ఆసరాపై ఆశలు..
జిల్లాలో సుదీర్ఘ కాలంగా ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఊరట కలిగించినట్లైంది. 2018 తర్వాత జిల్లాలో కొత్తగా ఒక్క పింఛన్ మంజూరు కాలేదు. కాలక్రమంలో లబ్ధిదారుల్లో
కేబినెట్ నిర్ణయంతో దరఖాస్తుదారుల్లో ఆనందం
ఖమ్మం సంక్షేమవిభాగం, న్యూస్టుడే: జిల్లాలో సుదీర్ఘ కాలంగా ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఊరట కలిగించినట్లైంది. 2018 తర్వాత జిల్లాలో కొత్తగా ఒక్క పింఛన్ మంజూరు కాలేదు. కాలక్రమంలో లబ్ధిదారుల్లో మరణిస్తే వారికి పింఛన్లు ఆపినప్పటికీ కొత్తగా మాత్రం ఎవరికీ ప్రభుత్వం మంజూరు చేయలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకొని నిరీక్షిస్తున్నారు. వారిలో దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, కళాకారులు, ఫైలేరియా బాధితులున్నారు. అధికారులు చుట్టూ తిరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో దరఖాస్తుదారులకు ఏం సమాధారం చెప్పాలో తెలియక మిన్నకుండిపోయేవారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 57ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి వృద్ధాప్య పింఛన్ ఇస్తామని ప్రకటించినప్పటికీ ఆచరణలో మాత్రం అది అమలు కాలేదు. అయినా వృద్ధులు వాటి కోసం అధికారుల చుట్టూ తిరిగేవారు. చాలా మంది పింఛన్దారులు వాటిపై ఆధారపడి జీవిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పింఛన్ల కోసం 23,294 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర కేబినేట్ భేటీలో స్వతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కొత్త పింఛన్లు మంజూరు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో దరఖాస్తుదారుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కరవు తీరా పని..!
[ 28-03-2024]
కరవు పరిస్థితులతో వ్యవసాయ కూలీ పనులు దొరక్క తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న గ్రామీణులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దన్నుగా నిలుస్తోంది. -
మూడు ప్రైవేట్ ఆసుపత్రుల సీజ్
[ 28-03-2024]
ఖమ్మం నగరంలో మూడు ప్రైవేట్ ఆసుపత్రులను సీజ్ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాలతి తెలిపారు. ఉన్నతాధికారులకు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఖమ్మంలోని వివిధ ఆసుపత్రుల్లో బుధవారం తనిఖీచేశారు. -
‘గాడి’న పడకుంటే.. గత్తర గత్తర
[ 28-03-2024]
అనేక మంది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. కొన్ని మార్గాల్లో యువకులు పోటీలు పడుతూ ద్విచక్ర వాహనాలను అతివేగంతో వంకరటింకరగా నడుపుతున్నారు. -
ఆధ్యాత్మిక కారిడార్ ఏర్పాటుకు కృషి: తాండ్ర
[ 28-03-2024]
అయోధ్య-భద్రాద్రి ఆధ్యాత్మిక కారిడార్ ఏర్పాటుకు కృషి చేస్తామని ఖమ్మం లోక్సభ భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
డ్రాగన్ పండు.. లాభాలు మెండు
[ 28-03-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అనేక మంది ఔత్సాహికులు, విద్యాధికులు, యువ రైతులు సైతం సాగుకు ఆసక్తి చూపుతున్నారు. -
ఆ ఇద్దరు దోచేస్తున్నారు..!
[ 28-03-2024]
‘దేశీ శిక్షణలో భాగంగా అధికారులకు రూ.10వేలు చెల్లించి తరగతులకు హాజరయ్యాను. ఒక్కరోజు గైర్హాజరైతే రూ.3వేలు వసూలు చేశారు. -
ఆక్రమణల చెరలోనే సాగర్ కాల్వలు
[ 28-03-2024]
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ మధిర బ్రాంచి కెనాల్ పరిధిలో ఉన్న ఊటుకూరు, మధిర మేజర్ కాల్వలు కబ్జాకు గురయ్యాయి. -
మద్యం మత్తులో యువకుల హల్చల్
[ 28-03-2024]
చంద్రుగొండలో మద్యం మత్తులో ఐదుగురు యువకులు పలువురిపై దాడిచేసిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. -
నిలబడలేకున్నా.. ఆసరా అందించరూ..
[ 28-03-2024]
నిరుపేద దంపతులు రెక్కల కష్టమ్మీద ముగ్గురు కుమార్తెల్లో ఇద్దరి పెళ్లిళ్లు చేశారు. ఆ కుటుంబాన్ని అనారోగ్య సమస్యలు వెంటాడాయి. -
మద్యం తాగాడని ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుడి నిర్బంధం
[ 28-03-2024]
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు మద్యం తాగి విధులకు హాజరై విద్యార్థులను కొట్టాడని పాఠశాలలో ఉంచి తాళం వేసిన ఘటన చర్ల మండలంలో చోటుచేసుకుంది. -
రామయ్య హుండీలో కాసుల గలగల..!
[ 28-03-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలోని మూడు రకాల హుండీలు కాసులతో కళకళలాడాయి. 26 రోజుల హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. జనరల్ హుండీల ద్వారా రూ.71,22,878 సమకూరింది.