నిధులు వెనక్కి.. సమస్యలు మొదటికి..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చీపురు కొనుగోలు చేయడానికీ సమస్యే. కనీసం ఫ్యాను మరమ్మతుకూ నెలలు గడపాల్సిన దుస్థితి. జిల్లాలో 5 యూపీహెచ్సీలు, ఒక జిల్లా ఆసుపత్రి, ఒక ఏరియా ఆసుపత్రి, 4 సీహెచ్సీలు, 29 పీహెచ్సీలు ఉన్నాయి. ప్రతి పీహెచ్సీకి ఆసుపత్రి
ఇదీ పాల్వంచ మండలం ఉల్వనూరు పీహెచ్సీలో ఇన్వర్టర్లు. ఇవి మరమ్మతులకు గురయ్యాయి. రూ.2 వేలు వెచ్చించి చిన్నపాటి మరమ్మతులు చేస్తే వినియోగంలోకి వస్తాయి. కానీ నిధుల కొరతతో వీటన్నింటిని పట్టించుకోవడం మానేశారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చీపురు కొనుగోలు చేయడానికీ సమస్యే. కనీసం ఫ్యాను మరమ్మతుకూ నెలలు గడపాల్సిన దుస్థితి. జిల్లాలో 5 యూపీహెచ్సీలు, ఒక జిల్లా ఆసుపత్రి, ఒక ఏరియా ఆసుపత్రి, 4 సీహెచ్సీలు, 29 పీహెచ్సీలు ఉన్నాయి. ప్రతి పీహెచ్సీకి ఆసుపత్రి అభివృద్ధి నిధులు (హెచ్.డీ.ఎస్.), అన్టైడ్ నిధులు ప్రతి ఏటా రూ.87 వేల చొప్పున నిధులు విడుదలయ్యేవి. కరోనా కారణంగా రెండేళ్ల నుంచి ఆ నిధులు సైతం రావట్లేదు. పోనీ.. అంతకు ముందు విడుదలైన డబ్బుల్ని సద్వినియోగం చేసుకున్నారా అంటే అదీ లేదు. ఫలితంగా జిల్లాలోని ఆస్పత్రులకు సంబంధించిన నిధుల్ని ప్రభుత్వం మూణ్నెల్ల క్రితమే వెనక్కు తీసుకుంది. కానీ తీర్మానాలు చేసి అందజేస్తే కావాల్సిన నిధులు అందిస్తామన్నది జిల్లా అధికారుల భరోసా.
ఇదీ.. సంగతి..
జిల్లా కేంద్రం నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వరకు బ్యాంకుల ఖాతాల్లో రెండేళ్ల క్రితం వరకు మొత్తం రూ.1,24,31,724 నిధులు ఉన్నాయి. వాటిని వినియోగించుకోకపోవడం వల్ల మూణ్నెల్ల క్రితం ప్రభుత్వం వెనక్కు తీసుకుంది. ఆ నిధుల్లో ఆసుపత్రి అభివృద్ధి నిధులు (హెచ్.డి.ఎస్.) రూ.22,30,455, అన్టైడ్ (నాన్ హెచ్డీఎస్) 1,02,01,269 ఉన్నాయి. సమస్యలున్నా వైద్యాధికారులు తమ ఆస్పత్రులకు సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో నిల్వలను వినియోగించకపోవడం గమనార్హం. నిధుల ఖర్చు ప్రక్రియతో పాటు బిల్లులు, ఆడిట్, ఏమైనా తప్పులుదొర్లితే శాఖాపరమైన చర్యలు తప్పవన్న ధోరణే వాటిని వదిలేయడానికి కారణమనే వాదన వినిపిస్తోంది.
మంగపేటలో అధ్వానంగా ఉన్న మరుగుదొడ్లు
ఇలా వినియోగించవచ్చు
* హెచ్డీఎస్ నిధులతో పీహెచ్సీలో వసతులు సమకూర్చుకోవచ్చు. మరమ్మతులు చేయించుకోవచ్చు. అత్యవసర వైద్యానికి మందులు కొనుగోలు చేయొచ్చు. కానీ ఇందుకోసం సమావేశం నిర్వహించాలి. హెచ్డీఎస్ కమిటీలో జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీటీ ఎంపీడీవో, ఎమ్మార్వో, డిప్యూటీ డీఎంహెచ్వో, స్థానిక వైద్యుడు తదితరులుంటారు. తీర్మానం జిల్లా అధికారులకు పంపించాలి. అక్కడ ఆమోదం లభిస్తే నిధులొస్తాయి. వైద్యుడు తొలుత ఖర్చు పెడితే ఆ తర్వాత ఉన్నతాధికారులు చెల్లిస్తారు. ఈ క్రమంలో కొంత కోత పడే అవకాశం ఉండటంతో ఎవరూ ముందస్తుగా వ్యయం చేయడానికి సాహసించట్లేదు. ఒక్కో పీహెచ్సీలో కనీసం రూ.10 వేల నుంచి రూ.30 వేలు అవసరం ఉండటంతో చాలా మంది వెనుకంజ వేస్తున్నారు.
* ఉపకేంద్రాలలో గర్భిణులకు పరీక్షలు చేయడానికి కనీసం సామగ్రి ఉండటంలేదు. అన్టైడ్ నిధులు వెనక్కి వెళ్లడంతో సమస్యలు పరిష్కరించుకునే అవకాశం లేకుండా పోయింది.
డీఎంహెచ్వో దయానంద స్వామి ఏమన్నారంటే.. ‘నిధులు ప్రభుత్వం తిరిగి తీసుకున్న మాట వాస్తవమే. కానీ ఎవరైనా ఆస్పత్రి సిబ్బంది తీర్మానం చేసి పంపితే నిధులు వెంటనే మంజూరు చేస్తాం’.
వేధించే సమస్యలెన్నో...
* పాల్వంచ మండలం ఉల్వనూరు, జగన్నాథపురంలోని పీహెచ్సీలలో ఇన్వర్టర్లు, ఆర్వో ప్లాంటు పనిచేయట్లేదు.
* జగన్నాథపురంలో భవనం కురిసి ఫ్యాన్లు కాలిపోయాయి. కంప్యూటర్ పనిచేయడం లేదు. కిన్నెరసాని ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలకు గేట్లు లేవు.
* రేగళ్లలో సోలార్ సమస్యలు ఉన్నాయి. వీటిని డబ్బుల్లేక పనిచేయట్లేదు.
* ఆళ్లపల్లిలో ఆర్వోప్లాంట్ పనిచేయట్లేదు. బాటిళ్లు తెప్పించి రోగులకు అందిస్తున్నారు. ఇటీవల వైరింగ్ పనులు చేయించారు. ఇందుకోసం వైద్యసిబ్బంది నిధులు వెచ్చించినట్లు తెలుస్తోంది.
* ములకలపల్లి మండలం మంగపేట ఆస్పత్రిలో మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. కిచెన్షెడ్డు అధ్వానంగా ఉండటంతో కూల్చారు. తాగునీటి సమస్య కూడా ఉంది. స్థానిక వైద్యులు కొన్ని పనులకు సొంత డబ్బులు వెచ్చించారు.
* చర్ల మండలం కొయ్యూరులో పీహెచ్సీకి ప్రహరీ లేదు.
* పినపాక పీహెచ్సీ 24 గంటల ఆసుపత్రి. ఏడాదికి 100 కాన్పులు చేస్తారు. ఇక్కడ తాగునీటి సమస్య ఉంది. మరుగుదొడ్లు లేవు. పాత బిల్డింగ్ కురుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బదిలీ పొందిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలి
[ 19-04-2024]
గత విద్యా సంవత్సరంలో బదిలీ పొంది రిలీవర్ లేనందున రిలీవ్ చేయని ఉపాధ్యాయులను వెంటనే వారు బదిలీ పొందిన స్థానంలో నియమించాలని తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భానోత్ వీరు నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. -
విజేతలకు బహుమతులు అందజేత
[ 19-04-2024]
పొన్నేల్లో బోడేపూడి ట్రస్ట్ ద్వారా మండల స్థాయి క్రికెట్ పోటీలు అంబేద్కర్ యువ మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. -
తాటి చెట్టు పైనుంచి పడి కల్లుగీత కార్మికుడి మృతి
[ 19-04-2024]
ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
జగాలను ఏలిన రామయ్యకు పట్టాభిషేకం
[ 19-04-2024]
ధర్మమే ఆకారం దాల్చిన రామావతారుడు భద్రగిరిలో కొలువై ఉండగా తక్కువేమి మనకు అంటూ కోలాటాలు ఆడారు. -
తొలిరోజు ఖమ్మంలో ఒకటే నామినేషన్
[ 19-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో తొలిరోజు గురువారం ఒక నామపత్రం దాఖలైంది. అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఆదార్) పార్టీ తరఫున ముదిగొండ మండలం గంధసిరికి చెందిన కుక్కల నాగయ్య ఒక సెట్ నామపత్రాలను ఆర్ఓ గౌతమ్కు అందజేశారు -
ఏ పత్రం.. ఏం చెబుతుందంటే..?
[ 19-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రకటన గురువారం వెలువడింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫాం-1 ద్వారా ఆయా స్థానాల్లో నోటీసు జారీ చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లను గురువారం నుంచే స్వీకరిస్తున్నారు. -
అడుగంటిన జలం.. అపర భగీరథ ప్రయత్నం
[ 19-04-2024]
అడుగంటిన భూగర్భజలాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో కొందరు రైతులు పామాయిల్ సాగు చేశారు. -
18లో మేలుకొలుపు ప్రజాస్వామ్య గెలుపు
[ 19-04-2024]
ప్రజాస్వామ్య ఎన్నికల్లో యువ ఓటర్ల చైతన్యమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం వినూత్న ప్రయోగాలు చేస్తోంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కొత్తగా చేపట్టే కార్యక్రమం.. ‘టర్నింగ్-18’. అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నిక ప్రక్రియలో ఏ ఒక్కఓటరూ వెనకబడకుండా చూడటమే అంతిమ లక్ష్యం. -
బేతుపల్లి అంకమ్మతల్లి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి
[ 19-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బేతుపల్లి అంకమ్మ తల్లి తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మవారిని ఊరేగించే రథాలను సిద్ధం చేశారు. -
ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
[ 19-04-2024]
జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో క్రోధి నామ సంవత్సర వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. స్వామి వారికి ప్రాతఃకాల అర్చనల అనంతరం యజ్ఞశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు -
సోనియా రుణం తీర్చుకోవాలి: మంత్రి తుమ్మల
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ అగ్రనేత సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు -
గుళికల మందు మింగి బలవన్మరణం
[ 19-04-2024]
గుళికల మందు మింగి ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ నాగేశ్వరరావు కథనం ప్రకారం.. అశ్వారావవుపేట కోతమిషన్ బజారులో కూలీ పనులు చేస్తూ జీవించే బమ్మిడి సాంబయ్య(62)కు పదిహేనేళ్ల కిందట కడుపు పైభాగంలో కణితి ఏర్పడింది -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
[ 19-04-2024]
రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన జూలూరుపాడు మండలం సాయిరాంతండా వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది
తాజా వార్తలు (Latest News)
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..
-
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్