భూపతిరావు.. రెండేళ్లు ఎమ్మెల్యేగా
అనారోగ్యంతో కన్నుమూసిన సీపీఐ మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు 1983 నుంచి 1985 వరకు పాలేరు శాసనసభ్యుడిగా పనిచేశారు. 1983లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్రవ్యాప్తంగా ప్రభంజనం
భీమపాక భూపతిరావు
కూసుమంచి, న్యూస్టుడే: అనారోగ్యంతో కన్నుమూసిన సీపీఐ మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు 1983 నుంచి 1985 వరకు పాలేరు శాసనసభ్యుడిగా పనిచేశారు. 1983లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్రవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించినప్పటికీ పాలేరులో ఆ ప్రభావం కనిపించలేదు. సీపీఎం మద్దతుతో పోటీ చేసిన భూపతిరావు గెలుపొందారు. అప్పుడు తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన బుద్ద అన్నపూర్ణ కేవలం 6 వేల ఓట్లు సాధించగా, భూపతిరావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సంభాని చంద్రశేఖర్పై 8,289 ఓట్ల ఆధిక్యత సాధించారు. కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి, ముదిగొండ మండలాలతో కూడిన ఈ నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 1,00,021 ఉండగా, 75,981 ఓట్లు పోలయ్యాయి. 74,471 ఓట్లు చెల్లుబాటు కాగా, భూపతిరావు 35,915 ఓట్లు సాధించారు. సంభాని చంద్రశేఖర్కు 27,626 ఓట్లు వచ్చాయి.
ఎన్టీఆర్ నిర్ణయంతో.. 1983లో గెలిచిన భూపతిరావు 1985 వరకు మాత్రమే ఎమ్మెల్యేగా పనిచేసే అవకాశం దక్కింది. ఎన్టీ రామారావుకు 85లో అసెంబ్లీని రద్దు చేయటంతో పూర్తి స్థాయి ఎమ్మెల్యేగా పనిచేయలేకపోయారు. 1985లో ఉపఎన్నికల్లో ఒప్పందం మేరకు సీపీఐ, సీపీఎంకు మద్దతు నివ్వడం, తెదేపా కూడా కమ్యునిస్టులతో కలిసిన నేపథ్యంలో ఇక్కడ సీపీఎం అభ్యర్థి బాజీ హన్మంతు విజయం సాధించారు.
ఎంపీ, ఎమ్మెల్యేల సంతాపం: భూపతిరావు మృతికి ఎంపీ నామా నాగేశ్వరరావు, పాలేరు శాసనసభ్యుడు కందాళ ఉపేందర్రెడ్డి సంతాపం ప్రకటించారు. సీపీఐ రాష్ట్ర నాయకుడు బాగం హేమంతరావు, పార్టీ నాయకులు జి.మల్లేశ్, మండల కార్యదర్శి నర్సింహా, పార్టీ సీనియర్ నాయకుడు సంగబత్తుల వెంకటరెడ్డి తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు.
పలువురి నివాళి
తండ్రి పార్ధివదేహం వద్ద హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేశ్
భద్రాచలం పట్టణం, న్యూస్టుడే: పాలేరు మాజీ ఎమ్మెల్యే భీమపాక భూపతిరావు పార్థివదేహానికి సోమవారం భద్రాచలంలోని ఆయన స్వగృహంలో పలువురు నివాళులర్పించారు. భూపతిరావు కాలనీలో ఆయన నివాసానికి వచ్చి సంతాపం తెలిపారు.
* భూపతిరావు కుమారుడు, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేశ్ తండ్రి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఆయన వెంట పట్టణ న్యాయవాదుల సంఘం నాయకులు సీనియర్ న్యాయవాదులు రమణారావు, కొడాలి శ్రీనివాసన్, మాజీ ఏపీపీ కోటా దేవదానం, న్యాయవాదులు సాల్మన్రాజు, అక్తర్, ఎంవీ ప్రసాద్, కుంచాల రమేశ్, పడిసిరి శ్రీనివాసరావు, శివశంకర్ పాల్గొన్నారు. భద్రాచలం శాసన సభ్యుడు పొదెం వీరయ్య ఓ ప్రకటనలో తీవ్ర సంతాపం తెలిపారు. పీసీసీ నాయకుడు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని... సోమవారం భూపతిరావు పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఎంపీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం
[ 20-04-2024]
నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో భారాస ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
వివిధ అనుమతులకు సువిధ
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానానికి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే అనేక యాప్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
భాజపాను ఆశీర్వదించండి
[ 20-04-2024]
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన భాజపాను ఖమ్మం ప్రజలు లోక్సభ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ కోరారు. -
వర్షాకాలం రాకముందే పనులు ప్రారంభించాలి: మంత్రి తుమ్మల
[ 20-04-2024]
వర్షాకాలం సమీపించకముందే మున్నేరు కేబుల్ వంతెన సీసీ పనులు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. -
ఖమ్మం మార్కెట్కు మరింత ఆదాయం
[ 20-04-2024]
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు రూ.2,761 కోట్ల పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరిగాయి. -
భారాసకు మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ రాజీనామా
[ 20-04-2024]
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ శుక్రవారం ప్రకటించారు. 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన తాను కేవలం అభివృద్ధి కోసం షరతులు లేకుండా భారాసలో చేరానన్నారు. -
రైతుల ఆదాయం రెట్టింపునకు కృషి
[ 20-04-2024]
రైతుల ఆదాయం రెట్టింపయినప్పుడే వారి శ్రమకు ప్రతిఫలం దక్కినట్లని తెలంగాణ ఆయిల్ఫెడ్ ఎండీ కె.అశోక్రెడ్డి అన్నారు. -
ప్రచారం హద్దు మీరితే.. శ్రీముఖం తధ్యం!
[ 20-04-2024]
ప్రస్తుతం ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలో ప్రచారం జోరందుకుంది. నాలుగో దశలో జరగనున్న పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 18వ తేదీనే నామినేషన్ ప్రక్రియ మొదలైంది. -
వేగంగా ఉద్యోగాల్లో స్థిరపడే పాలిటెక్నిక్
[ 20-04-2024]
సాంకేతిక విద్య అభ్యసించే వారికి సాధారణ కోర్సుల వారితో పోల్చితే ఉద్యోగావకాశాలు, జీతభత్యాలు ఎక్కువ. ప్రస్తుతం నిరుద్యోగిత ప్రబలుతున్న నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కోర్సుల ఎంపికపై శ్రద్ధ పెరిగింది. -
లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడి మృతి
[ 20-04-2024]
ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన ఘటన ఖమ్మం ఎన్టీఆర్ కూడలిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... -
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోరిక బలరాంనాయక్ నామపత్రం దాఖలు చేసిన సందర్భంగా ఎన్టీఆర్ -
ఇక లెక్కలే.. మిగిలాయి..!
[ 20-04-2024]
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన కల్యాణ బ్రహ్మోత్సవాలు 23 వరకు కొనసాగనున్నప్పటికీ ప్రధాన వేడుక పూర్తి కావడంతో ఆదాయ వ్యయాల పరిశీలనపై అధికారులు దృష్టి సారించారు. -
సీతారాములకు ఘనంగా మహదాశీర్వచనం
[ 20-04-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో కల్యాణం అనంతరం పట్టాభిషేకాన్ని తిలకించిన భక్తులకు శుక్రవారం సదస్యం పేరిట మరో ఉత్సవం వీక్షించే భాగ్యం దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
వినీతాసింగ్ మృతిపై వదంతులు ..ఆమె ఏమన్నారంటే!
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి