ఐఏఎస్ చూపిన బాటలో..సర్కారీ కొలువుల్లో
ఆమెకు మొత్తం 9 మంది సంతానం. ఒక్కరు మినహా అందరూ ఆడవాళ్లే. ఒక్కగానొక్క కుమారుడు కలెక్టర్ కావాలన్నది ఆ తల్లి ఆశ. ఐఏఎస్ కావాలన్న కన్నతల్లి ఆశయాన్ని సాధించేందుకు ఆ కుమారుడు ఎంతో కష్టపడ్డారు. ఏకంగా 8 కొలువులు దక్కించుకున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు కేరాఫ్.. సర్వారం
ఆమెకు మొత్తం 9 మంది సంతానం. ఒక్కరు మినహా అందరూ ఆడవాళ్లే. ఒక్కగానొక్క కుమారుడు కలెక్టర్ కావాలన్నది ఆ తల్లి ఆశ. ఐఏఎస్ కావాలన్న కన్నతల్లి ఆశయాన్ని సాధించేందుకు ఆ కుమారుడు ఎంతో కష్టపడ్డారు. ఏకంగా 8 కొలువులు దక్కించుకున్నారు. చివరకు ఐఏఎస్గా ఎంపికై తల్లి నమ్మకాన్ని నిలబెట్టారు. ఆయన పట్టుదల ఆ ఊరికే స్ఫూర్తిగా నిలిచింది. ఒకటా.. రెండా.. ఏకంగా 260కిపైగా సర్కారీ కొలువులు సాధించారు. ప్రైవేటు ఉద్యోగాలు వీటికి అదనం. ప్రభుత్వ కొలువులకు కేరాఫ్గా నిలిచిన సర్వాద్రి తండా అలియాస్ సర్వారం విజయబావుటాపై ‘న్యూస్టుడే’ ప్రత్యేక కథనం.
మన్యం ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధిక ప్రభుత్వ కొలువులు సాధించిన తండాలో సర్వారం ముందువరుసలో నిలుస్తుంది. సుజాతనగర్ మండలంలోని ఈ గ్రామంలో 960 గృహాలు, 3,505 జనాభా ఉన్నారు. అక్షరాస్యత శాతం 95 శాతం. అన్ని కుటుంబాల నేపథ్యం వ్యవసాయమే. కనాకష్టం చేసి పిల్లలను ఉన్నత చదువులు చదివించిన వారెందరో ఉన్నారు. తమలా కాయకష్టం చేయలేని పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా వారెంతో ప్రోత్సహించారు. ఇలా సుమారు 260 మంది సర్కారీ కొలువుల్లో చేరడం విశేషం. వీరిలో ఐఏఎస్ నుంచి అటెండర్ స్థాయి వారు ఉండగా... ఇస్రో శాస్త్రవేత్త, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎనర్జీ, ఆర్మీ, బ్యాంకింగ్, టెలీ కమ్యూనికేషన్స్, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, చార్టెడ్ అకౌంటెంట్లు వంటి పోస్టుల్లో రాణిస్తున్నవారు చాలా మంది ఉన్నారు.
ఊరి కోసం కలసికట్టుగా..
కేవలం జీవితాల్లో స్థిరపడటమే కాదు.. పుట్టిన ఊరు కన్నతల్లితో సమానమని ప్రభుత్వ ఉద్యోగులంతా భావించారు. తమ గ్రామం అభివృద్ధి కోసం ఓ కమిటీగా ఏర్పడ్డారు. అభివృద్ధి, ఇతర కార్యక్రమాలకు అండగా నిలుస్తున్నారు. తమలాగే యువత కొలువులు దక్కించుకునేందుకు మార్గనిర్దేశనం చేస్తున్నారు. వారికి కావాల్సిన సహకారాన్ని అందజేస్తున్నారు. 20 వేల పోటీ పుస్తకాలతో ప్రత్యేక గ్రంథాలయం ఏర్పాటు చేశారు. శుద్ధజలాలు అందించే ప్లాంటు నిర్మించారు. రోడ్లు, ఇతర వసతుల కల్పనకు ఆర్థికసాయం చేస్తున్నారు. కోదండ రామాలయం అభివృద్ధికి విరాళాలు విరివిగా అందించారు. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా.. ఎన్ని ఒత్తిళల్లో ఉన్నా.. శ్రీరామ నవమి రోజు స్వామివారి కల్యాణానికి ఉద్యోగులంతా హాజరుకావడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజు ఊరంతా పండుగ వాతావరణం కనిపిస్తుంది.
