ప్రమాదాన్ని అంచనా వేయలేక..
చేపల వేటకు వెళ్లి గల్లంతయిన వ్యక్తిని వెతకాలన్నదే వారి మదిలో మెదిలింది. అక్కడే ప్రమాదం పొంచి ఉందని మాత్రం అంచనా వేయకపోయారు. దీంతో డీఆర్ఎఫ్ బృందంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు గల్లంతైన హృదయ విదారక ఘటన జిల్లాలో
నేలకొండపల్లి, న్యూస్టుడే
ముగ్గురు గల్లంతయిన ప్రదేశం ఇదే..
చేపల వేటకు వెళ్లి గల్లంతయిన వ్యక్తిని వెతకాలన్నదే వారి మదిలో మెదిలింది. అక్కడే ప్రమాదం పొంచి ఉందని మాత్రం అంచనా వేయకపోయారు. దీంతో డీఆర్ఎఫ్ బృందంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు గల్లంతైన హృదయ విదారక ఘటన జిల్లాలో గురువారం చోటు చేసుకుంది.
నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన పగడాల రంజిత్(26) పాలేరు ఏటిపై సుర్థేపల్లి చెక్డ్యాం వద్ద చేపలు పట్టేందుకు గురువారం ఉదయం వెళ్లి గల్లంతయ్యారు. స్థానికులు అతని కోసం తీవ్రంగా గాలించారు. ఎంతకీ ఆచూకీ దొరక్కపోవడంతో ఉన్నతాధికారులకు, ఎమ్మెల్యేకు సమాచారం ఇచ్చారు. ఖమ్మం కార్పొరేషన్కు చెందిన డీఆర్ఎఫ్ బృందాన్ని సాయంత్రం నాలుగు గంటలకు సుర్ధేపల్లి వచ్చేలా చర్యలు చేపట్టారు. రంజిత్ కోసం బృంద సభ్యులు పడిగెల వెంకటేశ్(29) అలియాస్ వెంకటేశ్వర్లు, బాశెట్టి ప్రదీప్(32) ఏటిలోకి దిగారు. వీరివురు చెక్డ్యాం వద్ద ప్రవాహ ఉద్ధృతికి ఈదలేకపోయారు. చెక్డ్యాం వద్ద నీరు బలంగా కిందకు వచ్చి మళ్లీ పైకి సుడులుగా తిరుగుతుండటంతో ఈదేందుకు ఇబ్బంది పడ్డారు. వీరిలో వెంకటేశ్వర్లు వంతెనపై నుంచి రక్షణ కోసం వేలాడదీసిన మోకు తాడును ఎక్కువగా నీటిలోకి తీసుకున్నాడు. నీటి ప్రవాహానికి ఆ తాడు వెంకటేశ్వర్లు కాళ్లకు చుట్టుకొని ఈదనివ్వకుండా చేసింది. దీంతో పైనున్న వ్యక్తులు ఆయన్ను రక్షించాలనే తొందరలో తాడు లాగగా ఆ తాడు బలంగా కాళ్లకు చుట్టుకొని ఈదలేక మృతి చెందాడు. అతని మృతదేహాన్ని స్థానికులు ఒడ్డుకు చేర్చారు. ఆయన లైఫ్ జాకెట్ వేసుకున్నప్పటికీ నీటి ప్రవాహానికి విడిపోయింది. ప్రదీప్ రక్షణ లేకుండా నేరుగా ఏటిలో దిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విషయం తెలుసుకున్న సూర్యాపేట, ఖమ్మం జిల్లాల ప్రజలు భారీగా ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఎస్సై స్రవంతి, ఎంపీడీవో జమలారెడ్డి, తహసీల్దార్ ధార ప్రసాద్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి, ఖమ్మం గ్రామీణ ఏసీపీ బస్వారెడ్డిలు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. సరైన రక్షణ చర్యలు లేకుండా, చెక్డ్యాం వద్ద నీటి ఉద్ధతిపై అవగాహన లేకుండా డీఆర్ఎఫ్ బృంద సభ్యులు దిగడం, అధికారులు వారి సామర్ధ్యాన్ని అంచనా వేయకుండా చర్యల్లో పాల్గొనాలని ఒత్తిడి చేయడంతోనే ఇలా జరిగిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. మృతదేహాన్ని పంచనామా కోసం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఉదయం గల్లంతైన రంజిత్, ప్రదీప్ ఆచూకీ ఇంకా దొరకలేదు. సహాయక చర్యల్లో చెన్నారం, సుర్థేపల్లి సర్పంచులు తోళ్ల వెంకటేశ్వర్లు, షేక్ మస్తాన్, నాయకులు కడియాల శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఆర్డీవో రవీంద్రనాథ్, డీపీవో హరిప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
* ప్రదీప్ది చింతకాని మండలం నాగులవంచ గ్రామం. ఇటీవలే డీఆర్ఎఫ్లో పొరుగుసేవల కింద చేరాడు. మృతునికి భార్య, ఓ కుమార్తె ఉన్నారు.
హైదరాబాద్లో శిక్షణ పొంది..
ఖమ్మం గ్రామీణం, న్యూస్టుడే: ఎంవీపాలెంకి చెందిన పడిగెల వెంకటేశ్ తండ్రి యాదగిరి 20 ఏళ్ల క్రితమే మరణించాడు. చిన్నప్పటి నుంచి తల్లి నాగలక్ష్మి కూరగాయలు అమ్ముకుంటూ తమ పిల్లలను పోషించింది. నాగలక్ష్మి ప్రస్తుతం ఖమ్మంలో ఇళ్లలో పని చేస్తు కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. వెంకటేశ్(వెంకటేశ్వర్లు) డిగ్రీ పూర్తి చేసి మూడేళ్ల క్రితమే ఖమ్మం నగరపాలక సంస్థలోని డీఆర్ఎఫ్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగంలో చేరాడు. అతనితోపాటు మరో ముగ్గురు యువకులు కూడా డీఆర్ఎఫ్లో ఉద్యోగంలో చేరారు. వీరికి ఉద్యోగంలో చేరే సమయంలో హైదరాబాద్లో వారం రోజులు శిక్షణను ఇచ్చినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగునీటిని తప్పనిసరిగా పరీక్షించాలి
[ 28-03-2024]
ప్రజలకు సరఫరా చేసే తాగునీటికి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని ఎంపీడీవో రామకృష్ణ సూచించారు. -
కార్యకర్తలకు అండగా ఉంటా: పాయం
[ 28-03-2024]
కార్యకర్తలకు నిత్యం అండగా ఉంటానని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. పినపాక మండలంలో గురువారం పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు
[ 28-03-2024]
పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వాహనాన్ని బయ్యారం అడ్డరోడ్డులోని ఎన్నికల తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు సోదా చేశారు. -
దుస్తుల పంపిణీ
[ 28-03-2024]
పినపాక మండల పరిధిలోని తోగ్గూడెం గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థులకు గ్రేస్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచితంగా దుస్తులు పంపిణీ చేశారు. -
కాంగ్రెస్లో చేరిన భారాస సొసైటీ డైరెక్టర్
[ 28-03-2024]
భారాసకు చెందిన కారేపల్లి సొసైటీ డైరెక్టర్ డేగల ఉపేందర్ గురువారం కాంగ్రెస్ లో చేరారు. -
కరవు తీరా పని..!
[ 28-03-2024]
కరవు పరిస్థితులతో వ్యవసాయ కూలీ పనులు దొరక్క తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న గ్రామీణులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దన్నుగా నిలుస్తోంది. -
మూడు ప్రైవేట్ ఆసుపత్రుల సీజ్
[ 28-03-2024]
ఖమ్మం నగరంలో మూడు ప్రైవేట్ ఆసుపత్రులను సీజ్ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాలతి తెలిపారు. ఉన్నతాధికారులకు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఖమ్మంలోని వివిధ ఆసుపత్రుల్లో బుధవారం తనిఖీచేశారు. -
‘గాడి’న పడకుంటే.. గత్తర గత్తర
[ 28-03-2024]
అనేక మంది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. కొన్ని మార్గాల్లో యువకులు పోటీలు పడుతూ ద్విచక్ర వాహనాలను అతివేగంతో వంకరటింకరగా నడుపుతున్నారు. -
ఆధ్యాత్మిక కారిడార్ ఏర్పాటుకు కృషి: తాండ్ర
[ 28-03-2024]
అయోధ్య-భద్రాద్రి ఆధ్యాత్మిక కారిడార్ ఏర్పాటుకు కృషి చేస్తామని ఖమ్మం లోక్సభ భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
డ్రాగన్ పండు.. లాభాలు మెండు
[ 28-03-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అనేక మంది ఔత్సాహికులు, విద్యాధికులు, యువ రైతులు సైతం సాగుకు ఆసక్తి చూపుతున్నారు. -
ఆ ఇద్దరు దోచేస్తున్నారు..!
[ 28-03-2024]
‘దేశీ శిక్షణలో భాగంగా అధికారులకు రూ.10వేలు చెల్లించి తరగతులకు హాజరయ్యాను. ఒక్కరోజు గైర్హాజరైతే రూ.3వేలు వసూలు చేశారు. -
ఆక్రమణల చెరలోనే సాగర్ కాల్వలు
[ 28-03-2024]
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ మధిర బ్రాంచి కెనాల్ పరిధిలో ఉన్న ఊటుకూరు, మధిర మేజర్ కాల్వలు కబ్జాకు గురయ్యాయి. -
మద్యం మత్తులో యువకుల హల్చల్
[ 28-03-2024]
చంద్రుగొండలో మద్యం మత్తులో ఐదుగురు యువకులు పలువురిపై దాడిచేసిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. -
నిలబడలేకున్నా.. ఆసరా అందించరూ..
[ 28-03-2024]
నిరుపేద దంపతులు రెక్కల కష్టమ్మీద ముగ్గురు కుమార్తెల్లో ఇద్దరి పెళ్లిళ్లు చేశారు. ఆ కుటుంబాన్ని అనారోగ్య సమస్యలు వెంటాడాయి. -
మద్యం తాగాడని ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుడి నిర్బంధం
[ 28-03-2024]
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు మద్యం తాగి విధులకు హాజరై విద్యార్థులను కొట్టాడని పాఠశాలలో ఉంచి తాళం వేసిన ఘటన చర్ల మండలంలో చోటుచేసుకుంది. -
రామయ్య హుండీలో కాసుల గలగల..!
[ 28-03-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలోని మూడు రకాల హుండీలు కాసులతో కళకళలాడాయి. 26 రోజుల హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. జనరల్ హుండీల ద్వారా రూ.71,22,878 సమకూరింది.
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం