Telangana news: అధ్యాపకుడి అకృత్యం
పాఠాలు బోధించి మంచి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఓ అధ్యాపకుడు విద్యార్థినులపైనే కన్నేశాడు. డబ్బు ఆశజూపి ఒకరిని శారీరకంగా లోబర్చుకున్నాడు.
విద్యార్థినిని శారీరకంగా లొంగదీసుకునే యత్నం
కొత్తగూడెం విద్యావిభాగం, న్యూస్టుడే: పాఠాలు బోధించి మంచి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఓ అధ్యాపకుడు విద్యార్థినులపైనే కన్నేశాడు. డబ్బు ఆశజూపి ఒకరిని శారీరకంగా లోబర్చుకున్నాడు. ఆమె సాయంతో అభంశుభం తెలియని మరో బాలికను బలవంతంగానైనా దారిలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. అసభ్య దృశ్యాల్ని వీడియోలో చిత్రీకరించి బెదిరించాలనుకున్నాడు. ఈ వైనం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చర్చనీయాంశంగా మారిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. కొత్తగూడెంలోని ఓ పారిశ్రామిక శిక్షణ కేంద్రంలో పట్టణానికి చెందిన వ్యక్తి (50) 2008 నుంచి కాంట్రాక్టు అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. గతేడాది కోర్సు పూర్తయిన ఓ విద్యార్థిని(20)కి డబ్బు, విలాస జీవితాన్ని ఆశజూపి శారీరకంగా లోబర్చుకున్నాడు. ఆమెది కూడా జిల్లా కేంద్రమే. చదువు పూర్తయిన తర్వాతా తరచూ శిక్షణ కేంద్రానికి వచ్చివెళ్తోంది. సదరు అధ్యాపకుడు ప్రస్తుతం ఇదే కళాశాలలో చదువుతున్న మరో విద్యార్థిని(17)పైనా కన్నేశాడు. పేదింటికి చెందిన ఆమెను తన దారికి తెచ్చుకునేందుకు పూర్వ విద్యార్థినినే పావుగా వాడుకోవాలనుకున్నాడు. తరచూ బాలికతో మాట్లాడించాడు. ‘సార్తో చనువుగా ఉంటే కావాల్సినంత డబ్బు ఇస్తాడు. బయటకు తీసుకెళ్తాడు. ఏ పనికావాలన్నా చేసిపెడతాడంటూ’ నమ్మబలికించాడు. ఈ క్రమంలో 4వ తేదీన శిక్షణ కేంద్రంలోని ఓ గదిలో బాలికతో పూర్వ విద్యార్థిని ఏకాంతంగా ఉండేలా ప్రణాళిక రూపొందించాడు. అసభ్యంగా ప్రవర్తించేలా చేసి ఆ దృశ్యాల్ని చరవాణిలో బంధించాడు. వాటి సాయంతో బాలికను శారీరకంగా లోబర్చుకోవాలన్నది ఆయన కుట్ర. ఆ దృశ్యాలు గత రెండ్రోజులుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. విషయం తెలిసిన ప్రిన్సిపల్ శుక్రవారం మధ్యాహ్నమే సిబ్బందితో సమావేశమై జరిగిన సంఘటనపై విచారణ చేశారు.
ప్రబుద్ధుడైన అధ్యాపకుడు, మరో ముగ్గురు విద్యార్థుల చరవాణుల్లో ఉన్న వీడియోలను గుర్తించారు. ‘డయల్-100’కు సమాచారమిచ్చారు. స్థానిక సీఐ రాజు వెంటనే అక్కడకు వచ్చారు. అధ్యాపకుడు, విద్యార్థులతో పాటు బాధిత బాలిక, పూర్వ విద్యార్థినిని వేర్వేరుగా విచారించారు. వీడియోలను చరవాణుల్లోంచి తొలగించారు. వారందరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. బోధనా వృత్తికే మచ్చతెచ్చేలా ప్రవర్తించిన అధ్యాపకుణ్ని విధుల్లోంచి తొలగించాలంటూ 5వ తేదీన వరంగల్ ఆర్జేడీ, హైదరాబాద్లోని పారిశ్రామిక విద్య కమిషనర్కు వేర్వేరుగా లేఖలు పంపినట్లు ప్రిన్సిపల్ ‘న్యూస్టుడే’కు తెలిపారు. పూర్వ విద్యార్థినితో అత్యంత సన్నిహితంగా ఉంటున్నట్లు తెలిసి గతంలోనూ మందలించామన్నారు. రెండు పర్యాయాలు షోకాజ్ నోటీసులు జారీ చేసినా మారలేదన్నారు. ప్రస్తుతం ఆయనకు ప్రత్యామ్నాయంగా వేరొకరితో బోధన చేయిస్తున్నామన్నారు. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర వీడియో వైరల్ చేసిన ముగ్గురు విద్యార్థులను వారం రోజులు సస్పెండ్ చేసినట్లు చెప్పారు. సీఐ రాజును సంప్రదించగా యాజమాన్యం సమాచారంతో కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. రాత పూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు అందలేన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను 5 రోజుల పోలీసుల కస్టడీకి నాంపల్లి కోర్టు అప్పగించింది. -
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
పార్ట్ టైమ్ ఉద్యోగాల స్కామ్లో 580 ఖాతాల్లోని రూ.32.34 కోట్లు అటాచ్ చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
రాష్ట్రంలో కలకలం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పెళ్లి కుమార్తెను తీసుకొచ్చేందుకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా
తెల్లవారితే తమ సమీప బంధువు ఇంట్లో జరిగే వివాహ వేడుకలో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఇంతలోనే జరిగిన ప్రమాదం ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. -
పహల్ ఫుడ్స్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
రాజేంద్రనగర్ పరిధి కాటేదాన్లోని పహల్ ఫుడ్స్ కంపెనీలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. -
మద్యానికి రూ.70 ఇవ్వలేదని కత్తిపోట్లు
మద్యం తాగేందుకు రూ.70 ఇవ్వలేదనే కారణంతో అందరూ చూస్తుండగానే స్నేహితుడిని కత్తితో పొడిచిన సంఘటన విజయవాడలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. -
చంద్రబాబు సభకు వెళ్లారని.. తెదేపా కార్యకర్తపై వైకాపా వర్గీయుడి దాడి
తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లాడన్న అక్కసుతో ఆ పార్టీ కార్యకర్తపై అధికార వైకాపా వర్గీయుడు దాడికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకొంది. -
సీఎంఆర్ఎఫ్ సొమ్ము రూ.10.50 లక్షలు స్వాహా
బాధితులకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్ఎఫ్) చెక్కుల సొమ్ము రూ.10.50 లక్షలను కాజేసిన నలుగుర్ని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్య ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని చీపురుబట్టీ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు- మావోయిస్టుల మధ్య బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య
తమిళనాడులోని మదురై నుంచి వచ్చి జనగామలో స్థిరపడిన దంపతులు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. జనగామ పట్టణ సీఐ రఘుపతిరెడ్డి ఈ వివరాలు తెలిపారు. -
ఫోన్లో గట్టిగా మాట్లాడొద్దన్నందుకు కుమారుడిపై తండ్రి దాడి
ఫోన్లో గట్టిగా అరుస్తూ మాట్లాడొద్దని చెప్పినందుకు ఓ తండ్రి తన కుమారుడిపై తీవ్రంగా దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన మహారాష్ట్రలోని నాగ్పుర్ జిల్లాలో చోటుచేసుకుంది. -
‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరిట టోకరా!
నిరుద్యోగుల బలహీనతలను ఆసరాగా చేసుకొన్న ఓ ముఠా ‘గ్రూప్-1’ ఉద్యోగాల పేరుతో పలువురికి టోకరా వేసిన వైనం వెలుగులోకి వచ్చింది. -
తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతి
తేనెటీగల దాడిలో పశువుల కాపరి మృతిచెందిన సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. -
13 క్వింటాళ్ల పేలుడు పదార్థాల పట్టివేత
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పోలీస్స్టేషన్ పరిధిలో 13 క్వింటాళ్ల పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. -
ఓక్రా, ఫైజల్ కస్టడీకి అనుమతి
పంజాగుట్ట డ్రగ్స్ కేసులో నిందితుడు నైజీరియా వాసి ఆంటోనియో ఒబింటా అలియాస్ ఓక్రాను నాలుగు రోజుల కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరనున్న కె.కేశవరావు, మేయర్ విజయలక్ష్మి
-
అనధికారిక లావాదేవీలపై యూజర్ల ఆందోళన.. స్పందించిన యాక్సిస్ బ్యాంక్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!