అమ్మ కలను నిజం చేసేందుకు ఐఏఎస్ అయ్యా: - మాలోతు చంపాలాల్, రాష్ట్ర హోం కార్యదర్శి (సైనిక్ వెల్ఫేర్)
అమ్మకోరిక తీర్చాలని ఐఏఎస్ సాధించా. మాది గిరిజన తండా. అమ్మ పేరు మంగమ్మ. మొత్తం 9 మంది సంతానం. అందరూ ఆడవారు కాగా.. నేనొక్కడినే మగ సంతానం. అందరికన్నా పెద్దవాణ్ని. ఎలాగైనా కలెక్టర్ కావాలన్నది అమ్మ కోరిక. విద్యాభ్యాసం మొత్తం ప్రభుత్వ విద్యాలయాల్లో సాగింది. ఆ తర్వాత 8 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించా. తొలుత ఆర్డీవో కొలువులో చేరా. చివరగా 1994లో ఐఏఎస్గా ఎంపికయ్యా. కలెక్టర్ ఉద్యోగం సాధించినప్పటి నుంచి ఎంతో మంది నిరుద్యోగ యువతకు ప్రేరణగా నిలిచా. వారు సైతం ఆసక్తి ఉన్న ఉద్యోగాలు సాధించేలా ప్రోత్సహించా. పలు అభివృద్ధి పనులకు సహకారం అందిస్తున్నాను. గ్రామ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం ఆనందంగా ఉంది. రాష్ట్ర హోం కార్యదర్శిగా (సైనిక్ వెల్ఫేర్) విధులు నిర్వహిస్తున్న నేను ఈ నెల 31న పదవీ విరమణ పొందుతున్నా. విరమణ పదవికే.. ప్రోత్సాహం, సేవా కార్యక్రమాలకు మాత్రం కాదు.
గిరిజన బిడ్డగా గర్విస్తున్నా..
- భూక్యా జైత్రాం, సింగరేణి వైద్యుడు
పేదలకు నా వంతుగా సేవ చేయాలని తల్లిదండ్రుల కోరిక మేరకు ఎంబీబీఎస్ చదివా. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యాభ్యాసం కొనసాగింది. ఒక గిరిజన బిడ్డగా కొత్తగూడెం సింగరేణి వైద్యశాలలో సేవలందిస్తుండటం.. ఈ వృత్తిలోకి చేరిన మన్యం ప్రాంత తొలి వ్యక్తిని నేనే కావడం గర్వంగా ఉంది. వైద్యుడిగా ఎంతో మందిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడగలగడం దేవుడు నాకిచ్చిన వరంగా భావిస్తున్నాను.
అన్న ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి
- మాలోతు సుజాత, తహసీల్దార్
ఐఏఎస్ అధికారి చంపాలాల్ నా సోదరుడు. ఆయన ప్రోత్సాహంతో చదువుల్లో రాణించి సచివాలయంలో ఉద్యోగం సాధించాను. తాను ఉద్యోగం చేస్తూనే 8 మంది సోదరీమణులను ఎంతో ప్రోత్సహించేవారు. మరో సోదరి ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం నేను పదోన్నతిపై సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల తహసీల్దార్గా విధులు నిర్వర్తిస్తున్నారు. మారుమూల గిరిజన గ్రామమే అయినా.. అత్యధిక మంది ప్రభుత్వ ఉద్యోగులుగా విజయం సాధించడం గర్వంగా ఉంది. ఒకరిని చూసి మరొకరు స్ఫూర్తిపొందుతూ విజయం సాధించడం సంతోషంగా ఉంది.
ఉపాధ్యాయులే స్ఫూర్తిగా ఈ వృత్తిలోకి
శారద, ప్రభుత్వ టీచర్
మా ఉపాధ్యాయుల్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ వృత్తిలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నా. చివరకు అమ్మానాన్నల ప్రోత్సాహంతో 1999 డీఎస్సీలో టీచర్ కొలువు సాధించా. నా కంటే ముందు ఎంతో మంది గ్రామస్థులు ఉన్నత స్థానంలో నిలిచారు. సందర్భోచితంగా వారిని కలిసినప్పుడు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. ఓ తండా నుంచి అత్యధిక మంది సర్కారీ కొలువులు సాధించిన జిల్లాలోనే గుర్తింపు దక్కించుకోవండం సంతోషంగా ఉంది. మా గ్రామం మాదిరిగా మిగతా వారూ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా.
