నెత్తుటి మరక
కమ్యూనిస్టు కోటలో మళ్లీ నెత్తురు పారింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ రాజకీయ హత్య గ్రామంలో కలకలం రేపింది. తెరాస నాయకుడు తమ్మినేని కృష్ణయ్య(62) సోమవారం దారుణహత్యకు గురవ్వడంతో ఖమ్మం గ్రామీణం మండలం తెల్దారుపల్లి ఉలిక్కిపడింది.
తెల్దారుపల్లిలో 20 ఏళ్ల తర్వాత మళ్లీ రాజకీయ హత్య
ఈటీవీ, ఖమ్మం - ఖమ్మం గ్రామీణం, న్యూస్టుడే
హత్యకు కొద్ది సేపటి ముందు పొన్నెకల్లులో రైతువేదిక
వద్ద జాతీయ పతాకం ఎగరేస్తూ.
కమ్యూనిస్టు కోటలో మళ్లీ నెత్తురు పారింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ రాజకీయ హత్య గ్రామంలో కలకలం రేపింది. తెరాస నాయకుడు తమ్మినేని కృష్ణయ్య(62) సోమవారం దారుణహత్యకు గురవ్వడంతో ఖమ్మం గ్రామీణం మండలం తెల్దారుపల్లి ఉలిక్కిపడింది. ఊరూవాడా స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో మునిగి తేలుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కృష్ణయ్య తన సతీమణి మంగతాయితో కలిసి సోమవారం గ్రామంలో పలుచోట్ల పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్న కొద్దిగంటల్లోనే అతి కిరాతకంగా హత్యకు గురయ్యారు. పొన్నెకల్లు నుంచి గుర్రాలపాడులో కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
ఘటనా స్థలంలో తమ్మినేని కృష్ణయ్య మృతదేహం
పక్కా ప్రణాళికతో..: తన అనుచరుడు ముత్తేశం ద్విచక్ర వాహనం నడుపుతుండగా ఆయన వెనుక కూర్చున్నారు. వెనుక నుంచి ఆటోలో వస్తున్న దుండగులు ఆయన్ను వెంబడించారు. ఆటోలో మొత్తం ఆరుగురు రాగా వారిలో నలుగురు కృష్ణయ్యపై దాడికి పాల్పడ్డారు. మరో ఇద్దరు ఆటోలోనే ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసింది. ఘటనా స్థలానికి జాగిలాలతో చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరించారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో శవపరీక్ష అనంతరం మృతదేహాన్ని పోలీసులు తెల్దారుపల్లికి తరలించారు. పంద్రాగస్టు సంబురాల్లో అంతా మునిగి తేలడంతో దుండగులు ఇదే సరైన సమయమని భావించి పక్కా ప్రణాళికతో హత్యకు పాల్పడట్లు తెలుస్తోంది.
తమ్మినేని కృష్ణయ్యను రాజకీయ కక్షతోనే దారుణంగా హత్యచేశారు. గతంలోనూ చంపుతామని బెదిరించారు. మా దగ్గరికి ఎవరు వచ్చినా బెదిరిస్తున్నారు. మూడేళ్ల క్రితం ఎంపీటీసీగా స్వతంత్రంగా గెలుపొందడం వల్లే కక్ష పెంచుకున్నారు. ఈ ఘటనకు బాధ్యుల్ని వెంటనే అరెస్టు చేసి మాకు న్యాయం చేయాలి. కృష్ణయ్య భార్య మంగతాయి, కుమార్తె రజిత
దోషుల్ని కఠినంగా శిక్షించాలి
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మృతదేహానికి నివాళులర్పిస్తున్న తుమ్మల
ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో కృష్ణయ్య మృతదేహానికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెల్దారుపల్లిలో కృష్ణయ్య కుటుంబీకులను పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ స్వాతంత్య్ర స్ఫూర్తికి విరుద్ధంగా ఈ దారుణానికి పాల్పడ్డ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజల మనిషిగా ఉన్న కృష్ణయ్య కిరాతకంగా హత్య చేయడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. రక్తపుటేరులు పారిన ఖమ్మం చుట్టుపక్కల ప్రాంతాలు ప్రస్తుతం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. ఈ క్రమంలో కొన్ని పార్టీలకు ప్రజలు తిలోదకాలు ఇస్తుండటంతోనే అసహనంతోనే ఇలాంటి దారుణానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. గత 40 ఏళ్లలో హత్యలకు, నెత్తుటి ధారలకు నిలయమైన ఖమ్మం ప్రాంతాన్ని అవకాశం వచ్చినప్పుడల్లా ప్రశాంతంగా ఉంచేందుకు కృషి చేశానన్నారు. అభివృద్ధిలో సమాజం ముందుకెళ్లాలంటే హత్యా రాజకీయాలు తగవన్నారు. హత్యా రాజకీయాలతో కుటుంబాలు, ప్రాంతాలు అభివృద్ధి సాధించలేవన్నారు.
నేతల నివాళి: ఖమ్మం ఆస్పత్రి శవాగారం వద్ద కృష్ణయ్య మృతదేహానికి ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నాయకుడు సాధు రమేశ్రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు రాయల నాగేశ్వరరావు నివాళులు అర్పించారు.
ఎంపీ నామా నాగేశ్వరరావు చరవాణిలో కృష్ణయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కేసు నమోదు
ఈ ఘటనపై ఖమ్మం గ్రామీణ ఠాణాలో సోమవారం కేసు నమోదైంది. తెల్దారుపల్లికి చెందిన రంజాన్, కృష్ణస్వామి, లింగయ్య, కృష్ణ, నాగేశ్వరరావు, శ్రీను, నాగయ్య, మరికొంత మంది కలిసి కత్తులు, వేటకొడవళ్లు, గొడ్డళ్లతో విచక్షణా రహితంగా తన తండ్రిని నరికి చంపారని, తమ్మినేని కోటేశ్వరరావు కుట్రపన్ని పథకం ప్రకారం హత్య చేయించారని కృష్ణయ్య కుమారుడు నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏన్కూరులో హనుమాన్ శోభాయాత్ర
[ 23-04-2024]
ఏన్కూర్లో హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల భక్తులు టీఎల్ పేట రామాలయానికి చేరుకొని అక్కడ నుంచి 10 కి.మీ శోభాయాత్రతో పాటు ద్విచక్ర వాహన ప్రదర్శన నిర్వహించారు. -
భాగ్యనగర్ తండాలో బోనాల వేడుక
[ 23-04-2024]
భాగ్యనగర్ తండాలో బోనాల వేడుకను మంగళవారం వైభవంగా నిర్వహించారు. -
పార్లమెంట్ ఎన్నికల్లో భారాస అత్యధిక స్థానాలు విజయం
[ 23-04-2024]
మహబూబాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత నామినేషన్ కార్యక్రమానికి వెళ్లేందుకు ఇల్లందుకు చేరుకున్న పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారాస నాయకులు దిండిగల రాజేందర్ ఆధ్వర్యంలో స్వాగతం -
ఏది నిజం?.. సోషల్ మీడియాలో సమాచార వ్యాప్తిపై ఈసీఐ సూచనలివీ..
[ 23-04-2024]
ఎన్నికలోస్తే చాలు, సామాజిక మాధ్యమాల్లో కుప్పలుతెప్పలుగా సమాచారం వచ్చిపడుతుంది. వాటిల్లో పుకార్లు ఏవి? తప్పుదోవ పట్టించేవి ఏవి? నిజమైన సమాచారం ఏదో తెలియక ఓటర్లు తికమకపడుతుంటారు. -
బరిలో నిలవాలంటే.. పరిశీలన దశ దాటాల్సిందే!
[ 23-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ)కి అఫిడవిట్లు సమర్పించారు. -
ప్రాదేశిక ఎన్నికలకు రంగం సిద్ధం
[ 23-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన సామగ్రి సమకూర్చుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి పంచాయతీరాజ్ కమిషనర్ సహా జిల్లా పరిషత్లకు సూచనలందాయి. -
రైతులకు అండగా ఉంటాం: నామా
[ 23-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీరికి భారాస అండగా ఉంటుందని ఆపార్టీ ఖమ్మం లోక్సభ స్థానం అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. -
గ్యారంటీలు నమ్మి మోసపోకండి: తాండ్ర
[ 23-04-2024]
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను నమ్మి ఓటర్లు మోసపోవద్దని, దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్న భాజపాను ఆదరించాలని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు పేర్కొన్నారు. -
సెలవులొచ్చాయ్.. ప్రణాళికలు ఖరారయ్యాయ్!
[ 23-04-2024]
ఈవిద్యా సంవత్సరం నేడు (మంగళవారం) ముగియనుంది. పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం బుధవారం నుంచి వేసవి సెలవులు ప్రకటించింది. ఈనేపథ్యంలో ప్రభుత్వ బడుల బలోపేతంపై దృష్టి సారించింది. -
పది మందిలో ఐదుగురు స్థానికేతరులే..
[ 23-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానానికి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా పది మంది గెలిచారు. వీరిలో ఐదుగురు స్థానికేతరులు కావటం విశేషం. -
అకాల వర్షంతో 700 ఎకరాల్లో పంట నష్టం
[ 23-04-2024]
జిల్లాలో ఆదివారం సాయంత్రం వీచిన ఈదురు గాలులతో కొత్తగూడెం, సుజాతనగర్, చుంచుపల్లి ,లక్ష్మీదేవిపల్లి, ఇల్లెందు, టేకులపల్లి, అశ్వారావుపేట, పినపాక, కరకగూడెం మండలాల్లో సుమారు 700 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు డీఏఓ బాబురావు సోమవారం తెలిపారు. -
‘పది’ విద్యార్థులు ఫలితాలపై ఒత్తిడి చెందొద్దు
[ 23-04-2024]
పదో తరగతి పరీక్ష ఫలితాలు ఎలా ఉన్నా విద్యార్థులు మానసిక ఒత్తిళ్లకు గురికావొద్దని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.జేవీఎల్ శిరీష సోమవారం ఒక ప్రకటనలో సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