ప్రజా ప్రతినిధులకే దళితబంధు వరం
వెనుకబడిన దళిత కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘దళిత బంధు’ పథకం అమలు చేస్తోంది. ఈ పథకం కొందరు ప్రజాప్రతినిధులు, దళారులకు వరంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల సమీక్షలు, ఆదేశాలు, ప్రభుత్వ సూచనలన్నీ
కొత్తగూడెం పట్టణం, న్యూస్టుడే
వెనుకబడిన దళిత కుటుంబాలను ఆర్థికంగా నిలబెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘దళిత బంధు’ పథకం అమలు చేస్తోంది. ఈ పథకం కొందరు ప్రజాప్రతినిధులు, దళారులకు వరంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల సమీక్షలు, ఆదేశాలు, ప్రభుత్వ సూచనలన్నీ కేవలం కాగితాలకే పరిమితం కాగా... వాస్తవ పరిస్థితుల్లో యూనిట్ మొత్తంలో సగానికి సగం కూడా లబ్ధిదారుల దరికి చేరడం లేదని తెలుస్తోంది. ఆర్థికంగా నిలబడటం మాటేమో కానీ, అదనంగా ఆర్థిక కష్టాలను కొనితెచ్చుకునే పరిస్థితులను పలువురు ఎదుర్కొంటున్నారు.
ఇదీ.. సంగతి
కొత్తగూడెం నియోజకవర్గంలో మొదటి విడత 100 యూనిట్లు మంజూరయ్యాయి. ఒక్కో యూనిట్కు రూ.10 వేల సంక్షేమి నిధి మినహాయించుకుని మిగిలిన రూ.9.90 లక్షలను లబ్ధిదారుల ఖాతాల్లోకి ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన జమ చేస్తున్నారు. ఈ మొత్తంలోంచి దళారులు రూ.5 లక్షలు వసూలు చేసి వాటాలు పంచుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దళారీ క్రతువులో ప్రధాన పాత్రధారులతో అంటకాగే కొందరు కిందిస్థాయి అధికార సిబ్బంది, అధికార పార్టీకి చెందిన ఛోటామోటా నాయకులు సైతం రూ.10 వేలకు తగ్గకుండా జేబుల్లో వేసుకుంటున్నారు. మరీ ఇంత దందా అయితే మాకు మిగిలేదమిటని ఎవరైనా లబ్ధిదారు అడిగితే.. ‘పైసా తిరిగి కట్టేది లేదుకదా?’ అని దబాయిస్తున్నారట. వాటా ఇవ్వకుంటే వేరొకరి పేరు జాబితాలో వస్తుందని బెదిరిస్తున్నారట. ఇదీ.. నియోజకవర్గంలో ‘దళితబంధు’ లబ్ధిదారుల దయనీయ స్థితి. త్వరలో రెండో జాబితాగా జిల్లాకు 500.. ఇందులో కొత్తగూడెం నియోజకవర్గానికి 100 యూనిట్లు మంజూరు చేసేందుకు సిద్ధం చేయాలని సమీక్షల్లో కలెక్టర్ సైతం ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇదే సమయంలో నిజమైన అర్హులను ఎంపిక చేసి.. ఎక్కడా వసూళ్ల దందా జరగకుండా చూడాలని దళితులు కోరుతున్నారు.
* ‘గూడెం’లో ఓ వార్డుకు చెందిన ప్రజాప్రతినిధి భర్త స్థానిక దళితుడికి మొదటి విడత దళితబంధు పథకం ఇప్పిస్తానన్నాడు. వచ్చే మొత్తంలో సగం ఇవ్వాలని తేల్చి చెప్పాడు. లేకపోతే వేరొకరు రెడీగా ఉన్నారనడంతో ఆ వ్యక్తి సరేనన్నాడు. ఇటీవల యూనిట్ కింద తొలి దఫా రూ.5 లక్షలు రాగా అందులో సగం కోత విధించుకుని మిగతా లబ్ధిదారుడికి అప్పగించాడు.
* ప్రజాప్రతినిధులైన వారికే ఏకంగా దళితబంధు మంజూరవడంతో ఆయా వార్డుల్లో పేదలైన దళితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘గూడెం’లో 36 మంది కౌన్సిలర్లు, నలుగురు కో ఆప్షన్ సభ్యులుండగా.. ఎక్కువ చోట్ల వారి కుటుంబీకులు, బంధువులే ఎంపికకావడం గమనార్హం.
* దీనికి తోడు కొందరు సంఘాల నాయకులు, గతంలో పలు రుణాలిప్పించిన అనుభవం ఉన్న కొందరు మధ్యవర్తులు పథకం పేరుతో అమాయకుల నుంచి రూ.లక్షల్లో దండుకుని మొహం చాటేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కొందరు కొత్తగా మంజూరయ్యే జాబితాలో చోటు కల్పిస్తామని మభ్యపెడుతుండటం గమనార్హం.
* ‘పథకం అమలులో దళారులను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఎంపికలు పారదర్శకంగానే కొనసాగుతాయి. మధ్యవర్తులకు డబ్బులిచ్చి నష్టపోవద్దన్నది’ అధికారుల మాట.
పారదర్శకత ఏదీ?
లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా ఎమ్మెల్యే ఆధీనంలో కొనసాగాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలివిడత 100 యూనిట్లు మంజూరయ్యాయి. వీటిలో కొత్తగూడెం, పాల్వంచ పురపాలకాల్లోని వార్డుకు ఒక యూనిట్ చొప్పున, మిగతావి గ్రామాలకు సమాన ప్రాతినిధ్యంలో కేటాయించాలన్నది ప్రజాప్రతినిధి, అధికారుల నిర్ణయం. కానీ ఇదే సమయంలో రాజకీయ బలం ఉన్న కొందరు మధ్యవర్తులు ముందే లబ్ధిదారులతో 50 శాతం వాటాతో ఒప్పందం చేసుకోగా, ఎక్కువ యూనిట్లు వారికే దక్కినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. సంఘాల పేరుతో హడావుడి చేస్తూ కొందరు నాయకుల మెప్పుపొందే వారి తరఫున కూడా కొన్ని యూనిట్లు మంజూరు చేశారన్న విమర్శలున్నాయి. సగం వాటా దళారులకే చెందడంతో ఇక దుకాణం పెట్టడానికి పెట్టుబడే లేకుండా పోయిందని కొందరు.. రాజకీయంగా, సామాజికంగా పలుకుబడి ఉన్నవారేమో మొక్కుబడిగా యూనిట్లు ప్రారంభించి అంతా మ.మ. అనిపించడం కొసమెరుపు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగాలను ఏలిన రామయ్యకు పట్టాభిషేకం
[ 19-04-2024]
ధర్మమే ఆకారం దాల్చిన రామావతారుడు భద్రగిరిలో కొలువై ఉండగా తక్కువేమి మనకు అంటూ కోలాటాలు ఆడారు. -
తొలిరోజు ఖమ్మంలో ఒకటే నామినేషన్
[ 19-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో తొలిరోజు గురువారం ఒక నామపత్రం దాఖలైంది. అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఆదార్) పార్టీ తరఫున ముదిగొండ మండలం గంధసిరికి చెందిన కుక్కల నాగయ్య ఒక సెట్ నామపత్రాలను ఆర్ఓ గౌతమ్కు అందజేశారు -
ఏ పత్రం.. ఏం చెబుతుందంటే..?
[ 19-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రకటన గురువారం వెలువడింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫాం-1 ద్వారా ఆయా స్థానాల్లో నోటీసు జారీ చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లను గురువారం నుంచే స్వీకరిస్తున్నారు. -
అడుగంటిన జలం.. అపర భగీరథ ప్రయత్నం
[ 19-04-2024]
అడుగంటిన భూగర్భజలాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో కొందరు రైతులు పామాయిల్ సాగు చేశారు. -
18లో మేలుకొలుపు ప్రజాస్వామ్య గెలుపు
[ 19-04-2024]
ప్రజాస్వామ్య ఎన్నికల్లో యువ ఓటర్ల చైతన్యమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం వినూత్న ప్రయోగాలు చేస్తోంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కొత్తగా చేపట్టే కార్యక్రమం.. ‘టర్నింగ్-18’. అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నిక ప్రక్రియలో ఏ ఒక్కఓటరూ వెనకబడకుండా చూడటమే అంతిమ లక్ష్యం. -
బేతుపల్లి అంకమ్మతల్లి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి
[ 19-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బేతుపల్లి అంకమ్మ తల్లి తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మవారిని ఊరేగించే రథాలను సిద్ధం చేశారు. -
ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
[ 19-04-2024]
జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో క్రోధి నామ సంవత్సర వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. స్వామి వారికి ప్రాతఃకాల అర్చనల అనంతరం యజ్ఞశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు -
సోనియా రుణం తీర్చుకోవాలి: మంత్రి తుమ్మల
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ అగ్రనేత సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు -
గుళికల మందు మింగి బలవన్మరణం
[ 19-04-2024]
గుళికల మందు మింగి ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ నాగేశ్వరరావు కథనం ప్రకారం.. అశ్వారావవుపేట కోతమిషన్ బజారులో కూలీ పనులు చేస్తూ జీవించే బమ్మిడి సాంబయ్య(62)కు పదిహేనేళ్ల కిందట కడుపు పైభాగంలో కణితి ఏర్పడింది -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
[ 19-04-2024]
రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన జూలూరుపాడు మండలం సాయిరాంతండా వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్