ఏఏ శాఖలో ఎంతమంది
ఉపాధ్యాయులు: 105
సింగరేణి: 52
అటవీశాఖ: 35
వైద్యశాఖ: 20
పోలీసు విభాగం: 10
విద్యుత్తు రంగం: 10
రెవెన్యూ, పీఆర్
ఇతర శాఖల్లో: 28
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే
[ 29-03-2024]
ఖమ్మం జిల్లా ఏన్కూర్లో గుడ్ ఫ్రైడేను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఏన్కూర్లో ఆర్సీఎం చర్చి నుంచి ప్రార్థనలు చేస్తూ సిలువ మార్గంగా టీఎల్ పేట చర్చి వరకు చేరుకున్నారు. -
సార్వత్రిక సమరం.. సిబ్బంది సిద్ధం..!
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై ఈసీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఓటరు నమోదు నుంచి అభ్యర్థుల నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ వరకు ప్రతి ఘట్టంలో అధికారులు, ఎన్నికల సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తారు. -
దండుకున్నారు.. తిప్పించుకుంటున్నారు..!
[ 29-03-2024]
కొత్తగూడెం నియోజకవర్గంలో ‘దళితబంధు’ పేరిట భారీగా వసూళ్ల పర్వం సాగింది. ఒక్కొక్కరి నుంచి ఏకంగా రూ.3 లక్షలు దండుకున్నారు. ఈవ్యవహారంలో అప్పటి ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు, పురపాలికలోని కొంతమంది ప్రజాప్రతినిధులు కీలకంగా వ్యవహరించారు. -
అసైన్డ్ భూముల్లో కట్టడాల కూల్చివేత
[ 29-03-2024]
ఖమ్మం నగరంలోని 8వ డివిజన్ వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలో అసైన్డ్ భూముల్లో అసలు యజమానులు కాకుండా కొనుగోలు చేసినవారు చేపట్టిన నిర్మాణాలను రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు గురువారం కూల్చివేశారు. -
పిండం దశలోనే పిసికేస్తున్నారు!
[ 29-03-2024]
ఆరోగ్య సమస్యలకు చికిత్స అందిస్తామని అనుమతులు తీసుకున్న ఆస్పత్రిలో గర్భవిచ్ఛిత్తికి పాల్పడుతున్నారు. ధనార్జన కోసం అనైతిక వైద్యం చేస్తూ పిండ దశలోనే ప్రాణాలు తీసేస్తున్నారు. -
అటు సాధన.. ఇటు శోధన
[ 29-03-2024]
రూ.15వేల రుణం కోసం ఆశపడిన ఐదుగురు మహిళలు, తెలియకుండానే తమ ఖాతాల ద్వారా రూ.కోట్ల లావాదేవీలు నడిపారు. నమ్మించిన యువకుడు ఒక బ్యాంకు ఖాతా పేరు చెప్పి, మరో బ్యాంకు ఖాతా తెరచి మోసగించాడని ఆలస్యంగా గ్రహించారు. -
‘సైబర్’ దోపిడీ సొమ్ము.. అమాయకుల ఖాతాలకు!
[ 29-03-2024]
సైబర్ నేరస్థులు అమాయకుల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారని, వాటి సాయంతో లూటీ సొమ్మును వాడుకుంటున్నారని ఎస్పీ బి.రోహిత్రాజు గురువారం తెలిపారు. -
ఎండల గండాలకు జాగ్రత్తలే గొడుగు
[ 29-03-2024]
మార్చి నెలలోనే ఎండలు ముదిరాయి. వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని సింగరేణి, పలు పరిశ్రమల ప్రభావిత ప్రాంతాల్లో వేడి ఇంకొంచెం ఎక్కువగా ఉంటోంది. -
అప్పుల బాధతో యువరైతు బలవన్మరణం
[ 29-03-2024]
పంటల దిగుబడి సరిగా రాలేదన్న మనస్తాపంతో ఓ యువరైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకుపాల్పడ్డాడు. పాల్వంచ గ్రామీణ ఎస్సై బి.శ్రీనివాస్ కథనం ప్రకారం.. మండలంలోని యానంబైలు గ్రామానికి చెందిన మంత్రి శశికుమార్ (26) నాలుగెకరాల్లో పత్తి, అయిదు ఎకరాల్లో వరి సాగు చేశాడు. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగుపయనమయ్యారు. -
మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, కొరియర్ అరెస్టు
[ 29-03-2024]
నిషేధిత సీపీఐ మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ బి.రోహిత్రాజు తెలిపారు. గురువారం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. -
9 నుంచి శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు
[ 29-03-2024]
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 9 నుంచి 23 వరకు జరిగే శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేపట్టాలని ఆర్డీఓ దామోదర్రావు ఆదేశించారు. రామాలయం ఈఓ రమాదేవితో కలిసి తన కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుంది: కేటీఆర్
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు