి ఇబ్బందుల్లేకుండా చూడాలని వాహన సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.
పట్టణాల్లోని వార్డుల్లో చెత్త సేకరణకు ‘స్వచ్ఛ వాహనాల(ఆటో ట్రాలీ)’ను అందుబాటులోకి తీసుకొచ్చారు. సాధారణ నిధుల నుంచి ఆటో డ్రైవర్లకు రూ.6 వేల చొప్పున వేతనాలు చెల్లించాలని ఈ ఏడాది జనవరిలో అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు కొత్తగూడెం, ఇల్లెందు పురపాలకాల్లో కౌన్సిల్ తీర్మానాలు కూడా చేశారు. ఇదే నిర్ణయాన్ని పాల్వంచ, మణుగూరులో కొనసాగించాలని అక్కడి యంత్రాంగం నిర్ణయించింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ మేరకు వేతనాలు చెల్లించిన అధికారులు ఆ తర్వాత చేతులెత్తేశారు. గత నాలుగు నెలల నుంచి వేతనాలు లేని స్వచ్ఛ వాహనాల డ్రైవర్లు ఇంటింటికీ రేట్లు పెంచి ఛార్జీలు వసూలు చేసుకుంటున్నారు. అవి కూడా కనీస అవసరాలకు చాలడం లేదని వాపోతున్నారు. కొత్తగూడెం, మణుగూరు పురపాలకాల్లో ఇంటికి రూ.50, ఇల్లెందు, పాల్వంచల్లో రూ.30 వరకు వసూలు చేయాలి. కొన్నిచోట్ల ఈ మొత్తం చాలడం లేదని అదనంగా రూ.20 వరకు వసూలు చేసుకుంటున్నారు.
‘పట్టణ ప్రగతి’ ఏమాయె?
పట్టణ ప్రగతి పేరుతో ఒక్కో పురపాలకానికి దాదాపు రూ.50 లక్షల నిధులు ప్రభుత్వం నుంచి మంజూరవుతున్నాయి. అయినా స్వచ్ఛ వాహనాల నిర్వహణ అధ్వానంగా మారడం గమనార్హం. డ్రైనేజీలైనా బాగు చేస్తున్నారా? అంటే అదీ అంతంతమాత్రంగానే ఉంది. పారిశుద్ధ్య చర్యలకు నోచుకోని మురికివాడలు, శివారు కాలనీలు పదుల సంఖ్యలో ఉన్నాయి. కనిపించని మొక్కల నిర్వహణకే కాసులు ధారబోస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. ‘పట్టణ ప్రగతి’ నిధుల్లోంచి ఆటో డ్రైవర్లకు వేతనాలు చెల్లించాల్సి ఉన్నా పట్టించుకోకపోవడం, డ్రైవర్లు గత్యంతరం లేక యూజర్ ఛార్జీలు ఎంతో కొంత పెంచి వసూలు చేసుకోవడం సాధారణమైంది. కొందరు ప్రజలు అసలు ఛార్జీలే చెల్లించడం లేదని, పూట గడవడమూ కష్టమవుతోందని వాపోతున్నారు.
పారిశుద్ధ్య చర్యల్లో భాగంగా ప్రజల నుంచి వసూలయ్యే యూజర్ ఛార్జీల ద్వారానే స్వచ్ఛ ఆటోడ్రైవర్లకు వేతనాలు ఇవ్వాల్సి ఉంది. ప్రజలంతా సహకరించడం లేదంటూ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య చెత్త సేకరణపై పడొద్దన్న ఉద్దేశంతో సాధారణ నిధుల్లోంచి కొన్నాళ్లు వేతనాలు చెల్లించాం. జనవరికి ముందుకు సంబంధించి కూడా నాలుగైదు నెలల వేతనాలివ్వాలని డ్రైవర్లు కోరుతున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.
- టి.నవీన్కుమార్, కొత్తగూడెం కమిషనర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హస్తం జోరు.. ఆధిక్యాల హోరు
[ 04-12-2023]
ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఖిల్లా అని మరోసారి నిరూపితమైంది. హస్తం పార్టీ అభ్యర్థులు ఊహించని ఆధిక్యాలతో విజయబావుటా ఎగురవేసి ప్రభంజనం సృష్టించారు. -
ముగిసిన ఎన్నికల పర్వం.. మిన్నంటిన సంబరం
[ 04-12-2023]
ఎన్నికల క్రతువు ముగిసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం తేలిపోయింది. -
ఆశించిన ఫలితం దక్కలే..
[ 04-12-2023]
పూర్వ ఖమ్మం జిల్లాలో సీపీఎంకు ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో ఓటర్ల ఆదరణ లభించలేదు. -
ఆనందకరంగా సీతారామ కల్యాణోత్సవం
[ 04-12-2023]
భద్రాచలం రామాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. కోవెల పరిసరాలు కిక్కిరిసిపోయాయి. -
సహకారం మరువలేనిది: కలెక్టర్
[ 04-12-2023]
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ ప్రియాంక అల అన్నారు. -
మధిరలో విక్రమార్క విజయం
[ 04-12-2023]
మధిరలో సీఎల్పీ నేత, కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టివిక్రమార్క తన సమీప ప్రత్యర్థి భారాస అభ్యర్థి లింగాల కమల్రాజుపై 35,452 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. -
సత్తుపల్లి రాగమయి ‘హస్త’గతం
[ 04-12-2023]
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మట్టా రాగమయి సమీప ప్రత్యర్థి భారాస అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యపై 19,463 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. -
రాందాస్.. వైరా బాస్
[ 04-12-2023]
హోరా హోరీగా జరిగిన సార్వత్రిక పోరులో కాంగ్రెస్ అభ్యర్థి మాలోత్ రాందాస్నాయక్ విజయ ఢంకా మోగించారు. -
ఎవరికి ఎన్ని ఓట్లు?
[ 04-12-2023]
అంబోజు బుద్దయ్య(అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మర్స్ పార్టీ) 1242, కనకపుడి నాగేశ్వరరావు (యువతరం పార్టీ) 188, కొప్పుల శ్రీనివాసరావు(ప్రజాశాంతి పార్టీ) 69, బలవంతపు కళ్యాణ్కుమార్ (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా) 83 -
కష్టకాలంలో నిలబడి.. ఎమ్మెల్యేగా గెలిచి
[ 04-12-2023]
కాంగ్రెస్ అభ్యర్థిగా అనూహ్య విజయం సాధించిన మాలోత్ రాందాస్నాయక్ రాజకీయ జీవితం పరిశీలిస్తే ఆది నుంచి ఆటుపోట్లే. -
విజయుడా.. అందుకో హారతి
[ 04-12-2023]
గెలుపు అనంతరం ఖమ్మంలోని ఓట్ల కౌంటింగ్ కేంద్రం నుంచి సీఎల్పీ నేత భట్టివిక్రమార్క తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. -
వేంసూరు మండలంలో ఓట్ల ఆధిక్యత
[ 04-12-2023]
వేంసూరు మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మట్టా రాగమయికి 3007 ఓట్ల ఆధిక్యత లభించింది. -
లెక్కింపు కేంద్రంలో సందడి
[ 04-12-2023]
ఎన్నికల్లో గెలుపు ఓటములు అభ్యర్థులు, ఆయా పార్టీల శ్రేణులను భావోద్వేగానికి గురిచేశాయి. -
ప్రజా తీర్పును గౌరవిస్తా: పువ్వాడ అజయ్
[ 04-12-2023]
ఖమ్మం నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తానని భారాస అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ ఆదివారం తెలిపారు. -
నేతల హడావుడి.. కార్యకర్తల కోలాహలం
[ 04-12-2023]
శాసనసభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఆదివారం ముగిసింది. ఖమ్మం జిల్లాకు చెందిన ఐదు నియోజకవర్గాల కౌంటింగ్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 వరకు సాగింది. -
సింగరేణి గని కార్మికులు కాంగ్రెస్ వైపే..
[ 04-12-2023]
శాసనసభ ఎన్నికల్లో సింగరేణి గని కార్మికులు కాంగ్రెస్ పక్షానే నిలిచారు. -
71 ఏళ్ల తర్వాత తొలిసారి అధికార పక్షం
[ 04-12-2023]
ఇల్లెందు నియోజకవర్గం ఏర్పడిన 1952 నుంచి 2018 వరకు ప్రతి ఎన్నికలో స్థానికంగా గెలిచిన పార్టీ ప్రతిపక్ష స్థానానికే పరిమితమైంది. -
ఫిరాయింపుదారులకు పరాభవమే..
[ 04-12-2023]
పార్టీ ఫిరాయింపుదారులకు పరాభవం తప్పలేదు. ఉభయ జిల్లాల్లో 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, తెదేపా తరఫున గెలిచిన అనంతరం నాటి అధికార పార్టీ తీర్థం -
సత్తుపల్లి తొలి మహిళా ఎమ్మెల్యే రాగమయి
[ 04-12-2023]
సత్తుపల్లి నియోజకవర్గం తొలి మహిళా ఎమ్మెల్యేగా డాక్టర్ మట్టా రాగమయి నిలిచారు. -
నాలుగోసారీ పట్టువదలని భట్టి
[ 04-12-2023]
సీఎల్పీ నేత, మధిర కాంగ్రెస్ అభ్యర్థి మల్లు భట్టివిక్రమార్క వరుసగా నాలుగోసారి విజయం సాధించారు. -
స్వగ్రామంలో తమ్మినేనికి ఎదురుగాలి
[ 04-12-2023]
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి, పాలేరు అభ్యర్థి తమ్మినేని వీరభద్రానికి అతడి స్వగ్రామం తెల్దారుపల్లిలోనూ ఎదురుగాలి వీచింది. -
ఆ గ్రామంలో ఇద్దరు ఎమ్మెల్యేలు
[ 04-12-2023]
మండలంలోని గండుగులపల్లి గ్రామానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఓ ప్రత్యేకత ఉంది. -
ఖమ్మం నియోజకవర్గంలో రెండుసార్లు గెలిచింది వీరే!
[ 04-12-2023]
ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం 1952లో ఏర్పడగా ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వారు ఐదుగురు మాత్రమే ఉన్నారు. -
ఆరోసారి ఎమ్మెల్యేగా తుమ్మల నాగేశ్వరరావు
[ 04-12-2023]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనుభవజ్ఞుడైన నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.


తాజా వార్తలు (Latest News)
-
Israel: గాజాలో భూతల దాడుల్ని విస్తరించాం: ఐడీఎఫ్
-
Congress: అప్పటికప్పుడు కాంగ్రెస్ కండువా కప్పుకొని..
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Telangana Election Result: ఈసారి అత్యధికంగా అతివలు
-
Nalgonda: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం.. వ్యక్తి సజీవదహనం
-
Madhya Pradesh: మామా.. మజాకా!: కమలం గెలుపులో చౌహాన్ కీలక పాత్ర